EastGodavari

News June 17, 2024

తూ.గో.: ALERT.. నేడు, రేపు పిడుగులతో వర్షం

image

ద్రోణి ప్రభావంతో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ ఆదివారం తెలిపారు. కాగా నేడు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో, రేపు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 16, 2024

తూ.గో.: నాన్నే నా హీరో: డైరెక్టర్ సుకుమార్

image

నాన్నే తన హీరో అని అంటున్నారు మలికిపురం మండలం మట్టపర్రుకు చెందిన సినీ దర్శకుడు సుకుమార్. గ్రామానికి చెందిన బండ్రెడ్డి తిరుపతి రావునాయుడికి సుకుమార్‌తో పాటు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఆయన జ్ఞాపకార్థం తోబుట్టువులతో వారు రూ.15లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి భవనం నిర్మించారు. తండ్రి బాధ్యతే పిల్లలను మంచివైపు నడిపిస్తుందని ఓ మూవీ విడుదల సందర్భంగా చెప్పారు.
☛ నేడు FATHERS డే

News June 16, 2024

ఎమ్మెల్యే గోరంట్ల ఇంటికి మంత్రి కందుల దుర్గేశ్

image

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వారి నివాసంలో మంత్రి కందుల దుర్గేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దుర్గేశ్‌ను గోరంట్ల సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పదవి వచ్చినందుకు గోరంట్ల ఆయనకు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం గోరంట్లను దుర్గేశ్ శాలువాతో సత్కరించారు.

News June 16, 2024

కొమ్మనాపల్లిలో మరో 28 మందికి డయేరియా

image

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. శనివారం మరో 28 మంది దీని బారిన పడినట్లు తెలిసింది. కాకినాడలోని జీజీహెచ్‌లో 16 మంది, తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ముగ్గురు, మిగిలిన 9 మందికి స్థానికంగా చికిత్స అందించారు. ఈ ఊరిలో 512 కుటుంబాల్లో 1881 మంది ఉన్నారు. వారిలో 60 కుటుంబాలకు చెందిన 69 మందికి వైద్యం అందుతుంది. పలువురు ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్నారు.

News June 16, 2024

పేరెంట్స్ చంపాలని చూస్తున్నారంటూ యువతి ఆవేదన

image

లవ్ మ్యారేజ్ చేసుకున్నాననే కోపంతో తల్లిదండ్రులు తనను చంపాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని రాజమండ్రికి చెందిన యువతి విజయవాడలో ఓ న్యాయవాదిని ఆశ్రయించింది. Jan 9న మైనార్టీ తీరడంతో తాము పెళ్లి చేసుకున్నామని, తల్లిదండ్రులు దీనిపై బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తనతో పాటు భర్త, అత్తమామలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ హోంశాఖ మంత్రి, డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపింది.

News June 16, 2024

ఒంటరితనంతో అన్నదమ్ముల ఆత్మహత్య.. ఇద్దరూ విద్యావంతులే

image

రాజమండ్రిలో <<13444701>>వంతెనపై నుంచి <<>>దూకి అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. సాయికృష్ణానగర్‌కు చెందిన నాగేంద్రసాయి-త్రిపురదేవీ దంపతులకు నాగాంజనేయ(42), దుర్గారావు(40) సంతానం. బీటెక్, MBA చేసిన వీరు HYD, బెంగళూరులో జాబ్స్ చేశారు. 2013లో తండ్రి చనిపోగా ఇంటికొచ్చారు. 2020లో తల్లి మృతి చెందినప్పటి నుంచి ఎవరితో మాట్లాడేవారు కాదు. ఆర్థిక ఇక్కట్లు, ఒంటరితనం, పెళ్లిళ్లు కాక సంఘర్షణలోనై శనివారం సూసైడ్ చేసుకున్నారు.

News June 16, 2024

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

image

రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6)పై ఈ నెల 11న అత్యాచారానికి పాల్పడిన చెక్కా బాలురెడ్డి(45)ని అరెస్ట్ చేసినట్లు SI అప్పలరాజు తెలిపారు. ఆరేళ్ల పాపకు పనస పండ్లు ఇస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అదే సమయంలో బాలిక తల్లిదండ్రులు రావడంతో పరారయ్యాడని, RTC కాంప్లెక్స్‌లో పట్టుబడిన బాలురెడ్డిని శనివారం అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపినట్లు తెలిపారు.

News June 16, 2024

రేపు పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు CM చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నట్లు MLA చిర్రి బాలరాజు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత CMగా ఆయన సందర్శించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 9.30 గంటలకే ఆయన పోలవరం చేరుకొని అంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడే ప్రాజెక్ట్, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 16, 2024

కోనసీమ: అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ.. నిందితులు అరెస్ట్

image

కె.గంగవరం మండలం యర్రపోతవరంలో అంబేడ్కర్ విగ్రహంపై దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు SI జానీబాషా తెలిపారు. గ్రామానికి చెందిన పిల్లి రాంబాబు, కోరుకొండ స్వామినాయుడు ఇరిగేషన్ లాకుల వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎడమ చేతికి చెప్పుల దండ వేసి వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా బోర్డు వేలాడదీశారన్నారు . విప్పర్తి సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

News June 15, 2024

కాకినాడ: హోప్ ఐలాండ్‌పై ఆశలు

image

కాకినాడ జిల్లా తాళ్లరేపు మండలం కోరింగ పంచాయతీ పరిధిలో ఉండే హోప్ ఐలాండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని 1998లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి తెచ్చారు. అయితే ఈ సుందర ప్రదేశానికి ఒకప్పుడు పర్యాటకులు పోటెత్తేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి పర్యాటక శాఖ మన నిడదవోలు MLAకే కట్టబెట్టడంతో కచ్చితంగా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.