EastGodavari

News July 17, 2024

కాకినాడలో రామేశంమెట్టను తవ్వేశారు

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశంపేట పరిధిలోని రామేశంమెట్ట వార్తల్లోకెక్కింది. గుట్ట ప్రాంతంలో ఎర్రమట్టి తవ్వకాలు భారీ ఎత్తున జరిగినట్లున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభాల చుట్టూ కొంతమేర మట్టి వదిలి.. వాటి చుట్టూ దాదాపు 50 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. తాజాగా అధికారులు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.

News July 17, 2024

పాఠశాల నుంచి వస్తున్న బాలికపై అత్యాచారయత్నం

image

ఉమ్మడి తూ.గో జిల్లా కాట్రేనికోన మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ నాగేశ్వరరావు వివరాల మేరకు.. ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఈనెల 12వ తేదీని పాఠశాలకు వెళ్లింది. ఆ బాలిక తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ చెప్పారు.

News July 16, 2024

రావులపాలెం: రికార్డు స్థాయిలో అరటి ధరలు

image

అరటి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం రేట్లు లేక దిగాలు పడిన రైతులకు తాజా ధరలు ఆనందం కలిగిస్తున్నాయి. కర్పూర గెల గరిష్ఠంగా రూ.500, చక్రకేళి, ఎర్రచక్ర కేళి, అమృతపాణి, బొంత గెలలకు సైతం ధరలు పెరిగాయి. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన రావులపాలెం యార్డుకు నిత్యం 10 నుంచి 15 వేలు గెలలు వస్తుంటాయి. వీటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

News July 16, 2024

కాకినాడ: మాజీ సిపాయి మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన మాజీ సిపాయి సబ్బతి భీమరాజు (94) మృతిచెందారు. కాకినాడలోని స్థానిక కచ్చేరిపేటలో మనుమరాలు నివాసంలో ఉంటూ సోమవారం తుదిశ్వాస విడిచారు. భీమరాజు సైన్యంలో బెటాలియన్ హవల్దార్ మేజర్‌గా పనిచేశారు. గతంలో పాకిస్థాన్, చైనా యుద్ధాల్లోనూ పాల్గొన్నారు. కాగా ఆయనకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

News July 16, 2024

తూ.గో.: అదృశ్యమైన బాలిక.. తల్లిదండ్రుల చెంతకు

image

రాజమండ్రికి చెందిన ఓ బాలిక(17) ఈ నెల 11న అదృశ్యమవగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను 12వ తేదీన అహ్మదాబాద్‌లో గుర్తించారు. DSP అంబికాప్రసాద్ తెలిపిన వివరాలు.. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న బాలికకు విశాఖలో చదువుతున్న అగర్వాల్‌‌తో ఇన్‌స్టాలో పరిచయమైంది. ఈ క్రమంలో యువకుడితో వెళ్లిపోయింది. బాలికను సురక్షితంగా అప్పగించిన CI, SI, కానిస్టేబుల్‌లను SP అభినందించారు.

News July 16, 2024

తూ.గో జిల్లా పోలీస్ స్పందనకు 21 ఫిర్యాదులు

image

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై 21 ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.

News July 16, 2024

కాకినాడలో ఇద్దరికి కారుణ్య నియామక పత్రాలు

image

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్‌రావు సోమవారం ఇద్దరికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. జగన్నాథపురం ఎంఎస్ఎన్ మూర్తి మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తూ మరణించిన సత్యనారాయణ స్థానంలో ఆయన భార్య దుర్గాదేవికి నగరపాలక సంస్థ సాధారణ విభాగంలో.. ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ మృతి చెందిన తాతబ్బాయి స్థానంలో ఆయన సతీమణి సంగంరెడ్డి భవానికి పారిశుద్ధ్య కార్మికురాలిగా పత్రాలు అందజేశారు.

News July 15, 2024

తూ.గో: GOOD NEWS.. పోస్టాఫీసులో 111 ఉద్యోగాలు

image

పదో తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అమలాపురం డివిజన్‌లో 28, కాకినాడ డివిజన్‌లో 29, రాజమండ్రి డివిజన్‌లో 54 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం-రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం-రూ.10 వేలు+అలవెన్సులు ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
☞ SHARE IT..

News July 15, 2024

కోనసీమ: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం తామరపల్లికి చెందిన ఎం.భవాని హత్య కేసులో ఆమె భర్త శ్రీనుకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి విజయ్ గౌతమ్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. 2021 OCT 13న తన కుమార్తె భవానీని భర్త శ్రీను హత్య చేశాడని గుత్తుల శేషారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారన్నారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిండితుడికి శిక్ష విధించారని తెలిపారు.

News July 15, 2024

తూ.గో: గల్లంతై 2 రోజులకు దొరికిన DEAD BODY

image

గంగవరం మండలం నెల్లిపూడి వాగులో శనివారం <<13622137>>కొట్టుకుపోయిన <<>>లోత మోహన్‌రావు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. వాగు పొంగుతున్న సమయంలో మోహన్ తన స్కూటీపై వంతెన దాటుతుండగా అదుపు తప్పి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నెల్లిపూడి శివారులో కాలువ మధ్య పొదల్లో మృతదేహం దొరికింది. పోస్టుమార్టం నిర్వహించి డెడ్‌బాడీని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.