EastGodavari

News November 6, 2024

రాజమండ్రి: ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

image

ఉభయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 11న నోటిఫికేషన్ విడుదలవుతుందని, 18న నామినేషన్ కు గడువు పూర్తవుతుందన్నారు. 19న నామినేషన్లు పరిశీలన, 21న ఉపసంహరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

News November 6, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్ ప్రశాంతి
*టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన జగ్గంపేట ఎమ్మెల్యే
*పిఠాపురంలో అగ్ని ప్రమాదం
*తుని: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
*కోనసీమ అభివృద్ధిలో భాగం అవుతా: మంత్రి అచ్చెన్న
*జగ్గంపేటలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
*ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..టీచర్ అరెస్ట్
*చంద్రబాబు కొట్టిన నా మంచి కోసమే: మంత్రి సుభాష్
*తుని: మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు షాక్

News November 5, 2024

ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. టీచర్ అరెస్ట్ 

image

ఐ.పోలవరం హైస్కూల్‌లో విద్యార్థినుల పట్ల మ్యాథ్స్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ హాస్టల్ వార్డెన్ చేసిన ఫిర్యాదుపై మంగళవారం SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై వార్డెన్‌ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆరోపణలపై టీచర్ రెండుసార్లు సస్పెండ్ అయ్యారు.

News November 5, 2024

మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన బీజేపీ నేతలు

image

డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమలాపురం వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అమలాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

News November 5, 2024

రాజోలు: వృద్ధుడి హత్య.. బంగారం, నగదు చోరీ

image

రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో జగ్గారావు (93)ని హత్య చేసి ఇంట్లోని 22 గ్రాములు బంగారం, రూ.40 వేలు నగదు చోరీ చేశారని మృతుని మనవడు శ్రీకాంత్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన సందీప్ హత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతుడి ఇంట్లో దొంగతనం కేసులో సందీప్ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని, ఆ కక్షతో వృద్ధుడిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

News November 5, 2024

కోనసీమ అబ్బాయి, కెనడా అమ్మాయి పెళ్లి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కెనడా అమ్మాయితో సోమవారం అమలాపురానికి చెందిన అబ్బాయితో పెళ్లి జరిగింది. అమలాపురానికి చెందిన మనోజ్ కుమార్ కెనడాకు చెందిన ట్రేసీ రోచే డాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమలాపురం వచ్చిన కెనడా అమ్మాయి బంధువులు పెళ్లి ఇంట సందడి చేశారు. తెలుగు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. ఆ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు.

News November 5, 2024

మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం: పవన్ కళ్యాణ్

image

యు.కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో ఆయన ఈ సమస్యలపై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు తెలుసుకున్నారు. వారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స సంపద నశిస్తుందని ఆయన దృష్టికి వచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు

News November 4, 2024

తూ.గో: మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

image

తూ.గో.జిల్లాకు చెందిన నాగమణి అనే మహిళ బహ్రెయిన్ వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన లోకేశ్ ఆమెను రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిపై నాగమణి లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తనను ముగ్గురు ఏజెంట్లు మోసం చేశారని ఆమె వాపోయారు.

News November 4, 2024

తూ.గో : ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు

image

తూ.గో జిల్లాలో ఓ క్రెడిట్ కార్డు యువకుడి మృతికి కారణమైంది. గండేపల్లి(M) పి.నాయకంపల్లికి చెందిన సత్యసాయి(22) బ్రాయిలర్ కోళ్లు పెంచుతున్నాడు. ఈక్రమంలో గత నెల 30న ఫ్రెండ్ క్రెడిట్ కార్డుతో రూ.1000 పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఈ విషయం అతనికి తెలిస్తే అవమానంగా ఉంటుందని భావించాడు. అదే రోజు రంగంపేట మండలం కోటపాడు సమీపంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా మృతదేహాన్ని గుర్తించారు.

News November 4, 2024

నేడు రాజమహేంద్రవరంలో యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.