EastGodavari

News June 17, 2024

తూ.గో: అమ్మలకు తప్పని కడుపు కోతలు

image

నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనబడట్లేదు. తూ.గో జిల్లాలో 100 ప్రసవాల్లో 70 సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
➤ 2023-24లో మొత్తం 23,673 ప్రసవాల్లో 11,944 ఆపరేషన్లే. మాతృమరణాలు-14
☞ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,269 మంది ప్రసవిస్తే.. 3,527 మందికి సిజేరియన్లే
☞ ప్రైవేట్‌లో 16,404 ప్రసవాలు జరిగితే.. 8,417 మందికి కడుపు కోతే.

News June 17, 2024

కోనసీమ: దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లి పల్లెపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ సంఘటనపై బాలిక తండ్రి 16వ తేదీ (ఆదివారం) రాత్రి ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సంపత్ కుమార్ తెలిపారు.

News June 17, 2024

పవన్‌కు కేటాయించిన శాఖలతో పిఠాపురంలో అభివృద్ధి

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో TDP నాయకులు, కార్యకర్తలను ఆదివారం సాయంత్రం మాజీ MLA SVSN వర్మ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌కు కేటాయించిన శాఖలు రాష్ట్రం, పిఠాపురం అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఉప్పాడ, చేబ్రోలులో అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News June 17, 2024

కాకినాడ: మహిళ దారుణ హత్య

image

మహిళ దారుణహత్యకు గురైన ఘటన కాకినాడ గ్రామీణ మండలంలో జరిగింది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపేటకు చెందిన ఓలేటి నరసింహమూర్తికి 8ఏళ్ల క్రితం సీత(26)తో పెళ్లైంది. శనివారం రాత్రి అందరూ నిద్రించాక.. కరెంట్ పోయిందని సీత వేరేగదిలో నిద్రించింది. ఉదయంకల్లా హత్యకు గురైంది. భర్త పోలీసులకు ఫిర్యాదుచేశాడు. DSP హనుమంతరావు సిబ్బందితో అక్కడికి వెళ్లారు. భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News June 17, 2024

తూ.గో.: ALERT.. నేడు, రేపు పిడుగులతో వర్షం

image

ద్రోణి ప్రభావంతో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ ఆదివారం తెలిపారు. కాగా నేడు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో, రేపు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 16, 2024

తూ.గో.: నాన్నే నా హీరో: డైరెక్టర్ సుకుమార్

image

నాన్నే తన హీరో అని అంటున్నారు మలికిపురం మండలం మట్టపర్రుకు చెందిన సినీ దర్శకుడు సుకుమార్. గ్రామానికి చెందిన బండ్రెడ్డి తిరుపతి రావునాయుడికి సుకుమార్‌తో పాటు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఆయన జ్ఞాపకార్థం తోబుట్టువులతో వారు రూ.15లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి భవనం నిర్మించారు. తండ్రి బాధ్యతే పిల్లలను మంచివైపు నడిపిస్తుందని ఓ మూవీ విడుదల సందర్భంగా చెప్పారు.
☛ నేడు FATHERS డే

News June 16, 2024

ఎమ్మెల్యే గోరంట్ల ఇంటికి మంత్రి కందుల దుర్గేశ్

image

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వారి నివాసంలో మంత్రి కందుల దుర్గేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దుర్గేశ్‌ను గోరంట్ల సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పదవి వచ్చినందుకు గోరంట్ల ఆయనకు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం గోరంట్లను దుర్గేశ్ శాలువాతో సత్కరించారు.

News June 16, 2024

కొమ్మనాపల్లిలో మరో 28 మందికి డయేరియా

image

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. శనివారం మరో 28 మంది దీని బారిన పడినట్లు తెలిసింది. కాకినాడలోని జీజీహెచ్‌లో 16 మంది, తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ముగ్గురు, మిగిలిన 9 మందికి స్థానికంగా చికిత్స అందించారు. ఈ ఊరిలో 512 కుటుంబాల్లో 1881 మంది ఉన్నారు. వారిలో 60 కుటుంబాలకు చెందిన 69 మందికి వైద్యం అందుతుంది. పలువురు ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్నారు.

News June 16, 2024

పేరెంట్స్ చంపాలని చూస్తున్నారంటూ యువతి ఆవేదన

image

లవ్ మ్యారేజ్ చేసుకున్నాననే కోపంతో తల్లిదండ్రులు తనను చంపాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని రాజమండ్రికి చెందిన యువతి విజయవాడలో ఓ న్యాయవాదిని ఆశ్రయించింది. Jan 9న మైనార్టీ తీరడంతో తాము పెళ్లి చేసుకున్నామని, తల్లిదండ్రులు దీనిపై బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తనతో పాటు భర్త, అత్తమామలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ హోంశాఖ మంత్రి, డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపింది.

News June 16, 2024

ఒంటరితనంతో అన్నదమ్ముల ఆత్మహత్య.. ఇద్దరూ విద్యావంతులే

image

రాజమండ్రిలో <<13444701>>వంతెనపై నుంచి <<>>దూకి అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. సాయికృష్ణానగర్‌కు చెందిన నాగేంద్రసాయి-త్రిపురదేవీ దంపతులకు నాగాంజనేయ(42), దుర్గారావు(40) సంతానం. బీటెక్, MBA చేసిన వీరు HYD, బెంగళూరులో జాబ్స్ చేశారు. 2013లో తండ్రి చనిపోగా ఇంటికొచ్చారు. 2020లో తల్లి మృతి చెందినప్పటి నుంచి ఎవరితో మాట్లాడేవారు కాదు. ఆర్థిక ఇక్కట్లు, ఒంటరితనం, పెళ్లిళ్లు కాక సంఘర్షణలోనై శనివారం సూసైడ్ చేసుకున్నారు.