EastGodavari

News October 19, 2024

తూ.గో. TODAY HEADLINES

image

* 172 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు: SP నరసింహ
* అభ్యంతరాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్
* ఉప్పలగుప్తంలో 115 ఏళ్ల వృద్ధురాలు మృతి
* హైదరాబాద్‌లో ముగ్గురు జిల్లా యువకులు అరెస్ట్
* తుని: 18 మంది పోలీసుల బదిలీ
* వైఎస్ జగన్‌ని కలిసిన పిల్లి సూర్యప్రకాష్
* కాకినాడలో ఏడుగురికి జైలు శిక్ష
* అంబాజీపేట: ప్రత్యేక ఆకర్షణగా మహిళల నృత్యాలు
* బిక్కవోలులో భారీ వర్షం

News October 18, 2024

172 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ నరసింహ

image

తూ.గో.జిల్లాలో ఈ నెలలో ఇప్పటివరకు 172 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ శుక్రవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, ఓపెన్ డ్రింకింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 20మందిని ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 18 మందికి రూ.5 వేలు, ఇద్దరికీ రూ.1500 వంతున జరిమానా విధించారన్నారు.

News October 18, 2024

తూ.గో: టీడీపీ సమీక్ష సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి జిల్లా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ, జిల్లా ముఖ్యనేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వివిధ రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు.

News October 18, 2024

తూ.గో: హైదరాబాద్‌లో ముగ్గురు యువకులు అరెస్ట్

image

హైదరాబాద్‌లో సాఫ్టవేర్ ఉద్యోగులు చేస్తున్న తూ.గో జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తూ గురువారం పోలీసులకు చిక్కారు. కేపీహెచ్‌బీలోని పలువురు యువకులు గంజాయి పొట్లాలతో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆలమూరు మండలానికి చెందిన తోరటి రాజేశ్(24), కొత్తపల్లి మండలానికి చెందిన నక్కా నాగవంశీ (23), రాజమండ్రికి చెందిన తంగెళ్ల రమేశ్‌గా గుర్తించారు.

News October 18, 2024

రాజమండ్రిలో 19న జాబ్ మేళా

image

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో 19న ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాజమహేంద్రవరంలో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలకు SSC, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.

News October 17, 2024

తూ.గో జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

image

అల్పపీడన ప్రభావం కారణంగా ఉమ్మడి తూ.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగులు పడే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని కోనసీమ, తుని, రంపచోడవరం, మారేడుమిల్లి, జగ్గంపేట, ఏలేశ్వరం, పెద్దాపురం,సామర్లకోట, సముద్ర తీర ప్రాంతాల్లో అవకాశం ఉందన్నారు. ఆ ప్రాంతాలతో పాటు కోరుకొండ, రాజానగరం, రాజమండ్రి రూరల్‌లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. 

News October 17, 2024

మార్గాని భ‌ర‌త్ అండ‌తో దాడి చేశారు: మంత్రి లోకేశ్

image

జ‌గ‌న్‌ని ఆద‌ర్శంగా తీసుకొని వైసీపీ నేత‌లు రెచ్చిపోతున్నారని, అధికారం పోయినా అరాచ‌కాలు మాత్రం త‌గ్గట్లేదని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘జ‌గ‌న్ పాల‌న‌లో నేరాలకు అల‌వాటైన పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ అండ‌తో ఈవెంట్ యాంక‌ర్ కావ్య, ఆమె కుటుంబ‌ స‌భ్యుల‌పై వైసీపీ గుండాలు దాడి చేశారు. మహిళపై దాడి చేసిన గ్యాంగ్‌పై చర్యలు తప్పవు’ అని ఎక్స్‌‌ వేదికగా లోకేశ్ హెచ్చరించారు.

News October 17, 2024

కోనసీమ: సీఎం హామీ.. ‘పల్లాలమ్మ’ ఆలయ అభివృద్ధికి కార్యాచరణ

image

కొత్తపేట వానపల్లి పల్లాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీ మేరకు నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైనట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఇంజినీర్లతో ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలు అంచనాలపై ఆయన సమీక్షించారు. వానపల్లి గ్రామస్థులు కోరిన విధంగా అవసరాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

News October 17, 2024

తూ.గో.: TODAY TOP NEWS

image

* రంపచోడవరం: ‘పులి తిరిగేది ఆ ప్రదేశాల్లోనే.. జాగ్రత్త’
* రాజమండ్రిలో బంగారం దొంగతనం
* కాకినాడలో 13 మందికి జైలు
* కొవ్వూరులో షేర్ యాప్ పేరిట భారీ మోసం
* తుని రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
* కొత్తపేటలో బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్
* కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు
* జగ్గంపేట: మందుబాబులకు నిరాశే..!
* అయినవిల్లి: మద్యం షాపులు వద్దంటూ ఆందోళన
*అల్లవరంలో ఎగసిపడుతున్న సముద్రపు అలలు

News October 16, 2024

ఇసుక సరఫరాను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఇసుకను వినియోగదారులకు ఆఫ్‌లైన్ బుధవారం నుంచి ప్రారంభించినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చిన్న రాముడుతో కలిసి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ కోసం, ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎటువంటి ఆటంకం లేకుండా ఇసుక సరఫరా విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు.