EastGodavari

News June 14, 2024

కొత్త ప్రభుత్వానికి అభినందనలు: ఉండవల్లి

image

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ చేసిన 21 సీట్లలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక అభినందనలు అని అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్‌ను అభినందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

News June 14, 2024

రోడ్డు ప్రమాదంపై ఎంపీ పురందీశ్వరి దిగ్భ్రాంతి

image

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని సీతనపల్లి వద్ద 216వ జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్‌లో మృతుల కుటుంబాలకు బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి సంతాపం తెలిపారు. ఈ ఘటన తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని అన్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు చొరవ చూపిన స్థానికులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

News June 14, 2024

తూ.గో జడ్పీ ఛైర్మన్ విప్పర్తి సోదరుడు మృతి

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వేణుగోపాలరావు సోదరుడు విప్పర్తి రామారావు(75) గురువారం రాత్రి ధవళేశ్వరంలోని స్వగృహంలో మృతి చెందారు. రామారావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఇంటికి వెళ్లి జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావును పరామర్శించారు.

News June 14, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో 60వేల మంది రక్తదాతలు

image

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 60,000 మంది రక్తదాతలు ఆపద సమయంలో పలువురుకి అండగా నిలుస్తూ ఔదార్యం చూపుతున్నారు. నెలకు సుమారు 5000 యూనిట్ల రక్తం దానం చేస్తున్నారు. జిల్లాల వారీగా దాతలు ఇలా..
☞ కాకినాడ- 22,500 మంది
☞ తూర్పు గోదావరి- 19,000 మంది
☞ అంబేడ్కర్ కోనసీమ- 18,500 మంది
➠ ఈ మూడు జిల్లాల్లో 23 బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తం సేకరిస్తున్నారు.

News June 14, 2024

పిఠాపురం మండలంలో దారుణ హత్య

image

పిఠాపురం మండలంలో దారుణ హత్య జరిగింది. భోగాపురంలోని దుర్గమ్మ ఆలయ ఆవరణలో నిద్రించిన బ్రహ్మదేపు ప్రసాద్‌ను పద్మరాజు అనే వ్యక్తి పెద్ద బండరాయితో మోది హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పిఠాపురం రూరల్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

తూ.గో: ఘాటెక్కిన ఉల్లి ధర.. తగ్గిన దిగుమతులు

image

ఉల్లిపాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 పైన పలుకుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోజుకు 900 టన్నులు ఉల్లిపాయలను వినియోగిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు దిగుబడులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి రాజమండ్రి, రావులపాలెం, రాజోలు, మడికి, చొప్పెల్ల మార్కెట్లకు 30 లారీల్లో 600 టన్నులు మాత్రమే దిగుమతి జరుగుతోందని వారు తెలిపారు.

News June 14, 2024

పవన్‌కు లా&ఆర్డర్ కంట్రోల్ చేసే సత్తా ఉంది: వర్మ

image

జనసేన అధినేత, మంత్రి పవన్‌ కళ్యాణ్‌ను పిఠాపురం మాజీ MLA వర్మ గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మ కారుపై దాడి గురించి పవన్‌ ఆరా తీశారు. ఇలాంటివి సరికాదని విచారం వ్యక్తం చేయడంతో పాటు ఖండించినట్లు వర్మ తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే సత్తా పవన్‌కు ఉందని, ఆయన తర్వలోనే పిఠాపురంలో పర్యటిస్తారని అన్నారు.

News June 14, 2024

అంబాజీపేట: నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు

image

ధరలు లేక సతమతమవుతున్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా అంబాజీపేటలో జూలై 1వ తేదీ నుంచి నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం ఏపీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకరరావు అంబాజీపేటలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి దీనికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు.

News June 13, 2024

రాజమండ్రి: భరత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆదిరెడ్డి

image

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌‌గా మారారని, ఆయన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర మాజీ ఎంపీ మురళీ మోహన్‌, భరత్‌ హయాంలో వేసిన శిలాఫలకాలను ఆదిరెడ్డి తన సొంత డబ్బులతో గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భరత్ అభివృద్ధి పేరిట నగరంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు

News June 13, 2024

రాజానగరం: గోదావరి క్లస్టర్ యూనివర్సిటీకి యాప్షీ ప్రాజెక్ట్

image

ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వారు గోదావరి క్లస్టర్ యూనివర్సిటీకి ప్రాజెక్ట్‌ను మంజూరు చేసారని గురువారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్‌లలో ఒకరైన నన్నయ విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగ అధ్యాపకులు డా.విజయనిర్మలకు ప్రాజెక్ట్ పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ప్రాజెక్టును రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.