India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో జిల్లాపై TDP-జనసేన-BJP కూటమి ఫోకస్ పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లనుండటం కేడర్లో జోష్ నింపింది. శక్తిపీఠం కొలువై ఉండటం, శ్రీపాద వల్లభుడు జన్మించిన పవిత్ర భూమి కావడంతో పవన్ ‘వారాహి’ ఇక్కడి నుంచే ప్రచారంలో దిగనున్నట్లు తెలుస్తోంది. 3రోజులు అక్కడే ముఖ్య నేతలతో భేటి కానున్నారట. త్వరలో చంద్రబాబు, లోకేశ్ సైతం పర్యటన చేపట్టనున్నారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో జంట హత్యల కేసులో నిందితుడైన లోకా నాగరాజును అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపర్చినట్లు పిఠాపురం CI శ్రీనివాస్ తెలిపారు. బుధవారం అదే గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాస్, పెండ్యాల లోవాలపై పొలంలోనే నాగబాబు కత్తితో దాడి చేసి, హత్య చేశాడన్నారు. అనంతరం లోవ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడని CI పేర్కొన్నారు.
ఈసారి TDP అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు మన అమలాపురం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయనే గంటి హరీశ్ మాధుర్(33). 12వ లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి-మాజీ ఎంపీ విజయకుమారి దంపతుల కుమారుడు హరీశ్కు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారైంది. స్వగ్రామం ఐ.పోలవరం మండలం ఎదుర్లంక. BBM చదివిన ఈయన.. 2019లోనూ ఇక్కడే MPగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి మళ్లీ ఆయనే టికెట్ దక్కించుకున్నారు.
ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజులపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. వారాహి వాహనంపై పర్యటన ఉండేలా ఏర్పాట్లకు సిద్ధం కావాలన్నారు. టూర్ మేనేజ్మెంట్, టీం కన్వీనర్లు, కో కన్వీనర్లతో ఎన్నికల ప్రచారంపై చర్చించారు. ఈ మేరకు గొల్లప్రోలులో అనుమతి సైతం తీసుకున్నారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాపారానికి TDP నేతలే డాన్లనే విషయం విశాఖ పోర్టు ఘటన ద్వారా తేటతెల్లమైందని రాజమండ్రి సిటీ వైసీపీ MLA అభ్యర్థి భరత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావు కొకైన్ కేసులో కీలకమని తెలుస్తోందన్నారు. విశాఖపోర్టులో 25వేల కిలోల డ్రైఈస్ట్తో కలగలిపి కొకైన్ను అధికారులు గుర్తించారన్నారు. పట్టుబడిన వారు టీడీపీ నేత లోకేష్కు, బాలకృష్ణ వియ్యంకుడన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గానికి ‘పర్వత’ కుటుంబం ఐదుగురు MLAలను అందించింది. 1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో విజయం సాధించారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలుపొందారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్కి 2019లో విజయం దక్కింది. దీంతో ఆ కుటుంబం నుంచి ఐదుగురు నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయింది.
టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.
టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. అమలాపురం MLA అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ సిటీ MLA అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్.. కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. 2019లోనూ ఈ రెండు చోట్ల వీరే ప్రత్యర్థులు కాగా, ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.
ప్రపంచంలో ఏ మూలనున్నా సొంతూరు రాజకీయాలపై ఉండే ఆసక్తే వేరు. ఐదేళ్లకోసారొచ్చే ఎన్నికల పండక్కి ఎలాగైనా వచ్చి ఓటేస్తుంటారు NRI ఓటర్లు. ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,006 మంది NRI ఓటర్లు ఉంటే.. పురుషులు-790, స్త్రీలు- 215, థర్డ్ జెండర్ ఒకరు ఉన్నారు. తూ.గో జిల్లాలో 442, కాకినాడ-292, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 272 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమండ్రి నుంచి అధికంగా 173 మంది ఉంటే.. తుని నుంచి ముగ్గురు ఉన్నారు.
తూ.గో జిల్లాలో పలు భద్రతా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గౌరవం దక్కింది. ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం గురువారం రాత్రి విడుదల చేశారు. డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్ఐ బీవీఆర్ వర్మకు ఉత్తమ సేవా పథకం లభించింది. ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ జే.శ్రీనివాసరావు, కొవ్వూరు పీఎస్లో పనిచేస్తున్న హెచ్సీ కె.శ్రీనివాసరావు, ఉండ్రాజవరం పీఎస్లోని హెచ్సీ వై.నాగేశ్వరరావు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.