EastGodavari

News July 8, 2024

అన్నవరం దేవస్థానానికి 2 కొత్త బస్సులు

image

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.

News July 8, 2024

అన్నవరం దేవస్థానానికి 2 కొత్త బస్సులు

image

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.

News July 8, 2024

కోనసీమ: పంట కాలువలో ‘దెయ్యం చేప’

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారం పంట కాలువలో ఆదివారం స్థానిక రైతులకు అరుదైన ‘డెవిల్ ఫిష్’ దొరికింది. ఒంటిపై మచ్చలతో ఉన్న ఈ చేపను డెవిల్ ఫిష్ (దెయ్యం చేప)గా పిలుస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వాటి చుట్టూ ఉండే చేపలను గాయపరిచి, చంపి తినడం ఈ చేపలకు అలవాటని అన్నారు. ఇవి ఉన్న చోట మిగతా చేపలు అంతరించిపోతాయని పేర్కొన్నారు.

News July 8, 2024

నేటి నుంచి ఉచిత ఇసుక విధానం: కలెక్టర్ మహేశ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం నుంచి 6 స్టాక్ పాయింట్లలో ఉచిత ఇసుక విధానం అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధమైందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక రూ.245లకు విక్రయించనున్నట్లు తెలిపారు. అలాగే అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ కలెక్టరేట్ వద్ద నేడు ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరుగుతుందని, ఫిర్యదులు అందజేయవచ్చని అన్నారు.

News July 7, 2024

భూ కజ్జాలు చేస్తే ఉపేక్షించం: మంత్రి సుభాశ్

image

పామర్రు మండలం కోటిపల్లిలో ఆరాద్రి అంజనీకుమారి అనే వృద్ధురాలి భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాశ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే వెళ్లి ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. భూమిని ఆక్రమించుకున్నది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంజనీకుమారికి ధైర్యం చెప్పి.. తక్షణమే ఆమెకు న్యాయం జరగాలని పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.

News July 7, 2024

9న అమలాపురంలో జాబ్‌మేళా: కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న వికాస ఔట్‌సోర్సింగ్ జిల్లా సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో అవుట్ సోర్సింగ్ సంస్థ జిల్లా కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. బీఎస్సీ, బీటెక్, బీసీఏ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు.

News July 7, 2024

రాజమండ్రిలో జులై 8న మంత్రి సత్యకుమార్ పర్యటన

image

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తూ.గో. జిల్లా పర్యటన ఖరారైంది.
జూలై 8న రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అనపర్తికి చేరుకుంటారు. అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజమండ్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News July 7, 2024

తూ.గో.: బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

రాజోలు మండలం పొన్నమండకు చెందిన ఓ బాలికను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు SI పృథ్వీ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అయ్యప్పస్వామి అదే గ్రామానికి చెందిన బాలికను రెండేళ్ల క్రితం పరిచయం చేసుకొని భయపెట్టి రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. గతనెల 26న బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2 నెలల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకోగా విషయం తెలిసిన బాలిక పోలీసులకు ఫిర్యాదుచేసింది.

News July 7, 2024

కాకినాడ: రేబిస్‌తో కార్మిక నాయకుడు మృతి

image

ప్రపంచ జూనోసిస్ డే రోజునే ప్రాణాంతక రేబిస్ వ్యాధితో కార్మిక నాయకుడు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. తాళ్లరేవు మండలం జెల్లావారిపేటకు చెందిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మందనక్క తనుకురాజు (64) నెల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. వైద్యం చేయించుకోగా 2 రోజుల క్రితం అతనికి రేబిస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.

News July 7, 2024

తూ.గో.: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని.. సూసైడ్

image

నిడదవోలుకు చెందిన ఓ యువతి (22) కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రాజేష్ రెండేళ్లుగా ప్రేమించున్నారు. ప్రియుడికి ఏడాది క్రితం మరో యువతితో వివాహమైంది. రాజేష్‌ను రెండో పెళ్లి చేసుకుంటానని యువతి పేరెంట్స్‌తో చెప్పగా నిరాకరించారు. మనస్తాపంతో తాడేపల్లిగూడెంలో తాను నర్సుగా పనిచేస్తున్న ఆసుపత్రిలో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరలించగా చికిత్సపొందుతూ చనిపోయింది.