India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ కె.ఎస్.నారాయణ శుక్రవారం రాత్రి బస్సులోనే మృతి చెందారు. పెనుగొండ మండలం వడలి గ్రామంలోని శ్రీనివాస సర్వీసింగ్ సెంటర్ వద్దకు వచ్చేసరికి కండక్టర్ నారాయణకు గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆయన కుటుంబం కొవ్వూరులో నివాసం ఉంటున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.
పి.గన్నవరం మండలంలోని లంకల గన్నవరంలో పక్షవాతం భారిన పడిన 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సత్యనారాయణను శుక్రవారం అరెస్టు చేశామని సీఐ భీమరాజు తెలిపారు. అతన్ని రాజోలు కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది అన్నారు. దీంతో నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించామని ఎస్సై శివకృష్ణ తెలిపారు.
కొత్తపేట మండలం కోరుమిల్లికి చెందిన యువతిని అపహరించేందుకు ప్రయత్నించిన 10 మందిపై కేసు నమోదు చేశామని కొత్తపేట ఎస్సై సురేంద్ర శుక్రవారం తెలిపారు. కోరుమిల్లికి చెందిన వెంకటరత్నం ఈ నెల 20న తన కొడుకు, కూతుర్ని తీసుకుని ముక్కామల వెళ్లి వస్తుండగా కొత్తపేట సాయిబాబా గుడి వద్ద కోరుమిల్లికి చెందిన కృష్ణ, మరో 9 మంది యువతిని అపహరించేందుకు ప్రయత్నించారన్నారు. వెంకటరత్నం ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు.
ఈనెల 28వ తేదీన కాకినాడలోని జిల్లా వికాస కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చరావు తెలిపారు. ఈ మేరకు కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పదవ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, బిటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాలలోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులు అని తెలిపారు.
*వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎంపీ
*ఆలమూరు: విద్యార్థిని మిస్సింగ్.. కేసు నమోదు
*తొండంగి: భర్త అనుమానస్పద మృతి.. భార్య, ప్రియుడు అరెస్టు
*రాజమండ్రి: జాబ్ మేళాలో 17 మందికి ఉద్యోగాలు
*పిఠాపురం: రైస్ మిల్లులో ప్రమాదం.. వ్యక్తి మృతి
*రేపటి నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం: మంత్రి దుర్గేశ్
*దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
*పిఠాపురం: పట్టుబడిన 265 కిలోల జంతువుల కొవ్వు
కాకినాడ జిల్లా తొండంగి మండలం AV నగరానికి చెందిన మధు(38) అనుమానాస్పద మృతి కేసులో శిరీష, ఆమె ప్రియుడు ప్రశాంత్ను ఎస్సై జగన్మోహన్రావు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. శిరీషకు10 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి కుమార్తె ఉంది. శిరీష ఆమె ప్రియుడు కలిసి మధును హత్య చేశారని చెప్పారు. గత శుక్రవారం మధు అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించి అంత్యక్రియలు జరిపారు. దీనిపై అనుమానాలు రావడంతో ఇద్దరిని అరెస్టు చేశారు.
పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూ.గో.జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒకరోజు టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశామని మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం తెలిపారు. రేపటినుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద శనివారం ఉదయం 6 గంటలకు బస్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. పెద్దవాళ్లకు రూ.1000, చిన్నారులకు రూ.800 ఛార్జ్ ఉంటుందన్నారు.
క్యాన్సర్ను ముందుగా గుర్తించడం, నివారించడం, చికిత్స చేయడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నవంబర్ 7న క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
కాకినాడ యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యు.కొత్తపల్లికి చెందిన ప్రియుడు ఉమామహేశ్వరరావు ఆన్ లైన్ పేమెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రేమ పేరుతో మోసం చేసి వేరొకరిని నిశ్చితార్థం చేసుకోగా.. విషయం తెలుసుకున్న ప్రియురాలు తనని పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించింది. యువతిని అడ్డుతొలగించుకోవాలని విషం ఎక్కడ దొరుకుతుందో సలహా ఇచ్చి, రూ.270 ఫోన్ పే చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
కిర్లంపూడి మండలం జగపతినగరం కొత్తపేటకు చెందిన శ్రీనివాస్ గురువారం ఉదయం టీవీ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై కిర్లంపూడి హెడ్ కానిస్టేబుల్ ఏవీఎస్ మూర్తి కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.