EastGodavari

News December 19, 2024

ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనపర్తి ఎమ్మెల్యే

image

అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ పురందేశ్వరితో కలిసి కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నితిన్ గడ్కారీ, గజేంద్ర సింగ్ షేకావత్‌ను కలిసి రహదారుల అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి, రైల్వే హల్ట్ ఇప్పించాలని కోరారు. దానిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

News December 18, 2024

కోనసీమ పోలీసులకు ఏబీసీడీ అవార్డులు

image

నేర పరిశోధనా రంగంలో కేసుల సత్వర పరిష్కారానికి ఆధునాతన విధానాలను పాటించిన కోనసీమ జిల్లా పోలీసులను ఏబీసీడీ అవార్డులు వరించాయి. మంగళగిరి కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం పోలీసులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా కేసును ఛేదించినందుకు ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ ప్రసాద్, రూరల్ సీఐ వీరబాబు, సీసీఎస్ ఎస్ఐ ప్రశాంత్, రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు అవార్డులు అందుకున్నారు.

News December 18, 2024

తిరుపతిలో కాకినాడ యువకుడి సూసైడ్

image

శంఖవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన యువకుడు తిరుపతి రూరల్ అవిలాలలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పి. రాజేశ్ జీవనోపాధికోసం తిరుమలకు వచ్చి ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువతిని ప్రేమించి ఆమెకు చెప్పాడు. ఆమె అంగీకరించలేదని మంగళవారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News December 18, 2024

రాజమండ్రి: పోలీసులపై దాడి.. అరెస్టు

image

పోలీసులపై దాడి చేసిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేశ్ బాబు కథనం మేరకు.. రాజమండ్రిలో శ్రీకాకుళం పోలీసులపై దాడి చేసి.. రాపాక ప్రభాకర్‌‌ను తీసుకువెళ్లిన నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడి చేసిన వారిలో భీమవరానికి చెందిన శ్రీకాంత్, వినోద్, రాజు, మహంకాళి, క్రాంతి, మొగల్తూరుకి చెందిన కామరాజుతో పాటు రాజమండ్రికి చెందిన మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు

News December 18, 2024

కడియం: హత్య కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష

image

కడియం మండలం వేమగిరిలో 2002లో వెంకన్నపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి సత్తిబాబుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధించారని కడియం ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ముద్దాయి భార్య భవాని వేమగిరి తోటకు చెందిన వెంకన్నతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన సత్తిబాబు కత్తితో వారిపై దాడి చేశాడన్నారు. ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

News December 18, 2024

తూ.గో: మహిళను స్వదేశానికి రప్పించిన మంత్రి

image

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని,తనను రక్షించమని కార్మిక శాఖ మంత్రిని వేడుకున్న గంటా దీప్తి అనే మహిళ మంత్రి సుభాష్ చొరవతో స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి సుభాష్‌ని బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ..ఏజెంట్లు మాయాజాలానికి ప్రజలు మోసపోవద్దని సూచించారు. బాధితులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుదన్నారు. ఏజంట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

News December 17, 2024

సామర్లకోట: కొనసాగుతున్న పోలీస్ పహారా

image

సామర్లకోట మండలం వేట్లపాలెంలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇరువర్గాల దాడిలో ముగ్గురు మృతి చెందడంతో వేట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా‌ సోమవారం రాత్రి నుంచి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. DSP నిరంతరం అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు

News December 17, 2024

తూ.గో: కొనసాగుతున్న పోలీస్ పహారా

image

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో పోలీస్ పహారా కొనసాగుతుంది. ఇరు వర్గాలు దాడిలో ముగ్గురు మృతి చెందడంతో సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా‌ సోమవారం రాత్రి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. నిరంతరం పరిస్థితులను సమిక్షిస్తున్నారు.

News December 16, 2024

అనపర్తిలో రైలు ఢీకొని యువకుడు మృతి

image

అనపర్తిలో రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు..అనపర్తికి చెందిన కే. పవన్ (25) ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి రెస్టారెంట్‌కి బయలుదేరాడు. మార్గమధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా వైజాగ్ వైపు వెళ్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 16, 2024

కాకినాడ: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

image

కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.