India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబాజీపేటకు చెందిన రామసుబ్రహ్మణ్యం, నాగమణి దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ‘ఇంతవరకు మాకు చేసిన సేవలు చాలు, మీరైనా సుఖపడండి’అని లేఖలో పేర్కొన్నారు. పదేళ్ల క్రితం కొడుకు వెంకటకిరణ్, కోడలు లక్ష్మీశ్వేత, మనవరాలు, మనవడు రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వీరిని మనోవేదనకు గురిచేసింది. ప్రస్తుతం వీరి వద్ద చిన్న కుమార్తె సునీత తన బిడ్డతో ఉండగా.. ఆమె విశాఖలో ఓ వేడుకకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది.
APSRTCలో అప్రెంటీస్ షిప్నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు www.apprenticeship-india.gov.In వెబ్సైట్ ద్వారా ఈ నెల 31తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
* కాకినాడ: సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే నెహ్రూ
* రాజధానిని జగన్ సర్వనాశనం చేశారు: మాజీ ఎమ్మెల్యే వర్మ
* ముమ్మిడివరం: వ్యక్తి అనుమానాస్పద మృతి
* తూ.గో: శ్రీకాంత్ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు
* కరప: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగి
* పెద్దాపురం: కూటమి నాయకుల మధ్య వాగ్వాదం
* అంబాజీపేటలో దారుణం.. దంపతుల ఆత్మహత్య
* పిఠాపురం: ఇద్దరిని ఢీ కొట్టి బోల్తాపడ్డ రొయ్యల లారీ
వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను అమలాపురంలోని అదనపు జడ్జి ఎదుట మరికాసేపట్లో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. తమిళనాడులో రెండురోజుల క్రితం శ్రీకాంత్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని సోమవారం మీడియా సమావేశంలో విశ్వరూప్ అన్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్ధిక సేవల విభాగం వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్షా కార్యక్రమం అక్టోబరు 15 నుంచి 2025 జనవరి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె గ్రామ స్థాయి జన సురక్షా కార్యక్రమం గోడప్రతికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఇకపై మీరు రాత్రిపూట కాలేజీకి వెళ్లి ఎంచక్కా చదువుకోవచ్చు. పది, ఐటీఐ వరకే చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేయవచ్చు. వీరికి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లాస్లు నిర్వహిస్తారు. ఆదివారం పూర్తిగా తరగతులు ఉంటాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో మెకానికల్, కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 26 నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు.
గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో ఒక లారీపై 34 మంది ప్రయాణిస్తూ అందులో 16 మంది మరణించడంతో అజాగ్రత్తగా నడపిన లారీ డ్రైవర్కి అప్పటి గండేపల్లి ఎస్సై రజనీ కుమార్ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ దాఖలు వేసినట్లు ప్రస్తుత సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే సోమవారం ఆ కేసుపై పెద్దాపురం కోర్టు జడ్జి డ్రైవర్కి 12 ఏళ్లు జైలు శిక్ష, రూ.12 వేలు జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.
ఏపీ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నేడు జిల్లాలో రెండు చోట్ల స్కిల్ హబ్స్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గంటా సుధాకర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజానగరం ఎంపీడీఓ ఆఫీసులో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.
వాలంటీర్ అయినవిల్లి దుర్గాప్రసాద్ హత్యపై మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాలంటీర్ హత్యపై విశ్వరూప్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాలంటీర్ దుర్గాప్రసాద్ పినిపే శ్రీకాంత్ ప్రధాన అనుచరుడని మంత్రి వివరించారు.
YCP హింస, శిక్షార్హత సంస్కృతిని పెంపొందించిందని, న్యాయం కంటే అధికారానికి ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘దుర్గాప్రసాద్ దళిత నాయకుడు. అతనికి పెరుగుతున్న ప్రజాదరణతో మంత్రి విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్తో అభద్రతాభావం ఏర్పడింది. దుర్గాప్రసాద్ను హత్య చేసినట్లు ఆరోపణలు రాగా దీనిపై విచారణ సక్రమంగా జరగలేదు. ఎన్డీయేపై నమ్మకంతో బాధితుడి కుటుంబం ఫిర్యాదు చేసింది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.