India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో పిఠాపురం రానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ తొలిసారి పిఠాపురం వస్తుండటంతో నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉండనుండగా.. మూడురోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండనున్నారట. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. సమగ్ర సమాచారంతో సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఓ గుర్తుతెలియని మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం MLA) ఈరోజు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ఒకప్పుడు కాకినాడలో చదువుకున్న విద్యార్థే. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాకినాడ పీ.ఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కళాశాల పూర్వ విద్యార్థి అయ్యన్నపాత్రుడు శాసనసభాపతి కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వసంతలక్ష్మి తెలిపారు. ఆ రోజు ఉదయం 10:30 నుంచి మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.
కాకినాడ సిటీ MLAగా వనమాడి వెంకటేశ్వర రావు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ను కలిసి కరచాలనం చేశారు. శుక్రవారం అనివార్య కారణాల వల్ల వనమాడి అసెంబ్లీకి వెళ్లని విషయం తెలిసిందే.
తూ.గో. జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడుకు చెందిన గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు లగడ్డ భాస్కర చౌదరి(33) శుక్రవారం మృతిచెందారు. కాగా ఈయన కొంతకాలం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈయనకు చంద్రబాబును సీఎంగా అసెంబ్లీలో చూడాలన్నది కల అని కుటుంబీకులు చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ విజయం కోసం అహర్నిశలు పనిచేశాడు. అసెంబ్లీ సమావేశాలు చూసేందుకు నిన్న ఆసుపత్రిలో ఆయన గదిలో టీవీ సైతం ఏర్పాటుచేశారు.
కాకినాడ జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు శుక్రవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. మొబైల్ ట్రాకింగ్ కాకినాడ పోలీస్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న బాధితుల వివరాల మేరకు రికవరీ చేసి అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మొబైల్ ఐఎంఈఐ నంబర్లు బ్లాక్ అయిన తరువాత మొబైల్ను ట్రాక్ చేసి పట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలు గురించి ఆయనకు కలెక్టర్ వివరించారు.
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24, 25వ తేదీల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ క్రిష్ణన్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన విద్యార్థులు హాజరు కావాలని ఆయన కోరారు.
ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పిల్లలను చేర్పించాలని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు కోరారు. దేవీపట్నం గ్రామం సమీపంలో నిర్వాసితుల కాలనీలో శుక్రవారం అడ్మిషన్స్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పలువురు విద్యార్థులను జడ్పీ పాఠశాలలో చేర్పించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.