India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మ ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. వర్మను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.

ఉమ్మడి తూ.గో 21 నియోజకవర్గాల్లో TDP-జనసేన-BJP కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 15, జనసేన 6చోట్ల పోటీ చేస్తుండగా.. BJP నుంచి ఎవరూ లేరు. పి.గన్నవరం టికెట్ ముందుగా TDPకి కేటాయించగా.. కొన్ని పరిణామాలతో జనసేనకు వెళ్లింది. వైసీపీ కూడా ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో నేతలంతా ఇక ప్రచారం రంగంలోకి దిగనున్నారు. ‘కూటమి’ Vs వైసీపీగా మారిన ఈ పోటీలో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి.

కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో కలిసి రైలు కింద పడబోయిన మహిళను రైల్వే పోలీసులు కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా తునిలోని ఓ కాలనీకి చెందిన మహిళ.. తన 4ఏళ్ల కుమారుడిని తీసుకెళ్లి రైలు పట్టాలపై నిలబడింది. కానిస్టేబుల్స్ శ్రీనివాస్, మోహనరావు గమనించి వారిని రక్షించారు. పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి.. భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఇంటికి పంపినట్లు ఎస్సై తెలిపారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ‘కూటమి’ టికెట్పై సందిగ్ధత తొలగింది. ముందు TDP నుంచి రాజేశ్కు టికెట్ దక్కగా.. అసమ్మతి నేపథ్యంలో ఆ టికెట్ జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. విప్పర్తి ఇరిగేషన్ శాఖలో.. గిడ్డి పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. వీరిద్దరూ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.

ఐటీ కంపెనీలో పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలానికి చెందిన యాపుగంటి ఫణికుమార్ను మాదాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఫణికుమార్ మాదాపూర్లోని ఇజ్జత్నగర్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జల్సాలకు అలవాటు పడి, డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి 18కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇతడు మాదకద్రవ్యాలు అమ్ముతూ గతంలోనూ పట్టుబడ్డాడు.

ఎన్నికలలో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో శనివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు.

అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ అన్షోర్ టెర్మినల్లో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటరమణారావు(55) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. టాటా సంస్థలో స్టోర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రమణారావు కి.మీ దూరం నడిచి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్నారు. బెండమూర్లంక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందారన్నారు.

ఆలమూరు మండలం జొన్నాడలో అనంతపురం జిల్లాకు చెందిన ఊదపల్లి రమేష్ బాబు (45) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆలమూరులో నివాసముంటున్న సోదరుడు రామకృష్ణ ఇంటికి గత నెల 19వ తేదీన రమేష్ బాబు డబ్బుల కోసం వచ్చాడన్నారు. చెడు వ్యసనాలకు, మద్యానికి బానిస కావడం, అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు నుండి శ్రీకాకుళం జిల్లాకు జామకాయల లోడుతో వెళ్తున్న బొలోరో వ్యాన్ నీలాద్రిరావుపేట వద్దకు వచ్చేసరికి లారీ ఎదురుగా రావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జామకాయలు రోడ్డుపై పడిపోయాయి. వ్యాన్లో ఉన్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

పి.గన్నవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ఈ ఏడాది జనవరి 31న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన సత్యనారాయణ సీఆర్ రెడ్డి కళాశాలలో బీఏ, బీఎల్ చదివారు. 1961 మే 15న జన్మించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరి పి.గన్నవరం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.