India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో ప్రాధాన్యం కలిగి ఉండాలని, ఆ మేరకు 100 రోజుల ప్రణాళికను అధికారులు అందజేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఇన్ఛార్జి జేసీ జి.నరసింహులుతో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్, 2047పై రాష్ట్ర చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలుకు సామర్లకోటలో ప్రయోగాత్మకంగా ఈనెల 3వ తేదీ నుంచి హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. 6 నెలలపాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించిన 256 మంది క్లస్టర్ సిబ్బందికి సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు DRDA PD శివశంకర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ 8 గంటల వరకు ప్రారంభించలేదని నోటీసులలో పేర్కొన్నారు. ఆ 256 మందిలో 32 మంది కలెక్టర్ కార్యాలయంలో సంజాయిషీ ఇవ్వగా.. మిగిలిన వారు ఈనెల 10వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలన్నారు.
రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు, ఐదు సహాయ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీఎల్ఎఫ్ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్సైట్ నందు గానీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నోటీస్ బోర్డు నందు గానీ అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. ఈనెల 9లోగా దరఖాస్తు చేయాలన్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం గత 3 రోజుల నుంచి నిలకడగా ఉంది. మంగళవారం ఉదయం 7 గంటలకు 8.90 అడుగులకు చేరి నీటిమట్టం సాధారణ స్థాయిలో ఉంది. 6.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు.
దేశవ్యాప్తంగా 2022- 2025 మధ్యకాలంలో లీజుకు ఇవ్వాలని గుర్తించిన విమానాశ్రయాల్లో రాజమండ్రి విమానాశ్రయం ఒకటని కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. ఉత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకునేందుకే ఈ విమానాశ్రయాలను లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు.
అంబాజీపేట మండలం గంగలకుర్రుకు చెందిన విజయ్ అదే గ్రామంలోని అమ్మాయితో ఈ నెల 3న రాత్రి ఆమె ఇంటి వద్ద మాట్లాడుతున్నాడని అంబాజీపేట SI చిరంజీవి సోమవారం తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులు అతణ్ని ప్రశ్నించడంతో వివాదం జరిగిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ సూర్యనారాయణ అక్కడికి చేరుకొని విచారించారు. దీంతో విజయ్ ఏఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 7 గంటలకు 6,33,226 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టాకు 3,800, మధ్య డెల్టాకు 2000, పశ్చిమ డెల్టాకు 5000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మంగళవారం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తొండంగి మండలంలో ఓ మహిళా ఇంజినీరింగ్ అసిస్టెంట్ అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ఉప్పాడ మండలం అమరవిల్లికి చెందిన లలిత ఐదేళ్లుగా GMపేట సచివాలయంలో ఇంజినీర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. శనివారం విధులకు హాజరై సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరింది. రాత్రి 7:40 గంటలకు కాకినాడ పోర్ట్ ప్రాంతంలో ఆమె సిగ్నల్ కట్ అయింది. అంతకుముందు ఆమె అన్నయ్యకు చనిపోతున్నానని మెసేజ్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదైంది.
పిఠాపురంలో గత ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయే స్థలాలను రూ.కోట్లల్లో కొని ప్రజలకు కేటాయించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.