India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజానగరం మండలం జి.యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బిజినెస్ కరస్పాండెంట్ నానిబాబు చేసిన అవినీతిపై డీఆర్డీఏ చేపట్టిన విచారణ తుది దశకు చేరింది. బ్యాంకు పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన 116 స్వయం సహాయక సంఘాలలో 109 సంఘాల ప్రతినిధులను అధికారులు విచారించారు. రూ.62 లక్షల పైబడి స్కామ్ జరిగినట్లు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందించారు. మరో ఏడు సంఘాలను విచారించాల్సి ఉందని పేర్కొన్నారు.
మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్డులో మంగళవారం జరిగిన ప్రమాదంలో చింతూరు SEB స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎండీ చాంద్ భాషా (52) మృతి చెందారు. తులసిపాక సమీపంలో వ్యూ పాయింట్ వద్ద భాషా మృత దేహం పడిఉండటాన్ని గమనించిన పర్యాటకులు 108కు సమాచారం ఇచ్చారు. భాషా విధులు ముగించుకొని చింతూరు నుంచి బైకుపై మారేడుమిల్లి వైపు వస్తుండగా ఘటన జరిగింది. ఆయన కాకినాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్గా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ దినేశ్ కుమార్కు మంగళవారం బాధ్యతలు అప్పగించారు. జిల్లా జేసీగా వ్యవహరిస్తున్న తేజ్ భరత్ 15 రోజుల పాటు పితృత్వ (వెటర్నిటీ) సెలవులో వెళ్లడంతో ..ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా సెలవుల అనంతరం జేసీ తిరిగి జాయిన్ అవుతారు.
పిఠాపురంలో రోజూ 25 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 1.3 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. అలాగే పాదగయ క్షేత్రంలో దాదాపు 1200 ప్యాకెట్ల ప్రసాదాలు విక్రయిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా 1200 పీవోపీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. పిఠాపురంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించం, మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న పవన్ కళ్యాణ్ <<13594334>>ప్రతిపాదనతో <<>>ఏ మేర మార్పు వస్తుందో చూడాలి మరి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరిని మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు ఉన్నారు.
రాజమండ్రి ఎంపీ పురందేశ్వరిని మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ మంగళవారం రాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మురళీ మోహన్ ఎంపీ పురందేశ్వరికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడపలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గోవిందు పాల్గొన్నారు.
కూనవరం మండలం బండారుగూడెం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు టీచర్ పాఠాలు చెబుతున్న సమయంలో గది శ్లాబ్ పెచ్చులు ఊడిపడిన ఘటన మంగళవారం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు గదిలోనే ఉన్నప్పటికీ ఎవరిపైనా పడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. HM కుమారి మాట్లాడుతూ.. భవనం శిథిలావస్థకు చేరడంతో బయటే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నామన్నారు. అధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పోస్టల్ శాఖ అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ కె.శేషారావు సూచించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన అడపా వెంకటేశ్వర్లు అనే యువకుడు వారం రోజుల కింద రూ.359 చెల్లించి పోస్టల్లో ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకున్నాడు. ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. నామినీగా ఉన్న అడపా లక్ష్మికి రూ.10లక్షల బీమా చెక్కును శేషారావు అందజేశారు.
తూ.గో జిల్లా గోపాలపురం మండలంలో విషాదం నెలకొంది. చిట్యాలకు చెందిన యువకుడు అమెరికాలో వాటర్ ఫాల్స్లో పడి మృతి చెందాడు. శ్రీనివాస్-శిరీష దంపతుల కుమార్తె అమెరికాలో ఉంటుండగా.. కుమారుడు అవినాశ్ MS చేసేందుకు అక్కడికి వెళ్లాడు. అక్క వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన అవినాశ్.. నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ జిల్లా తాళ్లరేవు పరిధిలోని కోరింగ ఫారెస్ట్లో ఫిషింగ్ క్యాట్స్(నీటి పిల్లులు) లెక్కింపుపై అటవీ శాఖ ఫోకస్ పెట్టింది. వాటిని సంరక్షించాలని ఈనెల 2న కాకినాడ కలెక్టరేట్లో జరిగిన కీలక శాఖల సమీక్షలో పవన్ అధికారులకు సూచించారు. 2018 నాటికే అక్కడ 118 ఫిషింగ్ క్యాట్స్ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వాటి వివరాల కోసం 100 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.