EastGodavari

News June 21, 2024

తూ.గో.: నకిలీ నోట్లు.. ఇద్దరు అరెస్ట్

image

నకిలీ నోట్ల చలామణి కేసులో కాకినాడకు చెందిన సింగంశెట్టి సత్య ఫణికుమార్, రాజమండ్రికి చెందిన వంశీకృష్ణతో పాటు పలువురిని అరెస్టు చేశామని తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ సీఐ రాయల వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉమ్మడి తూ.గో. జిల్లాకు చెందిన ఇద్దరితో ముఠాగా ఏర్పడి రాజమహేంద్రవరం కేంద్రంగా కొంతకాలంగా నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారన్నారు.

News June 21, 2024

ప్రశంసా పత్రం అందుకున్న పవన్ కుమార్

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో అందించిన విశేష సేవలకు గాను ఆత్రేయపురం మండల తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఎం.పవన్ కుమార్ ప్రభుత్వం నుంచి ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ మేరకు అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రెవెన్యూ దినోత్సవ వేడుకలలో ఆయన కలెక్టర్ హిమాన్సు శుక్లా చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆయనను మండలాధికారుల అభినందించారు.

News June 20, 2024

కార్మికుడిలా పని చేస్తా-మంత్రి సుభాష్

image

కార్మికులకు అందుబాటులో ఉంటూ అన్ని శాఖలను సమన్వయ పరచి ఒక కార్మికుడిలా పనిచేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం పండితుల వేదశ్వీరచనల మధ్య తొలిసారిగా తన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికులకు ఉపయోగపడే 13 చట్టాలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

News June 20, 2024

బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలి: DEO

image

5 నుంచి15 సంవత్సరాల పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని అల్లూరి జిల్లా DEO బ్రహ్మాజీరావు అధికారులను, హెచ్‌‌ఎం‌లను ఆదేశించారు. రంపచోడవరంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఉపాధ్యాయుడు, విద్యార్థుల హాజరు నిర్ణీత సమయంలో వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 20, 2024

అడ్డతీగల : బియ్యం పంపిణీ వ్యాన్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

అడ్డతీగల మండలం వెదురునగరం వద్ద గురువారం రేషన్ బియ్యం పంపిణీ వ్యాన్ బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. వై.రామవరం నుంచి గంగవరం వెళుతుండగా అదుపు తప్పి రోడ్డు ప్రక్కన తాటి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా.. రాజమండ్రి ఆసుపత్రికి తరలిస్తుండగా డ్రైవర్ మృతి చెందాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News June 20, 2024

కాకినాడలో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

కాకినాడలోని జిల్లా వికాస కార్యాలయంలో శుక్రవారం జెన్పాక్ట్ కంపెనీలో ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 28 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ ఇంటర్వ్యూల కోసం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని శుక్రవారం ఉదయం 9 గంటలలోపు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

News June 20, 2024

కొత్తపేటలో జాబ్ మేళా

image

కొత్తపేట విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పెద్దిరాజు తెలిపారు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐటెక్ సాఫ్ట్వేర్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. మొత్తం ఖాళీలు 316 ఉన్నాయన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 20, 2024

కాకినాడ: జాతీయ రహదారిపై ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు

image

కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లోని జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల సంఖ్య భారీగా పెరగటం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ మూడు మండలాల్లో జనవరి నుంచి ఇంత వరకు 39 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 17 మంది మృత్యువాత పడ్డారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు అతివేగం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు అధికారుల అలసత్వం కూడా ఒక కారణమని చెబుతున్నారు.

News June 20, 2024

రాజమండ్రి: అష్టాచమ్మ ఆటలో తలెత్తిన వివాదం.. దారుణ హత్య

image

రాజమండ్రి రూరల్ లో దారుణం చోటుచేసుకుంది. మార్గాని నాగేశ్వరరావును స్నేహితులు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు .అష్టాచమ్మ ఆటలో తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా సమాచారం. హత్య చేసిన వీరబాబు, రమణ పరారీలో ఉన్నారని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 20, 2024

తూ.గో: రేషన్ కార్డుదారులకు శుభవార్త

image

పేదలకోసం సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. జులై 1నుంచి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు కందిపప్పు, పంచదార, బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరిలో కలిపి 50,06,194మందికి లబ్ధి చేకూరనుందని పౌర సరఫరాల శాఖ డీఎస్ వో విజయభాస్కర్ తెలిపారు.