EastGodavari

News November 3, 2024

నవంబర్ 4న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 4,5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులతో వివిధ సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని పెర్కొన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఆయా సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారని సిబ్బంది పేర్కొన్నారు.

News November 3, 2024

నవంబర్ 4న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 4,5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులతో వివిధ సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని పెర్కొన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఆయా సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారని సిబ్బంది పేర్కొన్నారు.

News November 2, 2024

బాధిత కుటుంబానికి అండగా వైసీపీ: మాజీ మంత్రి

image

కడియం మండలం బుర్రిలంకలోని ఓ మహిళ ఇటీవల హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

News November 2, 2024

కోనసీమ ఎస్పీకి ఫోన్ చేసిన పవన్  

image

రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఆలమూరు మండలం మడికి చెందిన శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి, 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె వెన్నెల ఆత్మహత్య చేసుకుందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. చెముడులంక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వెన్నెల స్కూల్ యాజమాన్యం ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు. కోనసీమ ఎస్పీతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.

News November 2, 2024

రాజమండ్రి జైలుకి పినిపే కుమారుడి తరలింపు

image

మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు అమలాపురం కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్‌, ధర్మేశ్‌ల పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం వారిని అమలాపురం కోర్టులో హాజరుపరిచారు. మరో 14 రోజులు వారికి రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వలు జారీ చేసింది. దీంతో వాళ్లని రాజమండ్రి జైలుకి తరలించారు.

News November 2, 2024

తూ.గో: పోలవరం పై మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు

image

పోలవరం ప్రాజెక్ట్ పై గత వైసీపీ ప్రభుత్వ పనితీరుపై మంత్రి సుభాష్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..గత జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయన్నారు. A అంటే అమరావతి, P అంటే పోలవరం నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

News November 1, 2024

ప్రయాణికుల రద్దీపై ప్రత్యేక ట్రైన్లు: సూపరింటెండెంట్ రమేష్

image

దీపావళి, దసరా పండగల నేపథ్యంలో వివిధ ప్రాంతాల ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విజయవాడ విశాఖపట్నం ఏర్పాటు చేసినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..08457 విశాఖ విజయవాడ, 08568 విజయవాడ విశాఖ ట్రైన్ నవంబర్ ఒకటి నుంచి 13 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. జన సాధారణ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్‌ను ప్రయాణీకుఅుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 1, 2024

కాకినాడ: చనిపోయిన ముగ్గురు ఎవరంటే?

image

కాకినాడ(D) కాజులూరు(M) సలపాకలో గురువారం రాత్రి జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మొత్తం నలుగురిపై దాడి చేయగా.. ఒకే కుటుంబానికి చెందిన బత్తుల రమేశ్, చిన్ని, రాజు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారిలో ముగ్గురు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ విక్రాంత్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News November 1, 2024

కాకినాడ: స్థలం విషయంలో వివాదం.. ముగ్గురు మృతి

image

కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని సలపాక చిన్నపేటలో రెండు కుటుంబాల మధ్య  గురువారం ఘర్షణ చెలరేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై మరొక కుటుంబం  దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. స్థలం విషయంపై కొంతకాలంగా వివాదం జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. గొల్లపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు దిగి‌న రెండు కుటుంబాలు ఎదురెదురుగానే ఉండటం గమన్హారం.

News October 31, 2024

రేపటి గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్

image

అల్లూరి జిల్లా కేంద్రం అయిన పాడేరులో శుక్రవారం జరగవలసిన గ్రీవెన్స్ (మీకోసం) కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం మీడియాకు ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వలన రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్‌లకు చెందిన 11 మండలాల వాసులు గమనించాలని కోరారు. రేపు పాడేరు రావద్దని కోరారు.