EastGodavari

News October 13, 2024

తూ.గో జిల్లా వ్యాప్తంగా 253 గ్రామాలలో పంచాయతీ వారోత్సవాలు

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 253 గ్రామ పంచాయతీలలో పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ నుంచి ఆమె ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంచాయతీ వారోత్సవాలు జరుగుతాయని ఆమె తెలిపారు.

News October 13, 2024

రంప: పర్యాటక ప్రాంతాలు మూసివేత

image

ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు ముసివేస్తున్నామని ITDA PO కట్టా సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండ వాగులు, కాలువలు, జలపాతాలు పొంగి ప్రవహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో పర్యాటకులు ఏజెన్సీకి రావద్దని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.

News October 13, 2024

అడ్డతీగల: వెల్లుల్లి ధర అదరహో

image

ఏజెన్సీ ప్రాంతం అయిన అడ్డతీగల పరిసర గ్రామాల్లో వెల్లుల్లి ధర గణనీయంగా పెరిగింది. నాణ్యమైనవి పెద్దవి 15రోజుల క్రితం కిలో రూ.300 పలుకగా నేడు రూ.400కి పెరిగింది. పంట తగ్గడంతో గిరాకీ పెరిగి రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి రాజమండ్రి నుంచి వీటిని వ్యాపారులు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతారు. కూరగాయలు రేటు కూడా పెరగడం వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

News October 13, 2024

కోనసీమ: డీజే సౌండ్‌కు యువకుడి మృతి

image

కోనసీమ జిల్లాలో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురం మండలం కొంకాపల్లిలో శనివారం రాత్రి డీజే సౌండ్‌కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో డీజే సౌండ్‌కు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వినయ్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

News October 13, 2024

అమలాపురం: ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎంపికపై సర్వే

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేపట్టారు. అమలాపురం టీడీపీ యువ నాయకుడు చెరుకూరి సాయిరామ్, ముమ్మిడివరానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం టీడీపీ సీనియర్ నాయకుడు రమణబాబు, వాసంశెట్టి వెంకట సత్య ప్రభాకర్‌, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

News October 12, 2024

కాకినాడ జిల్లాలో రావణ దేవాలయాన్ని చూశారా..!

image

లంకాధిపతి రావణాసురుడి దేవాలయం మన కాకినాడ రూరల్ సాగర తీరాన ఉంది. దసరా వేళ పలు ప్రాంతాల్లో రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో రావణాసురుని పూజించటం మరో విశేషం. దీన్ని కుంభాభిషేకం గుడి అని కూడా పిలుస్తారు. ఆయన ఆది కుంభేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటారు.

News October 12, 2024

రాజమండ్రి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల

image

రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

News October 11, 2024

రాజమండ్రి: ప్రజలకు దశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంట అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ దసరా వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.

News October 11, 2024

రంప: ఆకట్టుకుంటున్న పెద్ద పుట్టగొడుగు

image

రంపచోడవరం నియోజకవర్గం విఆర్‌పురం మండలం ఉమ్మిడివరం గ్రామంలో భారీ పుట్టగొడుగు ఆకట్టుకుంటుంది. సాధారణంగా పుట్ట గొడుగు 2 నుంచి 4 అంగుళాలు ఎత్తుకు ఎదిగింది. ఈ పుట్ట గొడుగు 2 అడుగులు ఎత్తు, 3 అడుగుల వెడల్పు గులాబీ రంగులో, ఎరుపు మచ్చలతో ఆకర్షనీయంగా ఉంది. స్థానికులు పుట్ట గొడుగుని ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ భారీ పుట్ట గొడుగు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News October 11, 2024

తూ.గో: పిడుగులు పడే ప్రమాదం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పిడుగుల ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ రూరల్, తుని, కోనసీమ, పెద్దాపురం, సామర్లకోట, రంపచోడవరం, మారేడుమిల్లి, రాజానగరం రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో పిడుగులు ప్రమాదం ఉందని ఫోన్‌లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.