EastGodavari

News April 5, 2024

కాకినాడ: 3 ఎన్నికలు.. 3 పార్టీలు గెలుపు

image

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కాకినాడ రూరల్ ఏర్పాటైంది. కాగా ఈ నియోజకవర్గంలో తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు PRP నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో పిల్లి అనంతలక్ష్మి TDP నుంచి, 2019లో కురసాల కన్నబాబు YCP నుంచి గెలుపొందారు. ఇలా జరిగిన 3 ఎన్నికల్లో 3 వేర్వేరు పార్టీలు గెలుపొందాయి. మరి ఈ సారి ఏ పార్టీ జెండా ఎగిరేనో..?

News April 5, 2024

తూ.గో.: అమ్మా.. మీరు GREAT

image

తూ.గో. జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన పుల్లలపాడుకు చెందిన కొవ్వూరి రాణి (51)కి 4 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయం కాగా రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. 2రోజుల తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. కాగా విశాఖ షీలానగర్‌లో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఆమె ఊపిరితిత్తులను, మూత్రపిండాలను కుటుంబీకుల అనుమతితో దానం చేశారు. ఈ మేరకు కుటుంబీకులను పలువురు అభినందించారు.

News April 5, 2024

కాకినాడ: కన్నీటి ఘటన

image

గండేపల్లిలో జరిగిన <<12990018>>రోడ్డు ప్రమాదంలో<<>> హనుమాన్ జంక్షన్‌కు చెందిన సుబ్రహ్మణ్యం(42), రంగారెడ్డి జిల్లాకు చెందిన చేకూరి పల్లయ్య చౌదరి(52) మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘బావ అన్నవరం రమ్మంటున్నాడు వెళ్లకపోతే బాగోదమ్మా అంటూ కారులో వెళ్లొస్తామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా’ అంటూ సుబ్రహ్మణ్యం తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

News April 5, 2024

తూ.గో.: పెళ్లికార్డులో పవన్ కళ్యాణ్ హామీలు..

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ అభిమాని. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన మేడిశెట్టి వీరబాబు తన పెళ్లి కార్డులో పవన్ చిత్రంతో పాటు ఎన్నికల హామీలను వేయించారు. అందులో ‘‘పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఇలా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. చేనేత రంగం ప్రగతి’’ తదితర అంశాలు ఉన్నాయి. పవన్ విజయానికి సహకారం అందించాలనే ఇలా చేశానన్నారు.

News April 5, 2024

సామర్లకోట- పెద్దాపురం రోడ్డులో రూ.2.48 లక్షలు సీజ్

image

సామర్లకోట- పెద్దాపురం ఏడీబీ రహదారిలో గురువారం సాయంత్రం ఎన్నికల అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. పెద్దాపురం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఓ వాహనంలో ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2.48 లక్షలు పట్టుబడినట్లు ఫ్లైయింగ్ స్క్యాడ్ అధికారి రామారావు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు ఆదేశాల మేరకు నగదును కాకినాడ ట్రెజరీకి జమ చేస్తున్నట్లు తెలిపారు.

News April 4, 2024

రాత్రి సమయంలో మరింత గస్తీ: తూ.గో ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ స్టేషన్స్ పరిధిలో రాత్రి వేళ మరింత గస్తీని పెంచుతున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆయా స్టేషన్స్ పరిధిలో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

News April 4, 2024

అన్నవరం ఆలయానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి!

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హనుమాన్ జంక్షన్‌కు చెందిన తమ్మిన సుబ్రహ్మణ్యం(42), రంగారెడ్డి జిల్లాకు చెందిన చేకూరి పల్లయ్య చౌదరి(52) మృతి చెందారు. దర్శనానికి అన్నవరం వెళ్లి వస్తుండగా.. తాళ్లూరు శివారు దాబాల వద్ద లారీని వెనక నుంచి వీరి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

News April 4, 2024

అనపర్తి టికెట్‌పై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు

image

కొవ్వూరు ‘ప్రజాగళం’ సభలో TDP అధినేత చంద్రబాబు అనపర్తి టికెట్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో జనసేన 2చోట్ల పోటీ చేస్తుంది. మిగిలిన 5 స్థానాల్లో ఒక అసెంబ్లీ సీటు BJPకి ఇచ్చాం. BJPకి ఇచ్చిన అసెంబ్లీ సీటు ఇంకా నిర్ణయం కాలేదు. MP అభ్యర్థిగా పురందేశ్వరీ పోటీ చేస్తున్నారు’ అని అన్నారు. కాగా.. అనపర్తి టికెట్ BJPకి ఇవ్వగా.. నల్లమిల్లి నుంచి అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే.

News April 4, 2024

పవన్ అలా చెప్పడం బాధాకరం: ముద్రగడ

image

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ పెద్దలు గురువారం కిర్లంపూడిలో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. సీఎం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనే అమలు చేస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ గెలిస్తే నాణ్యమైన బ్రాందీని అందిస్తానని పవన్ అనడం బాధాకరమన్నారు. బౌన్సర్లతో ప్రచారం చేసే పవన్ ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటారని ప్రశ్నించారు.

News April 4, 2024

ఐబీఆర్ అచీవర్‌గా బుర్రిలంక బుడ్డోడు

image

కడియం మండలం బుర్రిలంకకు చెందిన ఈలి రుత్విక్  సంవత్సరం 6 నెలల వయసులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ‘ఐబీఆర్ అచీవర్’ గా నిలిచాడు. 25 రకాల చర్యలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ బుడతడు ప్రతిభను మెచ్చుకొని పలువురు అభినందనలు తెలిపారు.