India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూనవరం మండలం లింగాపురంలో కొద్దిరోజులుగా పులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. అయితే చింతూరు నుంచి కూనవరం వస్తున్న కారుపై దాడి చేసిందనే ప్రచారం అవాస్తవమని CI కన్నప్పరాజు తెలిపారు. అసత్యపు ప్రచారాలపై ప్రజలు భయాందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పకడ్బందీగా నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. రాజమహేంద్రవరంలో సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 125 మద్యం షాపులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ షాపులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.
తూ.గో.జిల్లాలోని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం ద్వారా అభివృద్ధి చేయనుంది. ఇందులో రాష్ట్రంలోని 53 స్టేషన్లు ఎంపిక కాగా జిల్లాలోని పలు స్టేషన్లకూ చోటు దక్కింది. రాజమండ్రి స్టేషన్కు రూ.214 కోట్లు, కాకినాడ జంక్షన్కు రూ.21 కోట్లు, సామర్లకోట స్టేషన్కు రూ.15.13 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. పనులన్నీ పూర్తి అయ్యాక రాజమండ్రి రైల్వేస్టేషన్ పైఫొటోలో ఉన్నట్లు కనిపిస్తుంది.
రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో రైతులు 1,300ఎకరాల్లో పోగాకు పంటను రైతులు సాగు చేస్తున్నారు. రాజవొమ్మంగి, వట్టిగడ్డ, ఎర్రంపాడు గ్రామాల్లో పోగాకు నారును పెంచి రైతులకు అందజేస్తున్నారు. ఒకొక్క ఎకరానికి 10వేల మొక్కలు నాటుతున్నామని రైతులు ఆదివారం తెలిపారు. క్వింటాల్ పోగాకును రైతుల వద్ద నుంచ రూ.1,5000 కు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయని రైతులు తెలిపారు. ఖర్చులు పోను ఎకరానికి రూ.30వేలు ఆదాయం వస్తుందన్నారు.
జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శనివారం ఇరువైపుల వాదనలు ముగియడంతో నవంబర్ 5న నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో 5న తగిన తీర్పు చెప్తామని వెల్లడించారు.
తొండంగి మండలం ఏవీ నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మధు కేసులో ఇద్దరు నిందితులకు శనివారం కోర్టు రిమాండ్ విధించిందని SI జగన్మోహనరావు తెలిపారు. ఈ కేసులో నిందితులు శిరీష, ప్రశాంత్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు. వారం రోజుల క్రితం చనిపోయిన మధు మరణంపై ఇంకా మిస్టరీ వీడలేదని తెలిపారు. ఇది సహజ మరణమా? లేక హత్యా? అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు.
రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో బలహీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాల ప్రభావం బుధవారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
➣తూ.గో: బాధితుడికి మంత్రి లోకేశ్ హామీ
➣రాజానగరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
➣ఒక్క రోజులో ఆరు పుణ్యక్షేత్రాల సందర్శన: దుర్గేశ్
➣కాకినాడ: రెవెన్యూ అధికారిని సత్కరించిన కలెక్టర్
➣దేవీపట్నం: ‘రేపు అమ్మవారి దర్శనాలకు రావొద్దు’
➣రాజమండ్రి: ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన
➣పిఠాపురం: ‘కల్తీ నెయ్యిపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి’
➣పెద్దాపురంలో అగ్ని ప్రమాదం.. మహిళ మృతి
పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మారకోత్సవాలలో భాగంగా రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ విద్యార్థులకు పోలీసు శాఖ వినియోగించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాలు, సాంకేతికత పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట సుబ్బరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తూ.గో.జిల్లా అనపర్తి మండలం మార్కండేయపురానికి చెందిన ప్రమీల అనే మహిళ పనికోసం కువైట్ వెళ్లింది. ఏజెంట్ మాటలు నమ్మి ఆమె వెళ్లగా వంటపని కాకుండా ఇతర పనులు చేయిస్తూ జీతం ఇవ్వట్లేదని ఆమె భర్త రాజాప్రసాద్ వాపోయారు. తన భార్యను స్వదేశానికి తీసుకురావాలని ఆయన మంత్రి లోకేశ్ను Xలో వేడుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని ఎక్స్ ద్వారా లోకేశ్ హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.