India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా 25వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3194 మంది పరీక్ష రాయగా.. 1395 మంది(44 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 710 మంది పరీక్ష రాయగా.. 326 మంది (46శాతం) పాస్ అయ్యారు.
ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తూర్పు గోదావరి జిల్లా 23వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3361 మంది పరీక్ష రాయగా.. 1662 మంది(49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో తూ.గో జిల్లా వ్యాప్తంగా 422 మంది పరీక్ష రాయగా.. 216మంది (51శాతం) పాస్ అయ్యారు.
ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో కాకినాడ జిల్లా 14వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6027 మంది పరీక్ష రాయగా.. 3410 మంది(57 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 384 మంది పరీక్ష రాయగా.. 218 మంది (57శాతం) పాస్ అయ్యారు.
పిఠాపురం మండలం భోగాపురంలో ఈ నెల 14న బొమ్మ దేవప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నాగులపల్లి పద్మరాజును అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్, SI గుణశేఖర్ తెలిపారు. మృతుని సోదరుడు శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హత్య కేసును విచారించామన్నారు. మృతుడు ప్రసాద్, నిందితుడు పద్మరాజు కలిసి తాపీ పని చేశారన్నారు. కూలి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో ప్రసాద్ను కొట్టి చంపేశారన్నారు.
ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారానికి చెందిన దుర్గారావు దివ్యాంగుడు. గ్రామానికి చెందిన ఓ యువకుడికి పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి..ఓ అమ్మాయి ఫొటో చూపించాడు. 4ఎకరాల భూమి ఉందని, తనకు తెలిసిన అమ్మాయి నంబర్ ఇచ్చి రోజూ మాట్లాడించాడు. ఆ తర్వాత అమ్మాయికి ఆర్థిక సమస్యలున్నాయని రూ.40 లక్షల వరకు వసూలుచేశాడు. ఎన్నిరోజులైనా పెళ్లి ప్రస్తావన లేకపోగా మోసం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదల చేయనున్నారని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 98,550 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేల చొప్పున మొత్తం రూ.19.71 కోట్లు జమ కానున్నట్లు తెలియజేశారు.
రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఓ సంస్థ డివిజనల్ మేనేజర్గా పని చేస్తున్న చింతా మధు(52) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడని సంస్థ సిబ్బంది తెలిపారు. విశాఖలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లోనే కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఓ కారు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా లొల్ల-వాడపల్లి కొత్త రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కారులోని ప్రయాణికులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సహాయంతో కారును పంట పొలంలోంచి బయటకు తీశారు.
కొత్తపేట శిల్పి రాజ్కుమార్ వుడయార్ ‘ఈనాడు’ అధినేత రామోజీరావు విగ్రహాన్ని తయారు చేశారు. విజయనగరం MP అప్పలనాయుడు దీన్ని తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. 7.5 అడుగుల ఎత్తుతో 4 రోజుల్లోనే తయారు చేశానని, 25 విగ్రహాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈనాడు’ ప్రస్థానం ప్రారంభమైన విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎంపీ తెలిపారు. మీడియా రంగం నుంచి ప్రతిష్ఠించే తొలి విగ్రహం రామోజీరావుదే కావడం గమనార్హం.
మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాజీ మంత్రి వేణుగోపాల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ద్రాక్షారామలో నేడు ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటికి సంబంధించి తమ వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని అన్నారు. అవినీతి, అక్రమాలను తర్వలోనే బయటకు తీసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.