India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో. జిల్లా ఏజెన్సీ ఏరియాలో కొద్దిరోజులుగా పులి సంచారం ప్రజలను భయపెడుతోంది. ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లోనూ పులి సంచరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపన్నధార ఏరియాలో ఆదివారం ఓ పశువు చనిపోవడంతో పోలీసు అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. పశువును చంపింది పులి లేదా ఏదైనా అడవి జంతువా అనేది అధికారులు నేడు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇటీవల 45 రోజులపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి తిరిగింది.
రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం గ్రివెన్స్ డేను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశానని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీన నిర్వహించడం లేదని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం ఆయన కాకినాడ కలెక్టరేట్ నుండి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వలన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీన నిర్వహించడం లేదని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం ఆయన కాకినాడ కలెక్టరేట్ నుండి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వలన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నుంచి ఆమె శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామాలలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కాకినాడలో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. నిందితులను కాకినాడ మూడో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వి.నరసింహారావు ముందు హాజరుపరిచారు. వారిలో 14 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. 28 మందికి రూ.10 వేలు చొప్పున రూ.2,80,000 జరిమానా వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా విషయం సంచలనం రేపుతోంది. సెజ్ భూములు, రేషన్ బియ్యం రవాణా, పోర్టు యజమానిపై బెదిరింపుల వంటి అంశాలు రోజుకు ఒకటి వెలుగుచూస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం పేరుతో వేల కోట్ల రూపాయలు పలువురు నేతలు దోచేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డీప్ వాటర్ పోర్టు, సెజ్లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామాల్లో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025 జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు కొనసాగుతాయని చెప్పారు. భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈనెల 9వ తేదీన బీఈడీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు. బీఈడీ రెండు సంవత్సరాల కోర్సుకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఎడ్-సెట్ 2024 పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ విద్యార్థులు 40 శాతం, ఓసీ విద్యార్థులు 50 శాతం మార్కులు డిగ్రీలో పొంది ఉండాలన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు వేయనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Sorry, no posts matched your criteria.