India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సారా అమ్మకాలు, బెల్ట్ షాప్లు, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తూ.గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిర్మూలనకు తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారిన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఈ సందర్భంగా చెప్పారు. తాళ్లపూడి పోలీస్ స్టేషన్ను సందర్శించిన అనంతరం మాట్లాడారు.
మధ్యప్రదేశ్లో కలెక్టర్గా పనిచేస్తున్న ఉమ్మడి తూ.గో.(D) కొత్తపేట మండలం బిళ్లకుర్రు తరేట్లవారి పేటకు చెందిన తరేట్ల ప్రతీక్ రావు వివాహ రిసెప్షన్ స్వగ్రామంలో ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తరేట్ల ప్రతీక్ మధ్యప్రదేశ్లోని సాట్నా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. అదే రాష్ట్రంలో హిటార్షి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న అనీషాతో ఇటీవల వివాహమైంది. స్వగ్రామంలో మంగళవారం రిసెప్షన్ ఘనంగా చేసుకున్నారు.
తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాలులో అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లు పరిశీలన చేశామన్నారు. ఆరుగురు అభ్యర్థులు వేసిన నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.
రాజమండ్రిలో జరుగుతున్న భూ మాఫియాపై విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్కు లేఖ అందచేశారు. రాజమండ్రి భాస్కర్ నగర్లో 38 ఎకరాలలో ని ప్లాట్లు భూమాఫియా చేతిలోకి వెళ్లాయని, దీనిలో వైసీపీ హస్తం ఉందన్నారు. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.
పెద్దాపురం నియోజకవర్గంలోని ఏలేరు కాలువ అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో MLA చిన్నరాజప్ప మాట్లాడారు. ఇటీవల వరదల కారణంగా డ్యామ్ కొట్టుకుపోయిందని, సీఎం పరిశీలించి నిధులు కేటాయిస్తామని చెప్పారని సభలో గుర్తు చేశారు. త్వరగా టెండర్లను పిలిపించి పనులు పూర్తి చేయాలని క్తుప్లంగా వివరించారు. దీంతో తక్కువ సమయంలో సమస్యను చక్కగా వివరించారంటూ చినరాజప్పకు Dy. స్పీకర్ RRR కితాబు ఇచ్చారు.
రంపచోడవరం : AP సార్వాత్రిక విద్యాపీఠము ( APOSS ) ద్వారా 2024-25 విద్యాసంవత్సరానికి తాత్కాల్ ప్రవేశం పొందేందుకు DEO బ్రహ్మాజీరావు సోమవారం షెడ్యూల్ను ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. పది, ఇంటర్మీడియట్ లో చేరాలనుకునేవారికి ఇది మరో అవకాశం అన్నారు. www.apopenschool.ap.gov.in లో లాగిన్ అయ్యి ₹600 లేట్ ఫీజుతో నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ చూడాలన్నారు.
రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యాథవిథిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.
*రాజమండ్రిలో జీబ్రా మూవీ యూనిట్ సందడి
*గొల్లప్రోలు: చెక్కులు అందించిన నాగబాబు
*అమలాపురంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
*రాజోలులో ఉద్రిక్తత.. న్యాయం చేయాలని నిరసన
*రాజమండ్రిలో సందడి చేసిన కమెడియన్ భద్రం
*తొండంగి సముద్రతీరంలో ఆసియా ఖండ పక్షి
*కాకినాడలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
*రాజవొమ్మంగి: పొలంలో రైతులపై నక్క దాడి
*అమలాపురం: కేంద్రమంత్రిని కలిసిన బీజేపీ మహిళా నేతలు
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో తుని- అన్నవరం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతాల మధ్య 787 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాంతం జిల్లాలోని అందరికీ అనుకూలంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది.
చాగల్లుకు చెందిన బాలిక(14)పై వరుసకు మేనమామ అయిన కమల్(22) అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం..బాలిక సమిశ్రగూడెం ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లో చదువుకుంటోంది. ఆధార్లో మార్పులు చేయడానికి తాడేపల్లిగూడెం వాసి కమల్ను బాలిక అమ్మమ్మ పంపింది. అతను తీసుకొచ్చి అత్యాచారం చేసి వాళ్ల ఇంట్లో అప్పగించాడు. బాలిక ఇంట్లో విషయం చెప్పగా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Sorry, no posts matched your criteria.