EastGodavari

News April 17, 2025

రాజమండ్రి: గోదావరిలో పడి మహిళ మృతి

image

రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి సమీపంలో గోదావరిలో మునిగి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన నారాయణమ్మ రాజమండ్రిలోని ఓంశాంతి ఆశ్రమానికి వచ్చి వెళుతుంటుంది. ఈ విధంగా అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయి ఉంటుందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News April 16, 2025

వైజాగ్‌లో ముక్కామలకు చెందిన యువకుడి మృతి

image

వైజాగ్‌లోని దివీస్‌లో పనిచేస్తున్న పెరవలి మండలం ముక్కామలకు చెందిన మధు మోహన్ మంగళవారం మృతి చెందాడు. మోహన్ దివీస్‌లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమిలి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

News April 16, 2025

రాజమండ్రి: నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

image

నేటి నుంచి జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వేసవిలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. బుధవారం నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జూన్ 11 నుంచి జూలై 12వరకు ముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణమాసంలో శుభ ఘడియలు ఉండటంతో ముహూర్తాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.

News April 16, 2025

తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

image

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో AMP (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 16, 2025

చాగల్లు: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

బాలికను నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. చాగల్లు (M) బ్రాహ్మణగూడెంకు చెందిన బాలిక(15)పై అదే గ్రామానికి చెందిన సిద్దార్ధ చంద్ర అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఈనెల 10న ఫిర్యాదు చేసింది. సిద్దార్ధను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.

News April 16, 2025

RJY: ఇండోర్ పార్లమెంటు సభ్యులతో ఎమ్మెల్యే భేటీ

image

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉజ్జయిని పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా మహాదేవుని దర్శించుకున్న అనంతరం ఇండోర్ పార్లమెంటు సభ్యుడు శంకర్ లాల్వ ఆహ్వానం మేరకు ఎంపీ నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్, భవాని దంపతులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

News April 15, 2025

కోరుకొండలో రోప్‌వే.. ఫలించిన ఎమ్మెల్యే కృషి

image

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కింద నుంచి కొండపై వరకు 0.25 కిలోమీటర్ల మేర రోప్‌వే చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, అన్నవరం దేవస్థానం వారి సమగ్ర ప్రణాళికతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఎంపీకి నేరుగా అందించడం వల్ల నలుగురు మంత్రులు ఆమోదించి 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

News April 15, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్‌లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

News April 15, 2025

RJY: మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ

image

తూ.గో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కే.వీ. సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 991 బ్యాచ్‌కు చెందిన ఆయిన ఉమ్మడి తూ.గో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో సీఐ గా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమండ్రి  అడిషనల్ డీఎస్పీగా, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, పరవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఎపీ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు, బదిలీపై ఇక్కడికి వచ్చారు.

News April 14, 2025

విజ్జేశ్వరం: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు గల్లంతు

image

సీతంపేట సమీపంలోని విజ్జేశ్వరం – మద్దూరు లంక బ్యారేజ్ దగ్గర సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నిడదవోలుకు చెందిన మత్తి ప్రకాష్ కుమార్ (15), రాజమండ్రికి చెందిన గంధం హర్ష (20) నదిలో గల్లంతయ్యారని విషయం తెలుసుకొని ఎన్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్,ఎస్పీలతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.