EastGodavari

News March 16, 2024

అమలాపురంలో మళ్లీ మొసలి ప్రత్యక్షం

image

అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన కాలువలో శనివారం మొసలి ప్రత్యక్షం అయింది. మొసలిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలువను ఆనుకునే గృహాలు ఉండటంతో చుట్టుపక్కల వారంతా ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతానికి దగ్గరలోనే అధికారులు మొసలిని పట్టుకున్నారు. ఇప్పుడు మరో మొసలి ప్రత్యక్షమైంది.

News March 16, 2024

తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.