India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీత జనసేనాని పవన్కు కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ చేబ్రోలు సభలో పవన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. MLA, MPగా తాను 100 ఆలయాలను అభివృద్ధి చేశానని, మతపరమైన విషయాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. పవన్ గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా వచ్చీరాని మాటలు మాట్లాడటం సరికాదన్నారు.
టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం రాత్రి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటి అయినట్లు తెలుస్తోంది. జోన్-2 ఇన్ఛార్జి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి బాపట్లలో సీబీఎన్ను కలిశారు. అనపర్తి టికెట్ మార్పుతో TDP శ్రేణుల్లో భావోద్వేగ పరిస్థితులను వివరించారని సమాచారం. నల్లమిల్లిని వదులుకునే ఉద్దేశం లేదని, ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి న్యాయం చేస్తానని సీబీఎన్ హామీ ఇచ్చారట.
మే 1వ తేదీన నుంచి 31వ తేదీ వరకూ జిల్లాలోని వివిధ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అండర్–14 విభాగంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శేషగిరి తెలిపారు. ఆసక్తి ఉన్న వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలన్నారు.
కాకినాడ పార్లమెంటు నుంచి 2019లో YCPనుంచి పోటీచేసి గెలిచిన వంగా గీతకు తాజాఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ టికెట్ దక్కింది. దీంతో కాకినాడ MPసీటును YCP చలమలశెట్టి సునీల్కి కేటాయించింది. ఈయన ఇదేస్థానం నుండి 2009లో ప్రజారాజ్యం, 2014లో YCP, 2019లో TDP నుంచి పోటీచేసి ఓడిపోగా ఇప్పుడు సింపతీతో గెలుద్దామని వ్యూహాలు రచిస్తోంది. కూటమి నుండి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. వీరిలో గెలుపుపై ఆసక్తి నెలకొంది.
అమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో ఆదివారం ఉదయం స్థానిక ఏ.వేమవరప్పాడుకు ప్రభాకర్ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. అయితే సాయంత్రానికి వారు వైసీపీలో చేరారు. వారు మాట్లాడుతూ.. ఇష్టం లేని పార్టీలో తాము ఉండలేమంటూ వైసీపీలో చేరారు. జడ్పీటీసీ పందిరి హరి, సర్పంచ్ విజయ సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి విశ్వరూప్ విజయానికి కృషి చేస్తామన్నారు.
అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో తూ.గో. జిల్లా వాసి మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఆదివారం సెలవు కావడంతో రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వెళ్లారు. వారిలో కొండయ్య(33) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. దీంతో స్నేహితులు హుటాహుటిన బయటకు తీసి మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఉమ్మడి తూ.గో.జిల్లాలోని 19స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తొలిసారి పోటీచేస్తున్నవారు 9 మంది ఉండటం విశేషం. జనసేన నుంచి బత్తుల రామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, YCP నుంచి పిల్లి సూర్యప్రకాశ్, TDP నుంచి యనమల దివ్య, వాసంశెట్టి సుభాష్, మిర్యాల శిరీష, ఆదిరెడ్డి వాసు, BJP- శివకృష్ణంరాజు ఉన్నారు. గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేనానికి శ్రీ వల్లభ సంస్థానం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అర్చక స్వాములు పవన్తో పూజలు చేయించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 2వ రోజు ప్రచారంలో భాగంగా పవన్ బయలుదేరగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారికి పవన్ అభివాదం చేశారు.
MP రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో ప.గో జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ BJP అభ్యర్థిగా శ్రీనివాసవర్మను అధిష్ఠానం ప్రకటించినప్పటికీ RRR మాత్రం తానే బరిలో ఉంటానని, ఇక్కడ MPగా కాకుంటే ప.గోలోనే MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. అటు BJP నేతలు వర్మనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. దీంతో RRR వర్గంతో పాటు కూటమి క్యాడర్లోనూ క్లారిటీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
జగనన్నను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు సేవలందించేందుకు ముందుకు వచ్చిన యువత వాలంటీర్లుగా పనిచేస్తుంటే టీడీపీ- జనసేన నేతలు వేధింపులకు గురిచేస్తున్నారని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించడం చంద్రబాబు చేసిన కుట్రే అన్నారు.
– ఎంపీ వ్యాఖ్యలపై మీరేమంటారు..?
Sorry, no posts matched your criteria.