India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తపేట మండలంలోని అవిడి పెదపేటకు చెందిన కృష్ణబాబు (22) కి 15 రోజులు రిమాండ్ విధించినట్లు DSP వై. గోవిందరావు తెలిపారు. వారి కథనం.. ఓ బాలిక(17)ను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడు. విషయాన్ని బాలిక కుటుంబీకులకు చెప్పడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. DSP విచారణ జరిపి పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.
కూనవరం అటవీ క్షేత్ర పరిధిలోని దూగుట్ట, చింతూరు మండలం ఏడుగురాళ్ల పంచాయతీ పరిధిలోని తాటిలంక గ్రామ సమీపంలో పెద్దపులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు మంగళవారం గుర్తించారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పశువులు ప్రమాదానికి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చింతూరు DFO బబిత పరిస్థితిని అటవీ అధికారులతో సమీక్షస్తున్నారు.
తనపై నమ్మకం ఉంచి కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి లోకేశ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనపై పెట్టిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏవైనా కరెంట్ సమస్యలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.
➤రాజమండ్రి సర్కిల్-7382299960
➤కాకినాడ డివిజన్-9493178718
➤పెద్దాపురం డివిజన్-9493178728
➤అమలాపురం డివిజన్-9440904477
➤రామచంద్రపురం డివిజన్-9493178821
మండలంలోని సున్నంపాడు పంచాయతీ పరిధిలోని నూరుపూడికి చెందిన కె.తమ్మిరెడ్డికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రహదారి సరిగ్గా లేకపోవడం, మార్గమధ్యలో పెద్ద కొండ కాలువ ఉండడంతో అంబులెన్స్ రావడానికి అవకాశం లేకపోయింది. దీనితో గ్రామస్థులు తమ్మిరెడ్డిని డోలీ ద్వారా పరుగు పరుగున 8 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే సున్నంపాడు వద్ద మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.
అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించాల్సి ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్యం షాపుల లైసెన్సుల లాటరీ ప్రక్రియ నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని డివిజన్, మండల స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది తెలిపారు.
తూ.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు సోమవారం పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, రావులపాలెం, కోనసీమ, తుని, మారేడుమిల్లి, రంపచోడవరం, పెద్దాపురం, సామర్లకోట కోరుకొండ, రాజమండ్రి రూరల్ పరిధిలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నివారణ సంస్థ ప్రజల చరవాణిలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
ఆత్రేయపురం మండలంలో ఈ నెల 11న ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికను రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక అమ్మమ్మకు చెప్పింది. ఈ నెల 12వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం శివను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రాము తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.