EastGodavari

News March 20, 2024

‘కొబ్బరి పీచు బొమ్మల’కు మంచి రోజులు!

image

కోనసీమ మహిళలు కొబ్బరి పీచుతో తయారు చేస్తున్న బొమ్మలను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కాకినాడ లేపాక్షి మేనేజర్ వీరబాబు తెలిపారు. మంగళవారం ఆయన మామిడికుదురు మండలం పాసర్లపూడిలోని ఆక్సిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో నిర్వహిస్తున్న గ్రామ దుకాణ్ కొబ్బరి పీచు బొమ్మల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు.

News March 19, 2024

గోరంట్ల హ్యాట్రిక్ కొట్టేనా.. చెల్లుబోయిన కళ్లెం వేసేనా..?

image

TDP ఆవిర్భావం నుంచి NTR కష్టసుఖాలలో వెంట నడిచిన నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈయన రాజమండ్రి, రూరల్ నుంచి MLA అభ్యర్థిగా 9సార్లు బరిలో నిలిచి, 6సార్లు (1983, 85, 1994, 99, 2014, 19) గెలిచారు. రూరల్‌లో 2014, 19 ఎన్నికలలో వరుసగా గెలిచిన గోరంట్ల.. ఈసారి వైసీపీ నుంచి చెల్లుబోయిన వేణుతో తలపడుతున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని గోరంట్ల.. గోరంట్లకు కళ్లెం వేయాలని వేణు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

News March 19, 2024

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో  16మంది వాలంటీర్లపై వేటు

image

‘సిద్ధం’ సభలో పాల్గొన్నారని 16మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన 16మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీవో కె.లక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నందుకు వీరిపై చర్యలు తీసుకున్నామన్నారు.

News March 19, 2024

ప్రజాగళం సభతో వైసీపీకి ఓటమి భయం: గోరంట్ల

image

ఇటీవల చిలకలూరిపేట మండలంలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ ప్రజాగళం సభ విజయవంతమైందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాగళం సభతో వైసీపీకి ఓటమి ఖరారైందని అన్నారు. ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

News March 19, 2024

పవన్‌పై వైసీపీ అభ్యర్థి వంగా గీత సెటైర్స్

image

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కాపు అయితే, నేనూ కాపు ఆడపడుచునే అని అన్నారు. 100 శాతం కాపుల మద్దతు తనకే ఉంటుందని, అన్ని కులాల్లో తనను అభిమానించేవారు ఉన్నారన్నారు. చుట్టం చూపుగా వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోయే వారిని ప్రజలు నమ్మరని సెటైర్స్ వేశారు. పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

News March 19, 2024

తూ.గో.: అకాల వర్షాలు.. బీ అలర్ట్

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు రేపు (ఈ నెల 20న) కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోనసీమ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.

News March 19, 2024

కాకినాడ చరిత్రలో 1983లో అత్యధికం.. ఈ సారి ఛాన్స్ ఉందా.?

image

కాకినాడ పట్టణ నియోజకవర్గానికి 1952- 2019 వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి మల్లాడిస్వామిపై అత్యధికంగా 55631 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ సిటీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. మళ్లీ అంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. మరి ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదైనా.. ఆ నాటి మెజారిటీని కొల్లగొట్టేనా..?

News March 19, 2024

కోనసీమ: ఉద్యోగం రావట్లేదని యువకుడు SUICIDE

image

కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన నల్లి శ్రీకాంత్ కుమార్ (23) బీటెక్ చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఆదివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతణ్ని రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కుమార్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్ఐ తెలిపారు.

News March 19, 2024

తూర్పుగోదావరి: సెల్యూట్ ‘అమ్మ’❤

image

యానాంకు చెందిన కడలి మధు, మాధవ్ చిన్నతనంలోనే నాన్న ప్రేమకు దూరమయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా వారి చదువు, బాగోగులు అన్నింటినీ వాళ్ల అమ్మే చూసుకుంది. ఇద్దరు కొడుకులను బాగా చదివించింది. ఈ క్రమంలో ఇద్దరూ కానిస్టేబుళ్లు అయ్యారు. ఇటీవల పుదుచ్చేరి పోలీస్ శాఖ ప్రకటించిన పదోన్నతులలో ఏఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్సై యూనిఫాంలో ఇంటికి వచ్చి వారి అమ్మకు సెల్యూట్ చేస్తూ పొంగిపోయారు.
– GREAT కదా.

News March 19, 2024

జనసేనకు ‘గోదారోళ్ల’ మద్దతు ఉండేనా..?

image

TDP- జనసేన- BJP పొత్తులో భాగంగా APలో జనసేన 21 స్థానాల్లో పోటీచేయనుంది. అయితే ఇప్పటివరకు ప్రకటించిన వారిలో 9మంది ఉభయగోదారి జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. మరో 2 స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందని టాక్. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సైతం తూ.గో. జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. మొత్తం సీట్లలో 50 శాతం అభ్యర్థులను మన గోదారి జిల్లాల నుంచే బరిలో నిలిపారు. మరి జనసేనను గోదారోళ్లు ఆదరించేనా..?
– మీ కామెంట్..?