India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి నుంచి జగ్గంపేట స్కూటిపై వస్తున్న భార్యభర్తలు ఇద్దరిని వెనుక నుంచి వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ కింద పడిపోగా ఆమె మీద నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.
తూ.గో. జిల్లా యువకులు ఇద్దరు గుజరాత్లో చనిపోయిన విషయం తెలిసిందే. కొవ్వూరు(M)కి చెందిన రవితేజ, లోహిత్ గుజరాత్లో మంగళవారం స్నేహితులతో కలిసి విహరయాత్రకు వెళ్లి జలాశయంలో మునిగిపోయారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్థానిక MLA వెంకటేశ్వరరావు ఎంపీ పురందీశ్వరికి ఈ విషయం చెప్పగా.. అక్కడి అధికారులతో ఆమె మాట్లాడారు. వారి మృతదేహాలను కొవ్వూరుకు రప్పించాలన్నారు.
ఇద్దరు తూ.గో. జిల్లా యువకులు గుజరాత్లో చనిపోయారు. కొవ్వూరు(M) చెందిన టీడీపీ నేత హరిబాబు కుమారుడు రవితేజ, మరొక యువకుడు లోహిత్ గుజరాత్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వారు అక్కడ పలు ప్రాంతాలను చూసేందుకు వెళ్లి ఓ జలాశయంలో మునిగి చనిపోయారు. కుమారుల మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి మృతదేహాలు కొవ్వూరుకు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు MLA వెంకటేశ్వరరావు తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవాళి దీపావళి అని అభివర్ణించారు. దీపాల శోభతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అనాదిగా వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలకు సకల శుభాలను ఆనందాన్ని కలుగజేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రం దీపాల వలె వెలగాలని కోరారు.
గోదావరి పుష్కరాలు-2027కి సంబంధించి కొవ్వూరులో ఉన్న గోదావరిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి బుధవారం పరిశీలించారు. జరగబోయే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఈ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుస్మిత రాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాకినాడలో తల్లీకుమార్తెలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లి సరస్వతి కొంతకాలంగా మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో తల్లిని చూసుకోవడం కోసం కుమార్తె స్వాతి పెళ్లి చేసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. తల్లి అనారోగ్యంతో ఉండటం చూసి మనస్తాపానికి గురైన స్వాతి 3రోజుల క్రితం ఉరేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లి అనారోగ్య పరిస్థితులను చూడలేక కుమార్తె తల్లికి ఉరేసి అనంతరం తాను ఉరేసుకున్న ఘటన కాకినాడలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలానికి చెందిన తల్లీకుమార్తెలు సరస్వతి, స్వాతి 12 ఏళ్లుగా కాకినాడలో ఉంటున్నట్లు చెప్పారు. మృతదేహాలు పాడైపోయి ఉండటంతో కాకినాడ జీజీహెచ్కు తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI నాగదుర్గారావు తెలిపారు.
తూ.గో జిల్లాలో సారా బట్టీలు, గంజాయి, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులో నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ మద్యంపై దాడులు నిర్వహించి 47 మంది పై FIR నమోదు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో సారా తయారీకి ఉపయోగించే 5,300 లీటర్ల బెల్లం ఊట, 6,500 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
విజయవాడ సింగ్ నగర్లో మహిళా డాన్సర్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు తూ.గో జిల్లా కాకినాడకు చెందిన డాన్సర్ వెంకటలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. ఉపాధి నిమిత్తం సింగ్ నగర్కు వచ్చి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో స్థానికులు హత్యగా భావించారు. ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక సీఐ వెంకటేశ్వరనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు- 2027పై మంగళవారం ప్రాథమిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టబోయే చర్యలపై చర్చించారు. పుష్కరాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.