EastGodavari

News June 12, 2024

తూ.గో.: తాత కౌన్సిలర్‌గా.. మనవడు మంత్రిగా

image

అమలాపురం మండలం శ్రీరాంపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం MLAగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన సుభాష్ BSC ఎల్‌ఎల్‌బీ చదివారు. SAF స్వచ్ఛంద సంస్థ సేవాకార్యక్రమాల ద్వారా పట్టు సాధించారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత TDPలో చేరారు. ఈయన తాత, తండ్రి 2 సార్ల చొప్పున అమలాపురం కౌన్సిలర్లుగా పనిచేశారు.

News June 12, 2024

కందుల దుర్గేశ్ అను నేను..

image

కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దుర్గేశ్ వివిధ హోదాల్లో పనిచేసి MLC అయ్యారు. తూ.గో. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో రాజమండ్రి MPగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2016లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరి 2019లో రాజమండ్రి గ్రామీణం నుంచి MLAగా పోటీచేసి ఓటమి చెందారు. తాగా ఎన్నికల్లో నిడదవోలు నుంచి 33,304 ఓట్ల మెజారిటీతో గెలుపొంది మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు.

News June 12, 2024

తూ.గో. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 మంది MLAలలో ముగ్గురికి మంత్రి పదవి దక్కింది. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాశ్, తూ.గో. జిల్లా నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ముగ్గురూ తొలిసారి MLAలుగా గెలుపొంది మంత్రులవడం విశేషం.

News June 12, 2024

నేడే CM ప్రమాణస్వీకారం.. తూ.గో. జిల్లాలో ఏర్పాట్లు

image

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గం సైతం ఏర్పాటుకానుంది. ఈ నేపథ్యంలో సదరు కార్యక్రమాన్ని వీక్షించేలా.. ఉమ్మడి తూ.గో. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు LED స్క్రీన్లు, టీవీలను ఏర్పాటుచేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే విద్యుత్ కాంతుల నడుమ సిద్ధం చేశారు.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?

News June 11, 2024

కాకినాడలో ACCIDENT.. యువతి స్పాట్ డెడ్

image

కాకినాడ జిల్లాకేంద్రంలోని రంగరాయ మెడికల్ కళాశాల ఎదురుగా ఆనంద్ నిలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9 గంటలకు సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతిని ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 11, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పిఠాపురంలో స్క్రీన్లు

image

జూన్ 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం ప్రజలు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు చిన్నమాంబ పార్కు, ఆర్టీసీ కాంప్లెక్స్, ఏబీసీ చర్చి, RRపార్కు తదితర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రత్యేక ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

News June 11, 2024

ఈనెల 14వ తేదీన కాకినాడలో జాబ్ మేళా

image

ఈ నెల 14న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. SSC, డిప్లమా, ఐటీఐ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 4 కంపెనీల్లో పని చేసేందుకు 818 మందిని ఎంపిక చేస్తారని తెలిపారు. 18- 35 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.

News June 11, 2024

జనసేన శాసనసభ పక్ష సమావేశంలో తూ.గో ఎమ్మెల్యేలు

image

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. దీంతో సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News June 11, 2024

కిర్లంపూడిలో RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని యూనియన్ బ్యాంక్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కిర్లంపూడి నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొనగా.. సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వయసు సుమారు 40-45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News June 11, 2024

పవన్‌కి కన్ఫర్మ్.. ఇంకా ఎవరెవరికో మంత్రి పదవులు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో మంత్రి పదవి ఆశావహులు భారీగానే ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌కి దాదాపు కన్ఫర్మ్ కాగా.. జనసేన కోటాలో కందుల దుర్గేశ్‌, BJP కోటాలో నల్లమిల్లికి అమాత్య యోగం ఉన్నట్లు తెలుస్తోంది. యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేర్లు బలంగా వినిపిస్తుండగా.. బుచ్చయ్యచౌదరి, వనమాడి కొండబాబు, సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు సహా తొలిసారి ఎన్నికైన పలువురు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.