EastGodavari

News July 13, 2024

తూ.గో.: ఈ నెల 18న పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండో సంవత్సరం డిప్లమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జనార్దనరావు తెలిపారు. ఐవీసీ ఇంటర్ ఉత్తీర్ణత సాధించినవారు 16వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. 18న ప్రవేశాలు ఉంటాయన్నారు.

News July 13, 2024

పిఠాపురంపై స్పెషల్ ఫోకస్.. ఛత్తీస్‌ఘడ్‌ ప్రాజెక్ట్ ఇక్కడికి

image

ఛత్తీస్‌ఘడ్‌లో విజయవంతంగా అమలవుతున్న ఘన, ధ్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో తొలుత పిఠాపురం నుంచే ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గంలో గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలు ఉండగా, 52 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ఉత్పత్తి అయిన చెత్తను సేకరించి అందులో ప్లాస్టిక్ వస్తువులను వేరుచేసి ‘రీసైక్లింగ్’కి విక్రయిస్తారు. ఇక తడిచెత్తతో తయారైన ఎరువును అటవీ నర్సరీలకు సరఫరా చేస్తారు.

News July 13, 2024

జాతీయస్థాయిలో మండపేట విద్యార్థి ప్రతిభ

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఆర్తమూరుకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి గుమ్మిడి అనిల్ కుమార్ తనయుడు గుమ్మడి ధీరజ్ జాతీయస్థాయి పరీక్షలో ఆల్‌ఇండియా ర్యాంక్ సాధించాడు. పదో తరగతి తర్వాత NTA శ్రేష్ట- 2024 పరీక్షలో ఆల్ ఇండియాలో 1330 ర్యాంక్ సాధించి, పఠాన్ కోట్‌లో సీటు పొందాడు. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

News July 12, 2024

అమలాపురం: 10th అమ్మాయికి వేధింపులు.. వ్యక్తి అరెస్ట్

image

అమలాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిషోర్ శుక్రవారం తెలిపారు. ఫిర్యాదు అందిన 36 గంటల్లో నిందితుడిని పట్టుకుని అమలాపురం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించిందని తెలిపారు. అతడిని కొత్తపేట జైలుకి పంపామన్నారు.

News July 12, 2024

కాకినాడ: రాయితీపై కందిపుప్పు, బియ్యం సరఫరా

image

కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది పప్పు, బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు.వైసిపి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ ఓ ప్రసాద్ పాల్గొన్నారు.

News July 12, 2024

తూ.గో జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

image

తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, అనపర్తి ,కోనసీమ, సామర్లకోట,ఏజెన్సీ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. పనుల కోసం అడవులలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.

News July 12, 2024

రాజమండ్రి: జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు ప్రత్యేక రైళ్లు

image

ఉత్తరాఖండ్ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైళ్లు ఆగస్టు 4, 8 తేదీల్లో నడుపుతున్నామని IRCTC ఏరియా మేనేజర్ రాజా గురువారం తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో రైళ్ల వివరాల బ్రోచర్లను స్టేషన్ మేనేజర్ రంగనాథ్, సీటీఐ చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్ యాత్ర ఆగస్టు 8న విశాఖపట్నంలో బయలు దేరి రాజమహేంద్రవరం వస్తుందన్నారు. 11 రోజులు యాత్ర సాగుతుందన్నారు.

News July 12, 2024

కొత్తపేట: బాలికపై ఆగంతకుడు అత్యాచారయత్నం

image

బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కొత్తపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. విద్యార్థిని బుధవారం స్నేహితురాలితో మరుగుదొడ్డికి వెళ్ళింది. బాత్‌రూమ్‌లో నక్కిన ఆగంతకుడు కత్తితో బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు.దీనిపై గురువారం కొత్తపేట ఎస్సై అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 12, 2024

పెద్దాపురం మరిడమ్మ తల్లి బ్రేక్ దర్శనాలు రద్దు

image

పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో రామ్మోహన్ రావు, ధర్మకర్త బ్రహ్మాజీ తెలిపారు. గురువారం రాత్రి అమ్మవారికి మహా కుంభం నిర్వహించినందున శుక్రవారం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. శనివారం మహా సంప్రోక్షణ అనంతరం మరిడమ్మ తల్లి దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని రామ్మోహన్‌రావు తెలిపారు.

News July 11, 2024

బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఉరుకులు పరుగులు

image

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో గురువారం ఓ బాలుడు మిస్సింగ్ అయినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సదరు బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని పోలీసులు వెళ్లి మరోసారి ఇంట్లో వెతకగా.. ఆ బాలుడు మంచం కింద నక్కి కనిపించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.