India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్షాల కారణంగా తూ.గో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రిలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం.0883-2463354,7382299960, టౌన్ 94408 12585, రూరల్ 7382585487 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాన్ బాధితులు ఫోన్ నెంబర్లు 9913148180, 7801007227, 7095454117, 9989900094 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. అలాగే రాజమండ్రిలో ఉమ్మడి తూ.గో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం. 0883-2463354,7382299960.
ఉమ్మడి తూ.గో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టు గురువారం తెగిపోయింది. దీంతో గంటిపెదపూడి, బురుగులంక, అదిగెలవారిపాలెం, ఉడేమూడిలంక గ్రామాల మధ్య రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో రజా హుస్సేన్కు చెందిన ఏటీఎం కార్డును ఓ వ్యక్తి కాజేసి రూ.40,600 విత్ డ్రా చేశాడు. బాధితుడు గురువారం నగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుస్సేన్ ఖాతాలో బుధవారం రూ.50 వేలు జమయ్యాయి. ఏటీఎం నుంచి హుస్సేన్ రూ.10 వేలు డ్రా చేశాడు. అతనిని గమనిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి హుస్సేన్ ఏటీఎం కార్డు కాజేసి డూప్లికేట్ కార్డు ఇచ్చాడు. ఒరిజినల్ కార్డుతో మిగతా నగదు కాజేశాడు.
తూ.గో జిల్లాలో ప్రస్తుత వర్షాలు, రాబోయే 3 రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలపై రాజమండ్రి- 0883-2463354, 73822 99960, ఏలూరు- 94409 02926 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా జిల్లాలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. SHARE IT..
రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ(వైస్ ఛాన్సలర్)గా ప్రొ.వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జియో సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్గా ఉన్న శ్రీనివాసరావు.. ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ JNTU ఇన్చార్జి వీసీగా అదే వర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్రొ.KVSG మురళీకృష్ణ నియమితులయ్యారు.
రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ(వైస్ ఛాన్సలర్)గా ప్రొ.వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జియో సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్గా ఉన్న శ్రీనివాసరావు.. ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ JNTU ఇన్చార్జి వీసీగా అదే వర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్రొ.KVSG మురళీకృష్ణ నియమితులయ్యారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. దీంతో బుధవారం కాటన్ బ్యారేజీ 175 గేట్లను 20 మి.మీ. మేర పైకెత్తి 93,244 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. వ్యవసాయ అవసరాలకు డెల్టా కాలువలకు 8,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. అలాగే కాటన్ బ్యారేజీ వద్ద 10.65 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.
ప.గో జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంబానీ వివాహ వేడుకలో కోనసీమ జిల్లా వాసులు పాల్గొన్నారు. నందంపూడి, పాసర్లపూడిలంక, ఇందుపల్లి, అమలాపురానికి చెందిన విశ్వనాథ్, భార్గవ్, సాంబశివ, కమలేష్ ఘనాపాఠీలు వధూవరులతో పూజలు చేయించారు. వీరంతా హైదరాబాద్లోని వేదభవన్లో 13 ఏళ్లపాటు ఘనాపాఠీ కోర్సు పూర్తి చేశారు. పెళ్లి వేడుకకు నెలరోజుల ముందుగానే వీరి ఎంపిక జరిగిందని ..పెళ్లి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.