India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమహేంద్రవరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలను పోలీసు అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అడ్డతీగల మండలంలోని తిమ్మాపురం వద్ద ఏలేరు కాలువలో ఈ ఏడాది ఆగస్టు 17న ఓ మహిళ మృతదేహానికి చెందిన శరీర భాగల ఆధారంగా ఆమె నమూనా చిత్రాన్ని పోలీసులు ఆదివారం మీడియాకు విడుదల చేశారు. మరణించిన మహిళ వయస్సు 25-30 సంవత్సరాల ఉండవచ్చని తెలిపారు. ఊహా చిత్రంలోని పోలికలు ఉన్న మహిళ వివరాలు సెల్ నంబర్ 99590 66999కు తెలపాలని కోరారు.
రేపటి నుంచి ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్ల గురించి ఆయన మంత్రితో చర్చించి వివరాలు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
* తూ.గో: పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
* తూ.గో. 21 మంది ఎస్ఐలు బదిలీ
* శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: డిప్యూటీ కమిషనర్
* రాజమండ్రి: రేపు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం
* సామర్లకోటలో వైరల్ ఫీవర్తో బాలిక మృతి
* ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి: యనమల
* సామర్లకోటలో విద్యుత్ షాక్తో తల్లీకొడుకు మృతి
* పిఠాపురం: ‘రూ.10కోట్లతో అభివృద్ధి పనులు’
రెండేళ్ల క్రితం అమలాపురంకి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిన ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే వారి కులాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోలేదు. ఈ సమస్యను ఎమ్మార్పీఎస్ నాయకులు పరిష్కరించారు. కె.గంగవరం మండలం పాణింగపల్లికి చెందిన లంక గంగమ్మ (31) ఎస్సీ, కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వేములపూడి ప్రసాద్ (32) లకు శనివారం మండపేటలో వివాహం జరిపించారు.
కాట్రేనికోన (మం) జిల్లెల్లవారి పేటకు చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఏసుబాబు లైంగిక దాడికి పాల్పడ్డాడని కాట్రేనికోన ఎస్సై అవినాశ్ శనివారం తెలిపారు. ఈ నెల 11వ తేదీ రాత్రి బాలిక మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన సమయంలో లైంగిక దాడికి పాల్పడగా బాలిక పారిపోయిందన్నారు. తర్వాత రోజు రాత్రి కూడా ఇంటికి వచ్చి తలుపులు తట్టాడన్నారు. తల్లి హైదరాబాదులో ఉంటుందని, తండ్రి ఫిర్యాదుపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరడంతో తూ.గో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల వేళ పవన్కు జైకొట్టిన ఆమె ఇవాళ జనసేన కండువా కప్పుకున్నారు. తన కుటుంబాన్ని విడదీసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ముద్రగడ ఆరోపించగా.. తాజాగా క్రాంతి చేరికపై ఆయన ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు క్రాంతికి కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్..
పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 23 లేదా 25 న యాత్రను ప్రారంభించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే యాత్రకు వెళ్లే బోట్లకు ఫిట్నెస్, లైసెన్సులు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని బోటు యాజమాన్యాలకు దేవీపట్నం తహశీల్దార్ కే. సత్యనారాయణ, ఎస్సై షరీఫ్ సూచించారు.
వైసీపీ తూ.గో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మాజీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో భాగంగా తూ.గో జిల్లాకు బొత్సను నియమిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇసుక సరఫరాలో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని, సచివాలయం వద్ద ఆన్లైన్ ద్వారా టోకెన్ జారీ చేయాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. శుక్రవారం రాజమండ్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక బుకింగ్ విధానం నుంచి రవాణా వ్యవస్థ వరకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.