EastGodavari

News February 6, 2025

రాజానగరం: పోలీసులను ఆశ్రయించిన మైనర్ బాలిక

image

16 ఏళ్ల బాలిక 18 యువకుేడిపై రాజానగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజానగరానికి చెందిన మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. బాలుడు పాఠశాలలలో చదువుతున్న రోజుల నుంచి ఆమెను ప్రేమించి మాయ మాటలతో లోబరుచుకున్నాడు. బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు. న్యాయం కోసం ఆ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్సీ శ్రీకాంత్ పోక్సో కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 6, 2025

తూ.గో జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) 2025 సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి. గిరి ప్రసాద్ వర్మ, జిల్లా అధ్యక్షుడు సీహెచ్. విల్సన్ పాల్, జిల్లా కార్యదర్శి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News February 5, 2025

రాజమండ్రి: ఇంటర్, 10వ తరగతి పరీక్షలపై కలెక్టర్ సమావేశం

image

తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 43,754 మంది 51 పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

News February 5, 2025

పందలపాక హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్ట్

image

బిక్కవోలు మండలం పందలపాకలో గత నెల 29న హత్యకు గురైన లలితేశ్వరి కేసులో నిందితుడు తల్లి గుంతికోలు వరలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనపర్తి సీఐ సుమంత్ తెలిపారు. వరలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ లలితేశ్వరిని కేబుల్ వైర్ మెడకు బిగించి చంపిన సంగతి విదితమే. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని గ్రామ మహిళలు ఇటీవల ఆందోళన చేశారు.

News February 5, 2025

విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

image

విద్యార్థినిపై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్‌ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో జూ.లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

News February 5, 2025

అసంఘటిత కార్మికుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ – కలెక్టర్

image

అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ నందు ఉచిత నమోదుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్క కార్మికుడిని పోర్టల్‌లో నమోదు చేయించాలని సూచించారు.

News February 4, 2025

ఆక్రమణ భూముల క్రమబద్దీకరణ – తూ.గో కలెక్టర్

image

అనధికారికంగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములలో అభ్యంతరం లేని నివాస స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ పీ.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి రావడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి నివాస గృహాల ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిపై అనధికార ఆక్రమణలను గుర్తించాలని ఆదేశించారు.

News February 4, 2025

మహిళను బెదిరించి డబ్బులు వసూలు..  నిందితుడు అరెస్ట్

image

నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన మహిళను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రూ.కోటి 81 లక్షల విలువ గల స్థిర, చర ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు.

News February 4, 2025

తూ.గో: ఇసుక రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభమవ్వాలి- కలెక్టర్

image

తీర ప్రాంతం దాటి ఉన్న ఇసుక రీచ్‌ తవ్వకాలు బుధవారం నుంచి ప్రారంభించేలా సమన్వయ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్‌లలో నిర్దేశించుకున్న 10,39,350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 8,62,719 లభ్యత ఉందన్నారు.

News February 4, 2025

రాజమండ్రి: ‘రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు’ 

image

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోమవారం పేర్కొన్నారు. ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ కంటే 11 శాతం ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో 73 స్టేషన్ల రూపురేఖలు మార్చేదిశగా ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే రూ.8,455 కోట్లు రైల్వే ప్రాజెక్టులు రావడం హర్షణీయమన్నారు.

error: Content is protected !!