EastGodavari

News May 23, 2024

తూ.గో.: స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ వాయిదా

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డాక్టర్.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామని జిల్లా సమన్వయ అధికారి వెంకట్రావు గురువారం తెలిపారు. తదుపరి తేదీలను పత్రికా ముఖంగా తెలియజేస్తామన్నారు. పేరెంట్స్, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు.

News May 23, 2024

వెలిచేరులో యువకుడి అనుమానాస్పద మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు శివారులో యువకుడి డెడ్‌బాడీ కలకలం రేపింది. కైరం నాగశ్రీనివాస్(34) తన తండ్రి పోతురాజుతో పొలం పనులకు వెళ్తూ ఉంటాడు. గురువారం ఉదయం గ్రామ శివారున శ్రీనివాస్ స్పృహ లేకుండా పడి ఉండడం చూసి తండ్రి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అతడు చనిపోయినట్లు తెలపగా.. తండ్రి పోతురాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.శ్రీనివాస్ తెలిపారు.

News May 23, 2024

కాకినాడ: పెళ్లికి వెళ్లొస్తూ కాలువలో వ్యక్తి గల్లంతు

image

కాకినాడ జిల్లా రౌతులపూడి శివారులో ఏలేరు ఎడమ కాలువలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన సీకోలు వీరబాబు అదే గ్రామానికి చెందిన పలువురితో కలిసి రౌతులపూడిలో ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఏలూరు ఎడమ కాలువలో స్నానానికి దిగగా.. వీరబాబు గల్లంతయ్యాడని దుర్గాడ గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

News May 23, 2024

తూ.గో: రేపు బాలికల క్రికెట్ జట్టుకు ఎంపికలు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రికెట్ మైదానంలో ఈ నెల 24న బాలికల అండర్-15, 19 సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి సత్యనారాయణ బుధవారం తెలిపారు. అండర్ 15 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2009, అండర్ 19 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2005 తరువాత పుట్టిన వారు అర్హులన్నారు.

News May 23, 2024

కాకినాడ: ACB వలలో పరిశ్రమల శాఖ GM

image

ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ.మురళి బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ మురళి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

News May 23, 2024

నన్ను జైలులోనే చంపాలని చూశారు: రఘురామ

image

జగన్‌ చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించి, అక్కడే చంపాలని చూశారని MP రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజునే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడే చనిపోయినట్లు భావించా. తెల్ల పేపర్‌పై సంతకం చేయాలని కస్టడీలో ముగ్గురు ముసుగులేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. జగన్‌‌లో మార్పు రావాలనుకున్నా.. చివరికి ఆయన్నే మార్చాలన్నా ఆలోచన వచ్చింది’ అని అన్నారు.

News May 23, 2024

తూ.గో: ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్లు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశం కోసం ఈ నెల 25వ తేదీ శనివారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి వెంకట్రావు బుధవారం తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్‌లో ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. పదో తరగతిలో పొందిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన అర్హత కలిగిన బాలుర, బాలికలకు అడ్మిషన్లు కల్పిస్తామన్నారు.

News May 22, 2024

మూడంచెల భద్రతను పరిశీలించిన ఎస్పీ శ్రీధర్

image

కాట్రేనికోన మండలం చెయ్యేరులో శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘాను మరియు ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లను తనిఖీ చేశారు. ఇబ్బందికి తగు చూశాను అందించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా జిల్లాలో జూన్ 10 వరకు బాణాసంచా తయారీని నిషేధించామన్నారు.

News May 22, 2024

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు.. కాకినాడ ఎస్పీ హెచ్చరిక

image

కాకినాడ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ సతీశ్ కుమార్ చెప్పారు. వివిధ పార్టీల నాయకులతో బుధవారం ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజున చిన్న చిన్న ఘటనలు జరిగాయని, లెక్కింపు సందర్భంగా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 22, 2024

కోనసీమ: నిండు ప్రాణాన్ని కాపాడిన హైవే సిబ్బంది

image

హైవే పెట్రోలింగ్ సిబ్బంది రావులపాలెం వైపు గస్తీ నిర్వహిస్తుండగా సిద్ధాంతం బ్రిడ్జిపై సుమారు 45 ఏళ్ల మహిళ గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించారు. గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రాజబాబు, దుర్గారావు, విజయ చందర్ వెంటనే చేరుకుని ఆ మహిళను అతి కష్టం మీద ఆపగలిగారు. ఆ మహిళను తమ వెంటబెట్టుకుని రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు బ్రిడ్జిపై జరిగిన సంఘటన వివరించారు.