EastGodavari

News March 28, 2024

తెలంగాణలో తూ.గో జిల్లావాసి సూసైడ్

image

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో సామర్లకోటకు చెందిన కొరిపల్లి సంజయ్ (26) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై యాదగిరి బుధవారం తెలిపారు. ఇతను సంజయ్ దివిస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని చెప్పారు. పరిశ్రమ క్వార్టర్స్ లో ఉండే అతను నెల రోజుల క్రితం స్నేహితులు అద్దెకు ఉండే గదికి మారాడన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.

News March 28, 2024

రాజానగరంలో భారీ అగ్ని ప్రమాదం

image

మండలంలోని చక్రద్వారబంధం గ్రామంలో సుమ రిఫైనరీ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆయిల్ ముడిసరుకు బాయిలర్ శుభ్రం చేయడానికి మరమ్మతులు చేస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని యాజమాన్యం తెలిపారు.

News March 28, 2024

1న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్స్

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు. బీఈడీ రెండేళ్ల కాలవ్యవధి కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్ సీట్లు 14, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ఏపీ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలన్నారు.

News March 27, 2024

మాజీ సైనికుడికి అనపర్తి టికెట్

image

బీజేపీ అనపర్తి MLA అభ్యర్థి శివరామకృష్ణంరాజు బిక్కవోలు మండలం రంగాపురంలో 1986 జులై 22న జన్మించారు. 16 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ స్థాయిలో పనిచేశారు. పదవీ విరమణ చేసిన రాజు RSSలో ప్రచార ప్రముఖ్‌గా పని చేశారు. అనంతరం BJPలో చేరి మండల అధ్యక్షుడిగా, జిల్లా మీడియా ప్యానలిస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం అనపర్తి BJP కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి రామరాజు 1982 నుంచి BJP సభ్యుడు.

News March 27, 2024

ఇంటి నుంచే ఓటు వేయవచ్చు: కలెక్టర్

image

85 ఏళ్లు పైబడిన వృద్ధులు, నడవలేని దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృత్తికా శుక్లా బుధవారం తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంపొందించే దిశగా ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. మొబైల్ వాహనం సాయంతో ఇంటి వద్దే వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయవచ్చన్నారు.

News March 27, 2024

అనపర్తి MLA అభ్యర్థిగా శివరామకృష్ణం రాజు

image

ఎట్టకేలకు అనపర్తి MLA టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఆ పార్టీ నేత ములగపాటి శివరామకృష్ణం రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. టీడీపీ తొలి జాబితాలో అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. తర్వాత బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు రాజుకే టికెట్ దక్కింది.

News March 27, 2024

కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్డు మూసివేత

image

కాకినాడ సముద్రతీరంలో నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్డును మూసివేస్తున్నట్లు గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. వాహనాలను తిమ్మాపురం అచ్చంపేట కూడలి నుంచి పిఠాపురం మళ్లిస్తున్నామని.. వాహనదారులు, గ్రామస్థులు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు.

News March 27, 2024

తూ.గో.: 30వ తేదీన జనసేనలోకి సీనియర్ నేత

image

తూ.గో. జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మలపల్లి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలపల్లి గతంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పలుమార్లు పోటీలో నిలిచారు. కాగా ఈ నెల 30వ తేదీన పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.

News March 27, 2024

తూ.గో.: 31న ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక

image

ఉమ్మడి తూ.గో. జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలిపారు. స్త్రీ, పురుషుల విభాగంలో జట్ల ఎంపిక ఉంటుందన్నారు. అమలాపురం జడ్పీ పాఠశాలలో ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన వారు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలతో రావాలని ఆయన సూచించారు.

News March 27, 2024

సామర్లకోట: ఏప్రిల్ 1 నుంచి పలు రైళ్లు రద్దు

image

ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రైళ్లను పూర్తిగా, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో పట్టాల మరమ్మతుల కారణంగా విశాఖపట్నం- మచిలీపట్నం, గుంటూరు- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 4 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. రామవరప్పాడు- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.