India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడీ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు. బీఈడీ రెండేళ్ల కాలవ్యవధి కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్ సీట్లు 14, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ఏపీ ఎడ్సెట్-2023 ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలన్నారు.
బీజేపీ అనపర్తి MLA అభ్యర్థి శివరామకృష్ణంరాజు బిక్కవోలు మండలం రంగాపురంలో 1986 జులై 22న జన్మించారు. 16 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ స్థాయిలో పనిచేశారు. పదవీ విరమణ చేసిన రాజు RSSలో ప్రచార ప్రముఖ్గా పని చేశారు. అనంతరం BJPలో చేరి మండల అధ్యక్షుడిగా, జిల్లా మీడియా ప్యానలిస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం అనపర్తి BJP కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి రామరాజు 1982 నుంచి BJP సభ్యుడు.
85 ఏళ్లు పైబడిన వృద్ధులు, నడవలేని దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృత్తికా శుక్లా బుధవారం తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంపొందించే దిశగా ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. మొబైల్ వాహనం సాయంతో ఇంటి వద్దే వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయవచ్చన్నారు.
ఎట్టకేలకు అనపర్తి MLA టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఆ పార్టీ నేత ములగపాటి శివరామకృష్ణం రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. టీడీపీ తొలి జాబితాలో అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. తర్వాత బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు రాజుకే టికెట్ దక్కింది.
కాకినాడ సముద్రతీరంలో నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డును మూసివేస్తున్నట్లు గ్రామీణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. వాహనాలను తిమ్మాపురం అచ్చంపేట కూడలి నుంచి పిఠాపురం మళ్లిస్తున్నామని.. వాహనదారులు, గ్రామస్థులు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు.
తూ.గో. జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మలపల్లి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలపల్లి గతంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పలుమార్లు పోటీలో నిలిచారు. కాగా ఈ నెల 30వ తేదీన పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి తూ.గో. జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలిపారు. స్త్రీ, పురుషుల విభాగంలో జట్ల ఎంపిక ఉంటుందన్నారు. అమలాపురం జడ్పీ పాఠశాలలో ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన వారు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలతో రావాలని ఆయన సూచించారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రైళ్లను పూర్తిగా, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో పట్టాల మరమ్మతుల కారణంగా విశాఖపట్నం- మచిలీపట్నం, గుంటూరు- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 4 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. రామవరప్పాడు- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
తూ.గో. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జవహర్ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, రాష్ట్రాధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నరసాపురం పార్లమెంటు సీటు వెంటనే టీడీపీ కేటాయించాలని డిమాండ్ చేస్తూ RRR ఆర్మీ ఆధ్వర్యంలో అమలాపురంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిలో నరసాపురం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దంతులూరి శ్రీనివాసరాజు, చిలువూరి సతీష్ రాజు, దెందుకూరి సత్తిబాబు, తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.