India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వికాస ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాకు 188 అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా వికాస మేనేజర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన 48 మంది అభ్యర్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వికాస అధికారులు పాల్గొన్నారు.
* తూ.గో: మహేశ్ బాబు భక్తులం పేరిట వైరల్ వీడియో
* లంకల గన్నవరంలో వృద్ధురాలిపై అత్యాచారం
* తూ.గో: వైఎస్ షర్మిల పర్యటన
* ఫ్లైఓవర్ బ్రిడ్జికి లైట్లు వేయకుంటే ధర్నా చేస్తా : మార్గాని భరత్
* తాళ్లరేవు: ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించిన ఎంపీ
* రంపచోడవరం: ‘ఏజెన్సీలో జలపాతల వద్దకు రావద్దు’
* వాగ్ధానాల అమలులో కూటమి వైఫల్యం: మాజీ మంత్రి గొల్లపల్లి
* కడియం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన కాకినాడ సిటీ నియోజకవర్గ NDA కూటమి విస్తృతి స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాయలసీమ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఓటరు నమోదు తదితర అంశాలపై చర్చించారు.
తూ.గో జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన తేదీ ఖరారైంది. ఈనెల 26 కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాలలోని కాంగ్రెస్ నేతలతో సమావేశమవ్వనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పార్టీ పటిష్ఠత గురించి నేతలతో చర్చించనున్నారు.
కాకినాడ యువతి సూసైడ్ చేసుకోగా..ఆమె ఫోన్లోని వాట్సాప్ చాట్ కీలకంగా మారింది. యు.కొత్తపల్లి వాసి ఉమామహేశ్వరరావు ప్రేమపేరిట మోసం చేసి మరొకరితో నిశ్చితార్థం చేసుకున్నాడు. యువతి ప్రశ్నించగా..అడ్డురావొద్దని చెప్పాడు. ఆమె చనిపోవాలని పురుగుల మందు కొనుక్కొనేందుకు వెళ్లగా ఆన్లైన్ పేమెంట్ చేశాడు. యువతి మరణించిన 3 రోజులకు వాట్సాప్ చాట్ బయటపడింది. తండ్రి ఫిర్యాదుతో సర్పవరం పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.
దానా తుఫాను నేపథ్యంలో తూ.గో. జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 30రైళ్లకు పైగా రద్దు కాగా, ఈ నెల 25వరకు వాటిని పునరుద్ధరించే అవకాశం లేనట్లు కన్పిస్తోంది. దీంతో సికింద్రాబాద్, వైజాగ్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలు స్టేషన్లలో అధికారులు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.* రాజమండ్రి: 0883- 2420541* నిడదవోలు: 08813- 223325* సామర్లకోట: 088-42327010
తూ.గో.జిల్లాలో డ్రంక్& డ్రైవ్ కేసుల్లో 22 మందికి జరిమానా విధించగా, ఒకరికి జైలు శిక్ష పడింది. జూనియర్ డివిజన్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ముగ్గురికి రూ.10 వేలు, 18 మందికి రూ.5 వేలు, ఒకరికి 2 వేలు చొప్పున జరిమానా విధించారు. గరగా శ్రీనివాసరావు అనే వ్యక్తికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
* కొత్తపేట: దుర్గాప్రసాద్ హత్యకేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ
* కాకినాడ: ప్రేమించి మోసం చేశాడని సూసైడ్
* ఆలమూరు: ఉరేసుకుని విద్యార్థిని మృతి.. కేసు నమోదు
* జిల్లాలో ఉచిత డీఎస్సీ శిక్షణకు చర్యలు
* రౌడీషీటర్లను పోషించేది మంత్రి సుభాషే: పిల్లి సూర్యప్రకాశ్
* కాకినాడలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం
* రాష్ట్ర టిడ్కో ఛైర్మన్ను కలిసిన ఎమ్మెల్యే నానాజీ
* గోకవరం: పలు గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 48 గంటల్లోగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని తూ.గో జిల్లా జేసీ ఎస్.చిన్న రాముడు తెలిపారు. నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వద్ద 16.40 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్టోబరు 21న సేకరించామన్నారు. బుధవారం రైతు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.