EastGodavari

News July 1, 2024

త్వరలో మహిళలకు తీపికబురు: కోన

image

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం తీపికబురు చెబుతుందని డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. మండపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో మంత్రులు గంగిరెద్దుల్లా తలలు ఊపడం తప్పించి ఏమీ చేయలేదని అన్నారు. కూటమి మంత్రులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

News July 1, 2024

YCP కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు: జక్కంపూడి

image

హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులోని MFకన్వెన్షన్ హాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఓటమి చెందిన నేపథ్యంలో కార్యకర్తలు అధైర్య పడకూడదన్నారు. కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదన్నారు.- జక్కంపూడి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News June 30, 2024

తూ.గో.: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

కాకినాడ: రేపే పవన్ రాక.. భారీ బ్యానర్ల ఏర్పాటు

image

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఆయన ఇంటిని పార్టీ నాయకులు సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇప్పటికే ఆయన అభిమానులు భారీఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటుచేశారు. ఇంటిపై భారీ బెలూన్ ఎగరేశారు.

News June 30, 2024

కాకినాడ: కరెంట్ షాక్‌తో బీటెక్ విద్యార్థి మృతి

image

కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతిచెందిన ఘటన కాకినాడలో జరిగింది. స్థానికుల వివరాలు.. కాకినాడ జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ చక్రధర్ స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో ఉంటున్నారు. ఆయన కుమారుడు విజయ్ ఉదయం ఇంట్లో ఇంటర్‌నెట్ వైర్ కట్ చేస్తుండగా సడెన్‌గా కరెంట్ రావడంతో షాక్‌తో చనిపోయాడు. కాగా అతను ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫస్ట్‌ఈయర్ చదువుతున్నాడు.

News June 30, 2024

కాకినాడ: యువకుడు గల్లంతు.. డెడ్‌బాడీ లభ్యం

image

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప శివారు చెరువులో గల్లంతైన కాకినాడ రూరల్ మండలం వలసపాకలకు చెందిన తంగెళ్ల అప్పన్న(25) మృతదేహం లభ్యమైంది. కూలీ పనికి వచ్చిన అప్పన్న శనివారం భోజనం అనంతరం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి చెరువుగట్టు పైకి వెళ్లాడు. ముగ్గురులో ఇద్దరు ప్రమాదవశాత్తూ జారి చెరువులో పడిపోయారు. ఒకరిని స్థానికులు రక్షించగా.. అప్పన్న గల్లంతయ్యాడు. అతడి కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది.

News June 30, 2024

తెల్లవారుజామున రోడ్డుప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

కాకినాడలో విషాదం.. 14ఏళ్ల బాలిక ఆత్మహత్య

image

కాకినాడలోని గాంధీనగర్‌కు చెందిన 14ఏళ్ల విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని ఆమె సోదరుడు మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో శనివారం ఉరి వేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2 టౌన్ SI చినబాబు కేసు నమోదు చేశారు.

News June 29, 2024

అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తులకు ఇక్కట్లు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలోని ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొండ దిగువన ప్రసాదం విక్రయకేంద్రం వద్ద రాత్రివేళ ఏర్పాటుచేసిన లైట్ల వద్దకు పురుగులు రావడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. కనీసం లైట్లు కూడా ఆపట్లేదని వాపోతున్నారు. కౌంటర్ నుంచి ప్రసాదం ప్యాకెట్లు తీసుకునే సమయంలో పురుగుల కారణంగా అసౌకర్యానికి గురవతున్నామని చెబుతున్నారు.

News June 29, 2024

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డుపైనే నా తొలిసంతకం: మంత్రి సుభాష్

image

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తన తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవననిర్మాణ కార్మికసంఘం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వ బృందం శనివారం మంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని హామీ ఇచ్చారు.