India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇది రాష్ట్రంలో 2వ అత్యల్ప మెజారిటీ. కొద్ది రోజులకే రాపాక YCPలో చేరగా.. తాజాగా MP సీటు దక్కించుకున్నారు. దీంతో రాజోలులో జనసేన నుంచి దేవా వరప్రసాద్ MLA బరిలో ఉన్నారు. YCP నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. మరి జనసేన మరోసారి జెండా ఎగరేసేనా..?
చంద్రబాబు హామీతో అలక వీడిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శనివారం రాత్రి మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, టీడీపీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. మరో నాలుగు ఐదు రోజుల్లో తాను పిఠాపురం వస్తానని, తగిన ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్ టిక్కెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.
కాకినాడ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నారు. ఈయన విదేశాల్లో చదివిన ఈయన పారిశ్రామికవేత్త. 2009 (ప్రజారాజ్యం), 2014 (వైసీపీ), 2019 (టీడీపీ) నుంచి కాకినాడ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఆయన విజయం సాధించేనా..?- మీ కామెంట్..?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 64 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,513 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.2.30 కోట్ల నష్టపరిహారం అందజేశారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 19వ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహించనున్న వైసీపీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. స్థానిక ఆకుల వీర్రాజు విగ్రహం వద్ద మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని కొత్తపేట MLA, వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు పరిధిలోగల మన్నా జూబ్లీచర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘం నాయకులు డీఎస్పీ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్చ్ పాస్టర్ అల్లవరం పోలీస్లకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పాస్టర్లు డీఎస్పీని కోరారు.
అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన కాలువలో శనివారం మొసలి ప్రత్యక్షం అయింది. మొసలిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలువను ఆనుకునే గృహాలు ఉండటంతో చుట్టుపక్కల వారంతా ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతానికి దగ్గరలోనే అధికారులు మొసలిని పట్టుకున్నారు. ఇప్పుడు మరో మొసలి ప్రత్యక్షమైంది.
కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.
Sorry, no posts matched your criteria.