EastGodavari

News March 21, 2024

కొత్తపేట:3 సార్లు గెలుపు 3 సార్లు ఓటమి.. ఈసారి గెలుస్తారా?

image

కొత్తపేట నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు 1994 నుంచి ఇంతవరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా 3 సార్లు గెలిచి, 3 సార్లు ఓటమి చెందారు. టీడీపీ తరఫున (1994,1999), 2009లో ప్రజారాజ్యం తరఫున గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కొన్నాళ్ళు ఆ పార్టీలో కొనసాగి తిరిగి టీడీపీలో చేరారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఈసారి గెలుస్తారా?కామెంట్ చేయండి.

News March 21, 2024

తాళ్లరేవు:ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో

image

216వ నంబర్‌ జాతీయ రహదారిపై తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్టు కోరంగి పోలీసులు తెలిపారు. యానాం నుంచి కాకినాడ వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు కాకినాడ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.

News March 20, 2024

లారీ-గోడకు మధ్య ఇరుక్కొని మహిళల మృతి

image

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం లలిత రైస్ ఇండస్ట్రీలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ వెనక్కి తీస్తుండగా క్యాబిన్‌కు-గోడకు మధ్య చిక్కుకొని కామేశ్వరి(60), నాగరత్నం(65) మృత్యువాత పడ్డారు. వర్షం వస్తోందని గోడ పక్కన నిలుచున్న వీరిని లారీ ఢీ కొట్టింది. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2024

సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా: తూ.గో ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తూ.గో జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉందని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూప్స్‌ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. SHARE IT..

News March 20, 2024

REWIND: వంగా గీతకు 169 ఓట్లు

image

వంగా గీత 1994లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. TDPలో వర్గపోరుతో తొలుత ఆమెను అభ్యర్థిగా ప్రకటించినా బీఫారం వెన్నా నాగేశ్వర రావుకు అందించారు. అప్పట్లో ఆమెకు చంద్రబాబు, బాలయోగి ఆశీస్సులు ఉన్నా టికెట్ దక్కలేదు. నామినేషన్ తర్వాత బీఫారం కోసం చివరి వరకు ఆమె హైదరాబాద్‌లో ఉండటంతో దాన్ని ఉపసంహరించుకునే ఛాన్స్ దక్కలేదు. ఆమె పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉన్నా ఎటువంటి ప్రచారం చేయలేదు. అయినా 169 ఓట్లు దక్కాయి.

News March 20, 2024

పిఠాపురంలో లక్ష ఓట్లు కూడా పవన్‌కి రావు: వెల్లంపల్లి

image

గతంలో గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారని అతనికి ఓటమి కొత్త ఏమి కాదని వైసీపీ సెంట్రల్ ఇన్‌ఛార్జ్ వెల్లంపల్లి అన్నారు. నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో లక్ష మెజార్టీ కాదు లక్ష ఓట్లు కూడా పవన్‌కి పడతాయా అని ఎద్దేవా చేశారు. అనంతరం చంద్రబాబు, లోకేశ్ వారి నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తుంటే పవన్‌ని ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.

News March 20, 2024

పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు : వంగా గీత

image

జనసేనలోకి పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీతను, పవన్ కళ్యాణ్ ఆహ్వానించడంపై ఆమె స్పందించారు. పవన్ కళ్యాణ్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు. ‘నేను కూడా పవన్ కళ్యాణ్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. పిఠాపురంలో కేవలం ‘నా మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి’అని ధీమా వ్యక్తం చేశారు.

News March 20, 2024

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి విమర్శలు

image

పవన్ కళ్యాణ్‌పై MLA ద్వారంపూడి పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన MLA గా పోటీ చేయాలంటే చంద్రబాబు,MPగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయి ఉండి కూడా ఇటువంటి స్థితిలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. పిఠాపురంలో కాపు సమాజిక వర్గం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌పై ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు.

News March 20, 2024

పవన్‌ను నేను కలవలేదు: పిఠాపురం వర్మ

image

పవన్ కళ్యాణ్‌ను ఇటీవల తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని వర్మ పేర్కొన్నారు. ‘పవన్‌తో నేను రెండు మూడు సార్లు ఫొటో దిగాను. 2014లో పవన్‌ను కలిసిన ఫొటోను అప్పుడప్పుడు జనసేన నేతలు వాడుతున్నారు. గతంలో పవన్‌ను కలిసినప్పుడు విజయానికి సీక్రెట్ ఏంటని నన్ను అడిగారు. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటానని చెప్పా. అప్పుడు పవనే పిలిచి ఫొటో తీసుకుందామని అడిగారు’ అని ఆయన జ్ఞాపకాలను వర్మ గుర్తు చేసుకున్నారు.

News March 20, 2024

పెళ్లి పేరుతో మోసం.. కానిస్టేబుల్‌కు జైలు శిక్ష

image

ఓ RPF కానిస్టేబుల్ పెళ్లి పేరుతో మోసం చేశాడు. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడికి చెందిన పరమట వెంకటేశ్వర దొరబాబు పేరూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత ఆమెను పట్టించుకోకపోవడంతో బాధితురాలు 2009 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో అతడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ రాజమండ్రి కోర్టు జడ్జి వై.బెన్నయ్య నాయుడు మంగళవారం తీర్పు చెప్పారు.