India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉప్పాడ తీర ప్రాంతంలో ఎప్పుడు అలలు మింగేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఉప్పాడలో ఇప్పటివరకు 1,360 ఎకరాలు కోతకు గురయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో చెన్నైకి చెందిన NCR నిపుణుల బృందం ఉప్పాడ తీరంలో కోత కట్టడికి 20ఏళ్లకు ప్రణాళిక సిద్ధం చేసింది. రక్షణ గోడ, గ్రోయన్ ఏర్పాటుకు రూ.200-250 కోట్ల వరకు అవుతుందని పేర్కొంది.
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు.
నిడదవోలు నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 3ఏళ్ల కిందట పురపాలక ఎన్నికల్లో 27 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలవగా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు పార్టీ మారేందుకు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ మంత్రి అయిన విషయం తెలిసిందే.
తూ.గో జిల్లాకు చెందిన ఏడుగురి మృతికి కారణమైన షేక్ మహబూబ్ జానీ అనే వ్యక్తికి యావజ్జీన కారాగార శిక్ష పడింది. వీరవల్లి ఏఎస్సై వివరాల మేరకు..2014లో ప్రమాదకర రసాయనాలు ఉన్న డ్రమ్ములను హైదరాబాద్ నుంచి తణుకుకు బయలుదేరాడు. దారి మధ్యలో తూ.గో జిల్లా వాసులు ఏడుగురిని వ్యానులో ఎక్కించుకున్నాడు. రసాయనాల నుంచి మంటలు వ్యాపించడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు . దీనిపై బుధవారం నూజివీడు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
విజయవాడలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి కుమార్లను బుధవారం కాకినాడ రూరల్ టీడీపీ కో-ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ MLA పిల్లి అనంత లక్ష్మి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ పకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం తెలిపారు. కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కాకినాడ APSRTC డిపో పరిధిలో బస్ డ్రైవర్గా పనిచేస్తున్న మందపల్లి శ్రీనివాసరావు గత నెల 8, 9 తేదీలలో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మేరకు ఆయన్ను కాకినాడ కలెక్టర్ శన్మోహన్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన కోసం కృషి చేశానని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. మోరంపూడి సెంటర్లో జరిగిన ప్రమాదాలను అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి వంతెన నిర్మాణ పనులు మంజూరు చేయించానని తెలిపారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వంతెన నిర్మాణ పనులు ఆయనే మంజూరు చేయించినట్టు ప్రచారం చేసుకోవటం సరికాదన్నారు.
శతాబ్ధి కాలం సేవలందించిన రాజమండ్రిలోని హెవలాక్ వంతెనను పర్యాటకంగా, వాణిజ్య సముదాయంగా తీర్చిదిద్దేందుకు అధికారులు రూ.160 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.2.95 కిలోమీటర్లు పొడవుతో 56 స్తంభాలతో నిర్మించిన ఈ వంతెనను 1997లో మూసివేశారు. పాదచారులతో పాటు యోగా, వ్యాయమం చేసుకునేలా గోదావరి లంక గ్రామాలతో అనుసంధానం చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆలమూరు సబ్ జైలు నుంచి 2002 మే 29 ముగ్గురు ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయిన కారణంగా జైలు మూతపడింది. మండపేట, అంగర, ఆలమూరు పోలీసు స్టేషన్లతో పాటు SEB స్టేషన్లలోని రిమాండ్ ఖైదీలను వాయిదాలకు రామచంద్రపురం నుంచి ఆలమూరు కోర్టుకు తీసుకురావాల్సి ఉంది. ఆలమూరు సబ్ జైలు మూసివేయడంతో ఇది పోలీసులకు సవాలుగా మారింది. అధికారులు స్పందించి సబ్ జైలును తెరిపించాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.