India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పిఠాపురానికి చెందిన అక్కాచెల్లెళ్లను అదే గ్రామానికి చెందిన హేమంత్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో అతడికి 30ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. ఈ మేరకు కాకినాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శ్రీదేవి మంగళవారం తీర్పు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిపై రెండేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల తండ్రి ఫిర్యాదుతో 2019లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గొల్లప్రోలులో మంగళవారం నడిరోడ్డుపై కత్తితో హల్ చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మండల పరిధిలోని చెందుర్తి గ్రామానికి చెందిన ఆ విద్యార్థి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చెందుర్తి గ్రామానికి చెందిన మరో విద్యార్థినిపై దాడి చేసి స్థానికులను కత్తితో బెదిరించాడు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు వెళ్లింది.

తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని సూచించినట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

కె.గంగవరం (M) కూళ్ళలో జరిగిన యువకుడి హత్య అక్రమ సంబంధం కారణంగా జరిగిందని రామచంద్రపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ డీఆర్కెఎస్. ప్రసాద్ తెలిపారు. ఆయన మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు, మృతి చెందిన వ్యక్తి మంచి మిత్రులని.. మృతి చెందిన సత్తి సువర్ణ రత్నం తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెంకట సూర్య చంద్ర అనుమానించి హత్య చేసినట్లు పేర్కొన్నారు.

కే.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూళ్ల గ్రామంలో సోమవారం రాత్రి సత్తి సువర్ణ రత్నం (35)ని అదే గ్రామానికి చెందిన మంచాల వెంకట సూర్య చంద్ర వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ తరువాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15 లక్షల 31 వేల 161 మంది ఓటర్లు ఉన్నారు. ఇన్ఛార్జ్ డీఆర్ఓ మాధవి సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 7 లక్షల 72 వేల 150 మంది, పురుషులు 7 లక్షల 58 వేల 984 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా ఆమె విడుదల చేశారు.

పెద్దాపురం ఇండస్ట్రియల్ ప్రాంతంలో సోమవారం లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట గణపతి నగరానికి చెందిన పెంకె అప్పారావు బైక్పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు అప్పారావు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాకినాడ నుంచి షిర్డీ వెళ్తున్న షిర్డీ ఎక్స్ప్రెస్ టైన్ను రాజమండ్రిలో రైల్వే అధికారులు నిలిపివేశారు. కాకినాడ, సామర్లకోటలో ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. వారు ఫిర్యాదు చేయడంతో ఈ ట్రైన్ ఆపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారిని వేరే రైలు ద్వారా కాకినాడ, సామర్లకోట నుంచి రాజమండ్రికి తీసుకొస్తున్నారు. ప్రయాణికుల కోసం సుమారు 2గంటలకుపైగా రాజమండ్రిలోనే షిర్డీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది.

➤కాకినాడ టౌన్-చర్లపల్లి(07038): 14వ తేదీ
➤సికింద్రాబాద్-కాకినాడ(07078): 12, 19
➤చర్లపల్లి-కాకినాడ(07031): 8, 10, 14, 16, 18
➤కాకినాడ-చర్లపల్లి(07032): 9, 11, 13, 15
➤నాందేడ్-కాకినాడ(07487): 6, 13
➤కాకినాడ-నాందేడ్(07488): 7,14 తేదీల్లో
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.

సంక్రాంతి సందర్భంగా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు సామర్లకోట స్టేషన్ అధికారి రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాకినాడ, సికింద్రాబాద్, చర్లపల్లి, తిరుపతి, వికారాబాద్, కాచిగూడ, తదితర ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ రైల్వే శాఖ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.