India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధవళేశ్వరం కాటన్పేట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని జాలరిపేటకు చెందిన నాగమల్లి ముత్యాలరావు(18), బొడ్డు వెంకటేశ్(16) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మంగళవారం ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్పై ఓవర్టేక్ చేయబోయి వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కేంద్ర బడ్జెట్ 2025 మేధావుల సమావేశం రాజమండ్రిలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఎంపీ పురందీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➤ రాజమండ్రి: రేపు PGRS రద్దు ➤ గోకవరం: ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ ➤ అనపర్తి: నల్లమిల్లి ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు ➤ రాజమండ్రి: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ➤ బిక్కవోలులో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర ➤ రాజమండ్రి: పార్లమెంటు పరిధిలో పర్యటించిన ఎంపీ ➤ దేవరపల్లి: చికెన్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత ➤ రాజమండ్రి: ‘MLC అభ్యర్థి రాజశేఖర్ని గెలిపించండి’

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటాన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి క్వారీ నిర్వహణ చేపట్టరాదని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో ఆదేశించారు. అనుమతి రవాణా పత్రం లేకుండా ఖనిజ రవాణా నిర్వహించకూడదన్నారు. నియమాలు ఉల్లంఘన చేసిన వారు శిక్షార్హులని, అటువంటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

➤కొవ్వూరు: హీరో రామ్ను కలిసిన మంత్రి దుర్గేశ్
➤అనపర్తి: నల్లమిల్లి తనయుడిని ఆశీర్వదించిన తోట
➤కడియం: చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అరెస్ట్
➤సీతానగరంలో కమెడియన్ల సందడి
➤కొవ్వూరు: హత్య కేసులో ముద్దాయి అరెస్ట్
➤రాజమండ్రి: పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి
➤రాజమండ్రిలో కేంద్ర మంత్రి పర్యటన
➤రాజానగరం: ఫ్లై ఓవర్ బ్రిడ్జ్కు గ్రీన్ సిగ్నల్..!
➤కొంతమూరులో చెత్త సేకరణపై అవగాహన

కొవ్వూరు సమీపంలోని కుమారదేవంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో జరుగుతున్న #RAPO22 షూటింగ్కి వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి.మహేష్ బాబులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మంత్రి దుర్గేశ్కి ఘన స్వాగతం పలికింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లాలోని కెమికల్ ఆధారిత, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి, భద్రత ప్రమాణాలు, వాటినుంచి వెలువడే రసాయనాలను, వాయువులు స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంతి శనివారం రాజమండ్రిలో ఆదేశించారు. పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించే లేదని కలెక్టర్ హెచ్చరించారు.

అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. విశ్వనాథం మరణం పట్ల పీఎం విచారం వ్యక్తం చేస్తూ తండ్రి ప్రేరణతో సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎదిగిన విధానం ప్రస్తావించారు. విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.