EastGodavari

News January 31, 2025

తూ.గో : ఫిబ్రవరి 1న పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు పూర్తి- కలెక్టర్

image

ఫిబ్రవరి 1న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు శుక్రవారం రాజమండ్రిలో ఆమె వివరించారు. తూ.గో జిల్లాలోని 9,041 క్లస్టర్ ఏరియాలో 5,158 మంది పీడీఓల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News January 31, 2025

రాజమండ్రి పార్కులో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

రాజమండ్రిలోని పివీ నరసింహరావు పార్కులో గురువారం బేస్త వీధికి చెందిన అద్దంకి రమణ (52)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. రమణ బంగారం షాపులో పనిచేస్తుంటారని తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుధవారం షాపు నుంచి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని కుటుంబీకులు అన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 30, 2025

రంగంపేట: మాగంటి రూపకి శుభలేఖ అందజేసిన ఎమ్మెల్యే 

image

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి వివాహం ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లమిల్లి హైదరాబాదులో పలువురు ప్రముఖులకు వివాహ ఆహ్వానాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి మాజీ ఎంపీ, మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపకి కళ్యాణ శుభలేఖను అందజేశారు. కార్యక్రమంలో గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు పాల్గొన్నారు.

News January 30, 2025

తూ. గో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4.గంటల వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవకోటి పోటీ బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

News January 30, 2025

దేవరపల్లి: దంపతులను ఢీకొట్టిన వాహనం..భర్త మృతి

image

దేవరపల్లి హైవేపై గురువారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. గుర్తుతెలియని వాహనం దంపతులను ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్ర మహిళను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు బుట్టాయిగూడెం మండలం కట్టం శంకురు (34), భార్య ప్రమీలగా దేవరపల్లి పోలీసులు గుర్తించారు. ఎస్సై సుబ్రహ్మణ్యం కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News January 30, 2025

రంప: అనంత బాబు కేసుపై పునః విచారణ చేయాలి

image

దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన MLC అనంత బాబు కేసుపై పునః విచారణ జరపాలని మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు ను కలసి వినతి పత్రం అందజేశారు. సుబ్రహ్మణ్యం వృద్ధ తల్లిదండ్రులకు చట్ట ప్రకారం రావలసిన ఆర్థిక సహాయం అందించడంతో అతని తమ్ముడికి ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News January 30, 2025

పెద్దాపురం: బాలికతో వ్యభిచారం.. వెలుగులోకి కీలక విషయాలు

image

పెద్దాపురానికి చెందిన యువకుడు బాలికను పెళ్లి చేసుకుని వ్యభిచారంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ కీలక విషయాలు వెల్లడించారు. ‘యువకుడు తల్లితో కలిసి బాలికను చిత్రహింసలకు గురిచేసి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు
ఇన్‌ఫెక్షన్ రావడంతో రకరకాల మందులు వేశారు. బాధలతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పటికే బాలిక కదల్లేని స్థితికి చేరుకుంది’ అని తెలిపారు.

News January 30, 2025

రాజానగరం: హైవేపై రెండు లారీలు ఢీ

image

రాజానగరం హైవేపై బుధవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వైజాగ్ నుంచి పైపులు రోడ్డుతో వస్తున్న లారీ అతివేగంగా రావడంతో నియంత్రణ కోల్పోయి రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వెళ్తున్న బోగ్గుల లోడు లారీని ఢీకొంది. డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనితో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రెండు భారీ క్రేన్‌లతో లారీలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 30, 2025

నేడు కొవ్వూరు డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా

image

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. 30వ తేదీ కొవ్వూరు పట్టణ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించే మినీ జాబ్ మేళా కరపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జాబ్ మేళా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని యువత వినియోగించుకోవాలన్నారు.

News January 29, 2025

రాజమండ్రి: ఫిబ్రవరి 1 ముఖ్యమంత్రి పర్యటన రద్దు

image

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి 1 వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అన్నమయ్య జిల్లాకు మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తక్షణం ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిందని ఆమె తెలిపారు. అధికారులు గమనించాలన్నారు.