EastGodavari

News May 20, 2024

SUPER: థాయిలాండ్‌‌లో టైటిల్ కొట్టేసిన కోనసీమ కుర్రోడు 

image

థాయిలాండ్‌లో ఆదివారం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. టైటిల్ ఫైట్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 21-15 స్కోరుతో చైనా క్రీడాకారులు చెన్-లు జంటపై గెలిచి రూ.26 లక్షల నగదు బహుమతితోపాటు ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారని సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథ్ తెలిపారు. కాగా సాత్విక్ సాయిరాజ్‌ది మన కోనసీమ జిల్లా అమలాపురం అన్న విషయం తెలిసిందే. 

News May 20, 2024

పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలపై ఫోకస్

image

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై EC దృష్టి సారించింది. హింసకు తావున్న ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కౌంటింగ్‌కు ముందే ఇక్కడ కేంద్ర బలగాలతో పహారా కాయనున్నారు.

News May 20, 2024

తూ.గో: గోదావరిలో స్నానానికి దిగి బాలుడి మృతి

image

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద స్నానానికి దిగి ఓ బాలుడు మృతిచెందాడు. మృతుడు రాజమండ్రిలోని శాంతినగర్‌కు చెందిన దడాల దినేశ్(16)గా పోలీసులు గుర్తించారు. బొబ్బర్లంక బ్యారేజీ దిగువన గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడని తెలిపారు. ఈ వారంలో ఇదే గోదావరిలో గల్లంతై వాడపల్లి, రావులపాలెం వద్ద ఆరుగురు మృతి చెందగా.. ఇది ఏడవ మరణం.

News May 20, 2024

తూ.గో.: నకిలీ ఖాతాతో వేధింపులు.. ఇద్దరిపై కేసు 

image

నకిలీ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి అర్ధ నగ్నచిత్రాలు పంపిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశామని నిడదవోలు SI అప్పారావు ఆదివారం తెలిపారు. తూ.గో. జిల్లా సమిశ్రగూడేనికి చెందిన దుర్గాప్రసాద్ పట్టణంలోని ఓ వివాహిత పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి మరో మహిళ ఫోన్‌కు మహిళల అర్ధనగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపించారు. వివాహితకు విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News May 20, 2024

అలాంటి మామిడి పండ్లు ప్రమాదకరం: అనంతరావు

image

మామిడి వ్యాపారులు కొంతమంది చట్టవిరుద్ధంగా కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి కాయలను కృత్రిమంగా పండించి మార్కెట్‌లో అమ్ముతున్నారని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు అన్నారు. ఆదివారం స్థానిక కన్స్యూమర్ వాయిస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అనంతరావు మాట్లాడారు. కాల్షియం కార్బైడ్ అనేది ప్రమాదకరమైన రసాయనమని,  దాని వలన మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చిరించారు.

News May 19, 2024

కోనసీమ: తీవ్ర విషాదం.. 3వ మృతదేహం లభ్యం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద గౌతమి గోదావరిలో శనివారం <<13271997>>గల్లంతైన ముగ్గురిలో<<>> మూడో మృతదేహం ఆదివారం లభ్యమైంది. సత్తి సంపత్‌రెడ్డి(16)గా గుర్తించారు. నిన్న గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన వారిలో పెంట జయకుమార్(19), సబ్బెల్ల ఈశ్వర్ రెడ్డి(20) మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో కపిలేశ్వరపురం మండలం తాతపూడి ఇసుక ర్యాంపు వద్ద సంపత్ రెడ్డి డెడ్‌బాడీ లభ్యమైంది.

News May 19, 2024

తూ.గో.: వేసవి.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

image

వేసవి నేపథ్యంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 08321, 08322, 08325, 08326 నంబర్లు గల రైళ్ళ సేవలను మే 30 నుంచి జూన్‌ 29వ తేదీ వరకూ పొడిగించింది. ఈ రైళ్లు ఉమ్మడి తూ.గో జిల్లాలోని తుని, పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.

News May 19, 2024

తూ.గో.: మరో 15 రోజులే.. మీ MLA ఎవరు..?

image

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. మన MLA ఎవరనేది తేలిపోనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలు పార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

News May 19, 2024

తూ.గో.: భార్యతో వాగ్వాదం.. భర్త SUICIDE

image

HYDలోని బోరబండకు చెందిన నల్లమాటి సాయికుమార్‌(29)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఈ నెల 9న ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్య రాజమండ్రికి వెళ్లింది. కాగా 17వ తేదీన సాయికుమార్ భార్యకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య మాటామాట పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుమేరకు బోరబండ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

News May 19, 2024

కాకినాడ: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం

image

కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి పడేసినట్లు ఉంది. ఎవరో చంపి  ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!