EastGodavari

News June 18, 2024

పిఠాపురంలో హత్య..UPDATE

image

పిఠాపురం మండలం భోగాపురంలో ఈ నెల 14న బొమ్మ దేవప్రసాద్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నాగులపల్లి పద్మరాజును అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్, SI గుణశేఖర్ తెలిపారు. మృతుని సోదరుడు శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హత్య కేసును విచారించామన్నారు. మృతుడు ప్రసాద్, నిందితుడు పద్మరాజు కలిసి తాపీ పని చేశారన్నారు. కూలి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో ప్రసాద్‌ను కొట్టి చంపేశారన్నారు.

News June 18, 2024

తూ.గో.: పెళ్లి చేస్తానని.. రూ.40లక్షలు స్వాహా

image

ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారానికి చెందిన దుర్గారావు దివ్యాంగుడు. గ్రామానికి చెందిన ఓ యువకుడికి పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి..ఓ అమ్మాయి ఫొటో చూపించాడు. 4ఎకరాల భూమి ఉందని, తనకు తెలిసిన అమ్మాయి నంబర్ ఇచ్చి రోజూ మాట్లాడించాడు. ఆ తర్వాత అమ్మాయికి ఆర్థిక సమస్యలున్నాయని రూ.40 లక్షల వరకు వసూలుచేశాడు. ఎన్నిరోజులైనా పెళ్లి ప్రస్తావన లేకపోగా మోసం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.

News June 18, 2024

తూ.గో జిల్లాలో 98,550 మందికి లబ్ధి: కలెక్టర్

image

‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదల చేయనున్నారని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 98,550 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేల చొప్పున మొత్తం రూ.19.71 కోట్లు జమ కానున్నట్లు తెలియజేశారు.

News June 17, 2024

రంపచోడవరం: గుండె పోటుతో ఉద్యోగి మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఓ సంస్థ డివిజనల్ మేనేజర్‌గా పని చేస్తున్న చింతా మధు(52) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడని సంస్థ సిబ్బంది తెలిపారు. విశాఖలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లోనే కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News June 17, 2024

వాడపల్లిలో పంట పొలంలోకి దూసుకెళ్లిన కారు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఓ కారు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా లొల్ల-వాడపల్లి కొత్త రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కారులోని ప్రయాణికులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సహాయంతో కారును పంట పొలంలోంచి బయటకు తీశారు.

News June 17, 2024

కోనసీమ జిల్లాలో రామోజీరావు విగ్రహం తయారీ

image

కొత్తపేట శిల్పి రాజ్‌కుమార్ వుడయార్ ‘ఈనాడు’ అధినేత రామోజీరావు విగ్రహాన్ని తయారు చేశారు. విజయనగరం MP అప్పలనాయుడు దీన్ని తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. 7.5 అడుగుల ఎత్తుతో 4 రోజుల్లోనే తయారు చేశానని, 25 విగ్రహాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈనాడు’ ప్రస్థానం ప్రారంభమైన విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎంపీ తెలిపారు. మీడియా రంగం నుంచి ప్రతిష్ఠించే తొలి విగ్రహం రామోజీరావుదే కావడం గమనార్హం.

News June 17, 2024

మాజీ మంత్రి వేణుగోపాల్‌పై మంత్రి సుభాశ్ ఆరోపణలు

image

మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాజీ మంత్రి వేణుగోపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ద్రాక్షారామలో నేడు ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటికి సంబంధించి తమ వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని అన్నారు. అవినీతి, అక్రమాలను తర్వలోనే బయటకు తీసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News June 17, 2024

తూ.గో: అమ్మలకు తప్పని కడుపు కోతలు

image

నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనబడట్లేదు. తూ.గో జిల్లాలో 100 ప్రసవాల్లో 70 సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
➤ 2023-24లో మొత్తం 23,673 ప్రసవాల్లో 11,944 ఆపరేషన్లే. మాతృమరణాలు-14
☞ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,269 మంది ప్రసవిస్తే.. 3,527 మందికి సిజేరియన్లే
☞ ప్రైవేట్‌లో 16,404 ప్రసవాలు జరిగితే.. 8,417 మందికి కడుపు కోతే.

News June 17, 2024

కోనసీమ: దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లి పల్లెపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ సంఘటనపై బాలిక తండ్రి 16వ తేదీ (ఆదివారం) రాత్రి ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సంపత్ కుమార్ తెలిపారు.

News June 17, 2024

పవన్‌కు కేటాయించిన శాఖలతో పిఠాపురంలో అభివృద్ధి

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో TDP నాయకులు, కార్యకర్తలను ఆదివారం సాయంత్రం మాజీ MLA SVSN వర్మ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌కు కేటాయించిన శాఖలు రాష్ట్రం, పిఠాపురం అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఉప్పాడ, చేబ్రోలులో అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.