EastGodavari

News March 29, 2024

రేపు ‘వారాహి విజయభేరి’ సభ.. పవన్ షెడ్యూల్ ఇదే

image

కాకినాడ జిల్లా పిఠాపురంలో రేపు ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ఈ సభతోనే జనసేన అధినేత పవన్‌ ప్రచారం షురూ కానుంది. SAT 12.30 PMకు పవన్ గొల్లప్రోలు హెలిప్యాడ్‌‌లో దిగుతారు. పాదగయలో పూజలు.. పొన్నాడలోని బషీర్‌ బీబీ దర్గా దర్శనం.. పిఠాపురంలోని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం 4.30 PMకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం నుంచి ప్రచారాన్ని ఎన్నికల మొదలు పెట్టనున్నారు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

News March 29, 2024

కాకినాడలో ట్రాఫిక్ ఎస్సైపై యువకుల దాడి

image

కాకినాడలోని ఉప్పలంక వద్ద వాహన తనిఖీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్‌పై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకొని కరప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి: కలెక్టర్

image

ప్రచారం, ప్రకటన ప్రదర్శన నిర్వహించడంలో స్థానిక సంస్థల పరిధికి లోబడి, భద్రతాపరమైన అంశాల నేపథ్యాన్ని అనుసరించి మాత్రమే అనుమతులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్థానికంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శించే హోర్డింగుల విషయంలో స్థానిక సంస్థలకు చెందిన చట్టాలను అనుసరించే అనుమతుల మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

News March 28, 2024

అమలాపురంలో ఇద్దరు వాలంటీర్ల తొలగింపు

image

అమలాపురం రూరల్ మండలం సమనసకు చెందిన వాలంటీర్లు మోకా వెంకన్నబాబు, ఉడుముల ప్రసాదరావును విధుల నుంచి తొలగించారు. వీరిద్దరూ కామనగరువులో ఈ నెల 27న వైసీపీ నేతలతో కలిసి క్రైస్తవ మత ప్రచారంలో విద్యార్థులకు బైబిల్ పంపిణీలో పాల్గొన్న కారణంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News March 28, 2024

కాకినాడ: రైలు నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం

image

కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్లిపాడు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృత్యువాత పడినట్లు ఎస్సై అబ్దుల్ మారూప్ తెలిపారు. మృతుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు నుంచి జారిపడి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉంచామని పోలీసులు తెలిపారు.

News March 28, 2024

కాకినాడ నూతన కలెక్టర్‌గా జే.నివాస్

image

కాకినాడ కలెక్టర్‌గా జే.నివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్‌గా పని చేస్తున్న కృత్తికా శుక్లాను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కృత్తికా శుక్లా గత రెండేళ్లుగా కాకినాడ కలెక్టర్‌గా సేవలు అందించారు. వైద్యారోగ్య శాఖలో డైరెక్టర్‌గా ఉన్న జె.నివాస్‌ను కృతికా శుక్లా స్థానంలో కలెక్టర్‌గా నియమించారు.

News March 28, 2024

అనపర్తి MLA సీటుపై కూటమి అభ్యర్థి కీలక వాఖ్యలు

image

కూటమి అభ్యర్థి శివకృష్ణం రాజు టికెట్ వివాదంపై స్పందించారు. పొత్తులో భాగంగా సీటు ఏ పార్టీకి వచ్చినా అందరూ కలసి సహకరించుకుని ఎన్నికల్లో పోటీ చేయడం పొత్తు ధర్మం అన్నారు. త్వరలో నల్లమిల్లి రామక్రిష్ణ రెడ్డితో పాటు జనసేన నేతలను కలసి మద్ధతు అడుగుతానని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తానన్నారు.

News March 28, 2024

తెలంగాణలో తూ.గో జిల్లావాసి సూసైడ్

image

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో సామర్లకోటకు చెందిన కొరిపల్లి సంజయ్ (26) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై యాదగిరి బుధవారం తెలిపారు. ఇతను సంజయ్ దివిస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని చెప్పారు. పరిశ్రమ క్వార్టర్స్ లో ఉండే అతను నెల రోజుల క్రితం స్నేహితులు అద్దెకు ఉండే గదికి మారాడన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.

News March 28, 2024

రాజానగరంలో భారీ అగ్ని ప్రమాదం

image

మండలంలోని చక్రద్వారబంధం గ్రామంలో సుమ రిఫైనరీ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆయిల్ ముడిసరుకు బాయిలర్ శుభ్రం చేయడానికి మరమ్మతులు చేస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని యాజమాన్యం తెలిపారు.