EastGodavari

News June 6, 2024

తూ.గో. జిల్లాలోనే అతితక్కువ ఓట్లు ఈ MLA అభ్యర్థికే

image

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓ స్వత్రంత్ర అభ్యర్థికి అతి తక్కవ ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాటే సుబ్రహ్మణ్యానికి 53 ఓట్లు వచ్చాయి. కాగా జిల్లాలో అత్యధికంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీకి 1,34,414 ఓట్లు వచ్చాయి.

News June 6, 2024

తూ.గో.: మంత్రి పదవి ఎవరికి..?

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ MLAలో ముగ్గురికి మంత్రి పదవి దక్కింది. రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం- పినిపే విశ్వరూప్, తుని- దాడిశెట్టి రాజా మంత్రులుగా పనిచేశారు. మరి ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ఐదుగురు, టీడీపీ నుంచి 14మంది MLAలుగా గెలిచారు. మరి ఈ సారి జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది.. ఎందరికి వస్తుంది..?
– మీ కామెంట్..?

News June 6, 2024

కాకినాడ: ప్రాణం తీసిన ఎన్నికల బెట్టింగ్

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక అప్పయ్యచెరువు ప్రాంతానికి చెందిన బిక్కిన సురేశ్ (30) ఎన్నికల్లో బెట్టింగ్ వేసిన వారికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో గెలిచిన వ్యక్తులు డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేశారు. దీంతో తండ్రి సాయిబాబుకు ఫోన్‌లో ‘డాడీ నేను తట్టుకోలేకపోతున్నాను..‘ఐ మిస్ యూ డాడీ’ అని వాయిస్ మెసేజ్ పెట్టి ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదైంది.

News June 6, 2024

అందరికీ ధన్యవాదములు: కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తవడంతో సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ మాధవీలత ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగిందన్నారు. ఇది సమష్టి కృషి అని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, పోలీసులు, భద్రత సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News June 5, 2024

తూ.గో జిల్లాలో రేపు, ఎల్లుండి వర్షాలు

image

రేపు, ఎల్లుండి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈ మేరకు APSDMA తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

News June 5, 2024

‘పిఠాపురంలో పనిచేయని జగన్ వ్యూహం’

image

పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు వ్యూహాలను ప్రయోగించారని, అవేమీ పనిచేయలేదని కూటమి శ్రేణులు, జనసైనికులు అంటున్నారు. పిఠాపురంలోనే జగన్ ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినా, హామీలు కుమ్మరించినా, వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానన్నా.. వాటి ప్రభావం ఫలితాల్లో ఎక్కడా కనిపించలేదన్నారు.

News June 5, 2024

తూ.గో: అసెంబ్లీకి ఎవరెవరు ఎన్నోసారంటే..!

image

➤ సీనియర్లు: గోరంట్ల (7వసారి), వేగుళ్ల (5వసారి), బండారు (4వసారి), జ్యోతుల నెహ్రూ (3వసారి), చినరాజప్ప (3వసారి), నల్లమిల్లి (2వసారి), ఆనందరావు (2వసారి), కొండబాబు (2వసారి), దాట్ల సుబ్బరాజు (2వసారి), ముప్పిడి వెంకటేశ్వరరావు (2వసారి).
➤ తొలిసారి: పవన్, దివ్య, సత్యప్రభ, శిరీషాదేవి, గిడ్డి సత్యనారాయణ, నానాజీ, దేవవరప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ , వాసంశెట్టి, దుర్గేశ్, మద్దపాటి వెంకటరాజు.

News June 5, 2024

తూ.గో: మాజీ స్పీకర్ల వారసులను వరించిన విజయం

image

లోక్‌సభ, అసెంబ్లీ మాజీ స్పీకర్ల వారసులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
లోక్‌సభ మాజీ స్పీకర్‌ స్వర్గీయ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ 3,42,196 ఓట్ల మెజార్టీతో అమలాపురం ఎంపీగా అఖండ విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య 15,277 ఓట్ల మెజార్టీతో తుని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

News June 5, 2024

తూ.గో: నలుగురు మహిళామణుల విజయకేతనం

image

ఉమ్మడి తూ.గో జిల్లా నుంచి నలుగురు మహిళామణులు విజయకేతం ఎగురవేశారు. వీరిలో ముగ్గురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా.. ఒకరు పార్లమెంట్‌లో గళం వినిపించనున్నారు.
➠ పార్లమెంట్ స్థానం
☞ రాజమండ్రి- పురందీశ్వరి(BJP) (మెజార్టీ-2,39,139)
➠ అసెంబ్లీ స్థానాలు
☞ ప్రత్తిపాడు- వరుపుల సత్యప్రభ(TDP) (38,768+)
☞ తుని- యనమల దివ్య(TDP) (15,177 +)
☞ రంపచోడవరం-శిరీషాదేవి(TDP) (9,139+)

News June 5, 2024

గోదారోళ్ల దెబ్బ.. ఇక జనసేనకు ‘గాజు గ్లాస్’..!

image

21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్లా గెలిచి TDP తర్వాత అత్యధిక MLAలతో అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో జనసేనకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ఖరారు చేయనుండటం వారికి మరో గుడ్ న్యూస్. 21 స్థానాల్లో మన ఉభయ గోదావరి నుంచే 11 ఉండటం గమనార్హం. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలవగా.. జనసేన రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. మన ఉభయ గోదారోళ్లు ఎక్కడా వైసీపీని ఆదరించలేదు.