India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ వంటి కేసులను ఈ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను రాజీ ద్వారా త్వరితగతిన ముగించుకోవాలని ఆమె సూచించారు.

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రజావేదికలో సనమండ్ర పోసియ్యకు ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాలతో హౌసింగ్ అధికారులు, MRO గురువారం లబ్ధిదారుడి అసంపూర్తి గృహాన్ని పరిశీలించారు. హౌసింగ్ విభాగం నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. CM ఆదేశాలతో పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.

దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఓ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో అవిటి యేసు (42) అనే కార్మికుడు మృతి చెందాడు. పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు తలపై రాయి పడటంతో తీవ్ర గాయమైందని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిత్యం మనం వాడే పాలు కల్తీ అవుతున్నాయా? ఈ చిన్న పరీక్షలతో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు సహజ సిద్ధమైన తీపి, క్రీమ్ వాసన కలిగి ఉంటాయని, చేదుగా లేదా రసాయన వాసన వస్తే అవి కల్తీవని గుర్తించాలి. కొద్దిపాటి పాలలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు, ఆ పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కలిపినట్లు నిర్ధారించుకోవాలని నిపుణులు తెలిపారు.

ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసు, ఆరోగ్య, రెవిన్యూ విభాగాలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సమయాల్లో 9494060060 నంబర్ను సంప్రదించాలని కోరారు. కమిషనర్ రాహుల్ మీనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసు, ఆరోగ్య, రెవిన్యూ విభాగాలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సమయాల్లో 9494060060 నంబర్ను సంప్రదించాలని కోరారు. కమిషనర్ రాహుల్ మీనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసు, ఆరోగ్య, రెవిన్యూ విభాగాలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సమయాల్లో 9494060060 నంబర్ను సంప్రదించాలని కోరారు. కమిషనర్ రాహుల్ మీనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసు, ఆరోగ్య, రెవిన్యూ విభాగాలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సమయాల్లో 9494060060 నంబర్ను సంప్రదించాలని కోరారు. కమిషనర్ రాహుల్ మీనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.