India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కి లేఖ రాశారు. కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. వైసీపీ కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి రిజర్వేషన్ అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో తాను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని చెప్పారన్నారు. పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రత్తిపాడు(M) ధర్మవరం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో శివ(22) అనే యువకుడు <<15196950>>మృతి చెందిన<<>> సంగతి తెలిసిందే. బైక్పై నిదానంగానే వెళ్తున్నా మృత్యువు లారీ రూపంలో వచ్చి బలితీసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. వెళ్లొస్తా అంటూ హుషారుగా ఇంట్లో చెప్పి వెళ్లిన కుర్రాడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం పేరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి మండలంలోని గుడిసె హిల్ స్టేషన్కు వెళ్లేందుకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన టోల్ గెట్లో చెల్లించవలసిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఫోర్ వీలర్కు రూ. 300, టు వీలర్కు రూ. 100, ప్రతీ వ్యక్తికి రూ. 100 ప్రవేశ రుసుము చెల్లించాలి. వీడియో కెమెరాకు రూ.1000, డ్రోన్ కెమెరాకు రూ. 2000 చెల్లించాలి. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 500 ఫైన్ పడుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన రాజామని శివ (22)పేరవరం నుంచి తుని పంక్షన్కు వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

కూనవరం మండలం చిన్నారుకుర్ పెద్ద చెరువులో ఆదివారం ఆదివాసీలు సామూహిక చేపల వేట నిర్వహించారు. సంక్రాంతి తర్వాత సంప్రదాయంగా చేపల వేట చేస్తామన్నారు. నాలుగు మండలాల నుంచి 3000 మంది చిన్నా ,పెద్దా తేడా లేకుండా ఆదివాసీ పెద్దల సమక్షంలో చేపల వేట సాగించారు. గ్రామ పెద్దలు బంధువులు అందరికీ కబురు పెట్టి వారి సమక్షంలో వయసుతో నిమిత్తం లేకుండా ఈ వేట సాగిస్తారన్నారు.

పిఠాపురంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు బూరుగుపాలెంకు చెందిన గూనూరు భరత్(22)గా గుర్తించారు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్లో ఉద్యోగం చేశాడు. ప్రేమించిన యువతి దూరమవుతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు.

ఈనెల 20వ తేదీన సోమవారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని సూచించారు.

ఆవుకు 19 అంగుళాల చిన్నిదూడ పుట్టింది. దీంతో ప్రజలు ఆ దూడని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని అగ్రహారంలో తాడల సాయి శ్రీనివాస్ ఎంబీఏ చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయికి మూగ జీవాలపై ఉన్న ప్రేమతో గత 3 సంవత్సరాల నుంచి తన ఇంట్లో పుంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుకుంటున్నాడు. శనివారం ఆ ఆవు 19 అంగుళాల దూడకు జన్మనిచ్చింది. చిన్నగా చూడచక్కగా ఉంది.

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్లో పీఎం ఇంటర్న్ షిప్ పథకం గోడ ప్రతులను జిల్లా పరిశ్రమల అధికారి రామన్, సహాయ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, నైపుణ్య అభివృద్ధి అధికారి పెరుమాళ్ళరావుతో ఆవిష్కరించారు.
Sorry, no posts matched your criteria.