India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలని అనుకునేవారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నిబంధనల ప్రకారం నిర్దేశించిన వారంతా 15 రోజుల ముందు నుంచే ఇంటి వద్ద నుంచి ఓటు వేయొచ్చన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అమలాపురంలో 15,18,108 మంది, రాజమహేంద్రవరంలో 16,08,504 మంది, కాకినాడలో 16,11,031 మంది ఓటర్లున్నారు. వీరిలో కనీసం లక్ష మందైనా ఇంటి నుంచి ఓటింగ్ విధానంలో పాల్గొంటారని అధికారులు అంటున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 672 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం కొత్తపేట మండలం మోడెకూరు గ్రామ సచివాలయం-1, 2కు చెందిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వారి రిజైన్ లెటర్స్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు.
కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అమలాపురం పట్టణాల్లో ఈ నెల 11వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సభ నిర్వహణకు ముందు ఇరుపార్టీల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందన్నారు.
కాకినాడలో గతంలో పనిచేసిన ఓ ఏఎస్పీపై జిల్లాకు చెందిన ఓ మహిళ ఆదివారం DGPకి ఫిర్యాదుచేసింది. బాధితురాలి వివరాలు.. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై 2022లో కాకినాడ 2వ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాచేశానన్నారు. చర్యలు తీసుకోకపోగా ASPని ఆశ్రయించగా న్యాయం చేస్తానని చెప్పి.. లైంగికంగా వేధించారని చెప్పింది. DGP విచారణకు ఆదేశించగా ఏలూరు ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగుతున్నట్లు సమాచారం.
షటిల్ ఆడుతుండగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. వివరాలు.. తుని పట్టణానికి చెందిన నగల దుకాణదారుడు ఆళ్లనాగు(49) సోమవారం ఉదయం స్థానిక రాజా క్రీడామైదానంలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడేందుకు వెళ్లాడు. ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపట్ల శ్రీరాజా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి, అనపర్తి, కాకినాడ జిల్లా పరిధిలో సామర్లకోట, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జరిగిన ప్రాంతాల్లో సగటు దిగుబడి 50 బస్తాలు (బస్తా 75 కేజీలు, 37.5 క్వింటాళ్ల) వరకు వస్తోంది. కొన్నిచోట్ల 55 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. మరో 10 రోజుల్లో రబీ కోతలు జోరందుకోనున్నాయి.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాజమండ్రిలో 45.0 ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే 2వ అత్యధికం. కాగా కాకినాడ జిల్లాలోని 6, కోనసీమ- 4, తూ.గో. జిల్లాలోని 15 మండలాల్లో వడగాల్పులకు ఆస్కారం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. – మీ వద్ద ఎలా ఉంది..?
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆదివారం జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ.. భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధినేత పొత్తు నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమైందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక చేతితో రూపాయి ఇస్తూ.. మరో చేతితో రూ.10 లాగేసుకుంటున్నారని ఆరోపించారు.
పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేనాని పవన్.. ఆయన స్థానికంగా అందుబాటులో ఉండేందుకు వసతితో పాటు పార్టీ కార్యాలయం కోసం చేబ్రోలులో భవనం ముస్తాబవుతోంది. తుది మెరుగులు దిద్దికుంటోంది . ఉగాది వేడుకలకు పిఠాపురంలోనే ఉండనున్న పవన్.. అదే రోజు ప్రత్యేక పూజలు చేసి గృహప్రవేశం చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో చేబ్రోలులోని భవంతి విద్యుత్ దీపకాంతుల్లో మిరుమిట్లుగోల్పుతోంది.
అమలాపురంలో ఓ బాదం చెట్టుపై వినాయకుడి లాంటి ఆకారం ఉన్న ఫొటో వైరల్గా మారింది. లయన్స్ హాల్ పక్కన ఖాళీ స్థలంలో బాదం చెట్టుపై వినాయకుడి రూపం కనిపించిందని స్థానికులు తెలిపారు. ఈ విషయం ప్రచారం కావడంతో ఆ చెట్టును చూసేందుకు జనం తరలివచ్చారు. లయన్స్ క్లబ్లో జరుగుతున్న జాతీయ కవి సమ్మేళనానికి వచ్చిన కవులు వినాయకుడి రూపాన్ని గుర్తించారు.
Sorry, no posts matched your criteria.