EastGodavari

News June 1, 2024

AARA సర్వే: రాజమండ్రిలో పురంధరీశ్వరి గెలుపు డౌట్

image

కూటమి పొత్తులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలిచిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి గట్టిపోటీ ఎదుర్కోనున్నట్లు ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. కాగా ఇక్కడ ఆమె గెలుపు, ఓటమికి సమాన అవకాశాలు ఉండనున్నాయని పేర్కొంది.

News June 1, 2024

తూ.గో.: ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్: SP

image

ఈ నెల 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు కొత్త నిబంధన విధించారు. ఏజెంట్లకు ఎన్నడూ లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే.. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

News June 1, 2024

గోదావరి డెల్టాకు నీరు విడుదల చేసిన కలెక్టర్

image

ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాల భూములకు ఖరీఫ్ సాగు నిమిత్తం నీరు విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కలెక్టర్ మాధవీలత నీటిని వదిలారు. ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజినీరు ఆర్.సతీష్ కుమార్, ధవళేశ్వరం సర్కిల్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. 

News June 1, 2024

కాకినాడ: గాలివాన బీభత్సం.. ఆటోపై పడిన చెట్టు

image

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో శనివారం ఈదురు గాలులకు ఓ చెట్టు విరిగి ఆటోపై పడింది. గ్రామానికి చెందిన సూరాడ బుజ్జి అనే వ్యక్తి తన ఆటోను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పెద్ద వృక్షం విరిగి ఆ ఆటోపై పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బుజ్జి లబోదిబోమంటున్నాడు.

News June 1, 2024

తూ.గో: విద్యుత్ కోతలతో ఆక్వా రైతుల గగ్గోలు

image

అప్రకటిత విద్యుత్‌ కోతలు ఉమ్మడి తూ.గో జిల్లాలోని రొయ్యల రైతులకు నష్టాలను మిగుల్చుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అదనపు భారం పడుతోంది. డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూ.గో జిల్లాల పరిధిలో 75వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ ఏడాది లాభాల పంట పండిస్తుందనే ఆశతో మార్చిలో రైతులు ఉత్సాహంగా రొయ్యల సాగు ప్రారంభించారు. విద్యుత్‌ కోతలు తమ ఆశలపై నీళ్లు జల్లుతున్నాయని వారు వాపోతున్నారు.

News June 1, 2024

మృతిపై అనుమానం.. ఖననం చేసిన 3రోజులకు పోస్టుమార్టం

image

ఉమ్మడి తూ.గో జిల్లా మారేడుమిల్లి మండలం కుండాడలో 3 రోజుల కింద ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుండాడకు చెందిన కుండ్ల లీలాప్రసాద్‌రెడ్డి(40) మే 27న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. అతడి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం కావడంతో VRO ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. తూ.గో జిల్లా ‘పట్టం’ కట్టేదెవరికి?

image

ఎన్నికల ఫలితాల కోసం ఉమ్మడి తూ.గో జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News June 1, 2024

అంతర్ జిల్లా దొంగల అరెస్టు.. రూ.47.22 లక్షల రికవరీ

image

ప.గో.తో పాటు తూ.గో జిల్లా ఉండ్రాజవరం, పెరవలి, అంబాజీపేట, రావులపాలెం, అయినవిల్లి, రాజోలు, కొత్తపేట, అమలాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను శుక్రవారం తణుకు పోలీసులు అరెస్టు చేశారు. వెంకటనారాయణ (భీమవరం) ఈశ్వరరావు (తణుకు) పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తూ చోరీలకు పాల్పడ్డారని, వారి నుంచి రూ.47.22 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఐ నాగేశ్వరరావు తెలిపారు.

News June 1, 2024

కౌంటింగ్‌కు ఆటంకం కలిగించాలన్న యోచనలో వైసీపీ: వర్మ

image

కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించాలన్న యోచనలో వైసీపీ ఉందని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పిఠాపురంలో ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లను, గొడవలు సృష్టించే వారిని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా పెడుతోందని ఆరోపించారు. ఓడిపోతున్నామనే భయంతో జగన్ కొత్త నాటకాలకు తెర తీస్తున్నారన్నారు. కాకినాడ ఎస్పీ దృష్టి సారించాలని కోరారు.

News May 31, 2024

తూ.గో.: ఐదుకి చేరిన మృతుల సంఖ్య

image

గత ఏప్రిల్ 29వ తేదీన యానాం నుంచి డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు వస్తున్న ఆటో భట్నవిల్లి దగ్గర లారీని ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు యువకులు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందారు. కాగా నగరం పితానివారి మెరకకి చెందిన మాదాసి ప్రశాంత్ కుమార్ (17) శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.