India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లోని జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల సంఖ్య భారీగా పెరగటం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ మూడు మండలాల్లో జనవరి నుంచి ఇంత వరకు 39 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 17 మంది మృత్యువాత పడ్డారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు అతివేగం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు అధికారుల అలసత్వం కూడా ఒక కారణమని చెబుతున్నారు.
రాజమండ్రి రూరల్ లో దారుణం చోటుచేసుకుంది. మార్గాని నాగేశ్వరరావును స్నేహితులు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు .అష్టాచమ్మ ఆటలో తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా సమాచారం. హత్య చేసిన వీరబాబు, రమణ పరారీలో ఉన్నారని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేదలకోసం సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. జులై 1నుంచి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు కందిపప్పు, పంచదార, బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరిలో కలిపి 50,06,194మందికి లబ్ధి చేకూరనుందని పౌర సరఫరాల శాఖ డీఎస్ వో విజయభాస్కర్ తెలిపారు.
రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టిన వాసంశెట్టి సుభాశ్ను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ మంత్రికి దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రామచంద్రపురం నియోజవర్గం అభివృద్ధికి ఎస్పీ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రంపచోడవరానికి చెందిన మద్దికొండ సుధాకర్కు కాకినాడ పొక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పిందని సీఐ వెంకటేశ్వరావు తెలిపారు. 2019లో అదే గ్రామానికి చెందిన ఒక బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా వైజాగ్ తీసుకెళ్లాడన్నారు. రేప్, కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారించగా.. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందని వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు హడలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నారు. వారం కిందటి వరకు రైతు బజార్లలో కిలో టమాట ధర రూ.30 ఉండగా.. ఇప్పుడు రూ.50 వరకు పెరిగింది. బహిరంగ మార్కెట్లో రూ.100 వరకూ వ్యాపారులు అమ్ముతున్నారు. మిర్చి, ఉల్లిపాయ ధరల సైతం ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.
ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, గంగవరం, తదితర ప్రాంతాల్లో రాబోవు 40 నిమిషాల్లో పిడుగులు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
గోపాలపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఫోటో గ్రాఫర్లు బుధవారం ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కవరేజ్కు సంబందించిన సొమ్ములు తమకు ఇప్పటివరకు జమా చేయాలేదని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావలసిన మొత్తాన్ని ఇవ్వలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.
గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన కరణం వెంకటేశులు(50) బుధవారం ఉపాధి హామీ పనికి వెళ్లి మృతిచెందారు. పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే వెంకటేశులు మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గారావు వెల్లడించారు.
రాజమండ్రి రూరల్ MLA బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్గా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఓ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘42 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేం పెద్ద పోస్టు కాదు’ అని అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా తన నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని అన్నారు. ఎక్కడైనా గెలవగల సత్తా తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఆ ధైర్యాన్ని ప్రజలు ఇచ్చారన్నారు.
Sorry, no posts matched your criteria.