India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో జిల్లాలోని ఎస్ఈబీ దేవరపల్లి స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈ నెల 10వ తేదీన వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే వారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని, రూ.5 వేల ధరావతు చెల్లించాలని సీఐ కె.వెంకటేశ్వరస్వామి తెలిపారు.. పాట దక్కించుకున్న వారు అదే రోజు వేలం సొమ్ముతో పాటు GST కలిపి చెల్లించాలని సూచించారు.
రాజానగరం మండలం జి.యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో రూ.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి బిజినెస్ కరస్పాండెంట్ నానిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారని తూ.గో. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మహిళా సభ్యులు చేసిన ఫిర్యాదుతో జూన్ 20న విచారణ చేపట్టి నివేదికను అందించారన్నారు. DRDA అధికారి జనార్ధన్ రావు దీనిపై విచారణ చేస్తారన్నారు.
ప్రేమ పేరుతో బాలికను యువకుడు అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన రామచంద్రపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు జూన్ 24న బాలిక అదృశ్యమైంది. సురేశ్ ప్రేమ పేరుతో ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లి ఒక లాడ్జిలో అత్యాచారం చేశాడని ఎస్సై సురేశ్ బాబు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశామన్నారు. సురేశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.
ఏడాదిన్నర బాలుడి విక్రయం కేసులో ప్రత్తిపాడుకు చెందిన అమ్ములును మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆమెను ముంబైకి తీసుకువెళ్లారని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలి కోసం ముంబై కంజూర్మార్క్ పోలీసులు 3 రోజులుగా గాలిస్తున్నారు. నిందితురాలిగా అనుమానిస్తున్న తోట మంగతాయారు పరారీలో ఉంది. ఆమె బంధువు అమ్ములు కేసులోని వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిందని అరెస్టు చేశారు.
వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు గురువారం నుంచి తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. దీనికోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ, దగ్గుబాటి పురందీశ్వరి కోరారు. కేంద్ర మంత్రిని కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.
వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు గురువారం నుంచి తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. దీనికోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
అల్లూరి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లాలోని పలు లోతట్టు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పెదబయలు అనే గ్రామం వద్ద ప్రజా సమస్యలు చెప్పేందుకు వచ్చిన బాలంనాయుడుకు 100 ఏళ్ల వయసు అని, అతను మాజీ ఎంపీపీ అని తెలిసి సంతోషపడ్డారు. అతనిని ఎత్తుకొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రజా సమస్యల పట్ల నాయుడు శ్రద్ధను కలెక్టర్ మెచ్చుకొని అభినందించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ విషయాన్ని ఆమె మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 2,41,771 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా 2,39,479 మందికి పెన్షన్లను అందించామని స్పష్టం చేశారు.
మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చునని ఏపీఈపీడీసీఎల్ రాజమండ్రి ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షణ ఇంజినీర్ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఇతర యూపీఐ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఛాన్స్ లేదన్నారు.
Sorry, no posts matched your criteria.