EastGodavari

News April 13, 2024

తూ.గో.: సిట్టింగ్‌లకు నో టికెట్.. హీటెక్కిన రాజకీయం

image

2019లో గెలుపొందిన పలువురు MLAలకు ఈ సారి టికెట్ రాకపోవడంతో ఉభయ గోదారిలో రాజకీయం వేడెక్కింది. చింతలపూడిలో YCP MLA ఎలీజాను మార్చగా ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకొన్నారు. పి.గన్నవరం YCP MLA చిట్టిబాబుకు సైతం టికెట్ ఇవ్వకపోగా ఆయనా కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఉండిలో TDP సిట్టింగ్ MLAకు ఆ పార్టీ తొలుత టికెట్ ఇచ్చినా.. ఇతరులకు కేటాయిస్తారనే టాక్‌తో సందిగ్ధత నెలకొంది.

News April 13, 2024

UPDATE: బెట్టింగ్‌కు బానిసై అప్పు.. సూసైడ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ లాడ్జిలో యువకుడు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కరప మండలం వేళంగికి చెందిన అనిల్‌కుమార్‌(25) క్రికెట్‌ బెట్టింగ్‌‌కు అలవాటయ్యాడు . దానికి తోడు చెడు వ్యసనాలకు బానిస కావడం, బెట్టింగ్ కారణంగా అప్పులు ఎక్కువ కావడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. శుక్రవారం లాడ్జిలో రూం తీసుకున్న అనిల్.. ఆత్మహత్య చేసుకున్నట్లు SI తెలిపారు.

News April 13, 2024

‘చిట్టిబాబు’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చేదెంత..? వైసీపీకి నష్టమెంత?

image

పి.గన్నవరం MLA కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరారు. మామిడికుదురు మండలం నగరంలో జన్మించిన చిట్టిబాబు.. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌లో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడగా.. 2019లో TDP అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై గెలిచారు. ఈసారి వైసీపీ టికెట్ దక్కక అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు.. ఈరోజు హస్తం గూటికి చేరారు. చిట్టిబాబు నిర్ణయంతో వైసీపీకి నష్టమెంత..? కాంగ్రెస్‌కు కలిసొచ్చేదెంత.? కామెంట్..

News April 13, 2024

సామర్లకోట: వాహన తనిఖీళ్లో రూ.12.67 లక్షలు స్వాధీనం

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సామర్లకోట పట్టణంలో ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.12,67,611 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు మొత్తాలను జిల్లా ట్రెజరీకి అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జాస్తి రామారావు తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, తదితదరులు పాల్గొన్నారు.

News April 13, 2024

రాష్ట్రస్థాయిలో మెరిసిన కాకినాడ విద్యార్థిని.. 991/1000

image

రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిందో విద్యార్థిని. కాకినాడ PR ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుతున్న డి.సాయిలక్ష్మి 1000కి గానూ 991 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో సాయిలక్ష్మి స్తతా చాటగా.. గ్రామస్థులతో పాటు అధ్యాపకులు ఆమెను అభినందించారు.

News April 13, 2024

తల్లీ, కుమార్తె మృతదేహాలు లభ్యం

image

ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్‌(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్‌ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.

News April 13, 2024

24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులు: NSVL నరసింహం

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారి NSVL నరసింహం తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం కూడా ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..

News April 13, 2024

CBN, పవన్, పురందీశ్వరిి భేటీ.. అనపర్తి టికెట్ TDPకే!

image

అనపర్తి టికెట్ TDPకి ఇచ్చేందుకు BJP అంగీకరించినట్లు తెలిసింది. శుక్రవారం చంద్రబాబు, పవన్, పురందీశ్వరి సమావేశమైన విషయం తెలిసిందే. అనపర్తి టికెట్ ముందు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే ఇవ్వగా.. తర్వాత BJPకి దక్కింది. అసంతృప్తి వ్యక్తం కావడంతో అనపర్తికి బదులు అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె టికెట్ BJP తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని BJP నేతలు అన్నారట.

News April 12, 2024

తూ.గో.: ఆ పండ్లకు ఫుల్ డిమాండ్.. 

image

వేసవి నేపథ్యంలో సీజనల్ పండ్లకు గిరాకీ పెరిగింది. ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రధానంగా పుచ్చకాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజానగరం, దివాన్ చెరువు, రావులపాలెం, అమలాపురం, కాకినాడల్లోని ఉపకేంద్రాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 2టన్నుల మేర పండ్ల అమ్మకాలు సాగుతుండగా రూ.కోట్లలో టర్నోవర్ లభిస్తోంది. సపోటా, రామాఫలం, గులాబీ జామ్, చింతకాయలపల్లి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

News April 12, 2024

ALERT: రెండు రోజులు వడగాలులు.. జాగ్రత్త

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 13, 14వ తేదీల్లో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 13న తూ.గో. జిల్లాలోని 6, కాకినాడ జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు ఉంటాయని తెలిపింది. 14న తూ.గో జిల్లాలో 18 మండలాలు, కాకినాడ జిల్లాలో 11 మండలాలు, కోనసీమలో 9 మండలాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!