EastGodavari

News May 18, 2024

తూ.గో.: కోడికత్తి కేసు UPDATE

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. అయితే దీనిపై హైకోర్టు స్టే ఉన్నందున తదుపరి విచారణ జూన్ 21వ తేదీకి వాయిదా వేసింది. YS.జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన శ్రీనుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

News May 18, 2024

ప్రశాంతంగా ఎంసెట్ పరీక్షలు: JNTU ఉపకులపతి

image

రాష్ట్రంలో శుక్రవారం ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కాకినాడ జేఎన్టీయూ ఉపకులపతి ప్రసాదరావు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 20,256 మంది పరీక్షకు హాజరుకాగా.. 1995 మంది గైర్హాజరు అయినట్టు తెలిపారు. కాకినాడ జిల్లాలో ఫార్మసీ విభాగానికి సంబంధించి 920 మంది విద్యార్థులు హాజరయ్యారు.

News May 18, 2024

నన్నయ వర్సిటీ పరిధిలో 144 సెక్షన్: మాధవీలత

image

తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన నన్నయ విశ్వవిద్యాలయం నుంచి కిలోమీటర్ మేర 144 సెక్షన్ అమలుపరచడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

News May 17, 2024

అనపర్తిలో నకిలీ నోట్ల చెలామణి కలకలం

image

తూ.గో జిల్లా అనపర్తిలో నకిలీ నోట్ల చెలామణి కలకలం రేపింది. ఫేక్ నోట్స్ మార్కెట్‌లోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేని విధంగా ఏ మాత్రం అనుమానం రాకుండా చేతులు మారుతున్నాయట. రూ.100, రూ.200, రూ.500 నకిలీ నోట్లు విపరీతంగా చెలామణి అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. డబ్బు చూస్తేనే దుకాణదారులు భయపడుతున్నారు. బడ్డీ కొట్లు, చిన్న దుకాణదారులు వాటికి బలవుతున్నారు.

News May 17, 2024

మామిడి చెట్టుపై గుండెపోటు.. కిందపడి వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లమిల్లి సత్తిరాజు కుమారుడు కృష్ణప్రసాద్ HYDలో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఓటింగ్ కోసం స్వగ్రామానికి వచ్చిన కృష్ణప్రసాద్.. ఈ రోజు మామిడికాయలు కోయడానికి చెట్టెక్కాడు. కాయలు కోస్తున్న క్రమంలో గుండెపోటు రాగా పైనుంచి రాయిపై పడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

News May 17, 2024

తూ.గో.: జాతీయరహదారిపై ACCIDENT.. యువకుడు మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద 216వ నంబర్ జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడని ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన బర్రె నాగరాజు (21) బైక్‌పై రావులపాలెం నుంచి మూలస్థాన అగ్రహారం వైపు వస్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News May 17, 2024

ఉమ్మడి జిల్లాలో 2 నగరాల్లో ఓటర్లలో చైతన్యం

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని రెండు నగరాల్లో ఓటర్ల చైతన్యంలో కాకినాడ ప్రథమ స్థానంలో నిలిచింది. కాకినాడలో అత్యధికంగా 72.16% పోలింగ్ జరిగింది. రాజమహేంద్రవరంలో 67.57% పోలింగ్ నమోదైంది. ఈ రెండు నగరాల్లో ఓటింగ్ శాతం గతం కంటే పెరిగింది. మరోవైపు 9 పట్టణాల్లో మండపేట, పిఠాపురం, నిడదవోలు ముందంజలో నిలిచాయి. మండపేటలో అధికంగా 85.72%, పిఠాపురంలో 83.48%, నిడదవోలులో 82.31% పోలింగ్ జరిగింది.

News May 17, 2024

రాజమండ్రి: పలు రైళ్లకు అదనపు ఏసీ కోచ్‌లు

image

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రి రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో శనివారం నుంచి 21వ తేదీ వరకు అదనంగా ఒక థర్డ్ ఏసీకోచ్ ఏర్పాటుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- విశాఖపట్నం సికింద్రాబాద్ (12740/12739), సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ (22204/22203) రైళ్లలో ఈ అదనపు ఏసీ కోచ్‌లు ఏర్పాటుచేశామని వివరించారు.

News May 17, 2024

తూ.గో.: జోరుగా బెట్టింగులు.. మీ వద్ద ఉందా..?

image

ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పందేలు కాస్తున్నారు. రామచంద్రపురానికి చెందిన ముగ్గురు యువకులు ఓ పార్టీ విజయం సాధిస్తుందని రూ.1.50 లక్షలు పందెం కాయగా, ఎదుటి వ్యక్తి మరో పార్టీది విజయం అంటూ రూ.3 లక్షల రెట్టింపు పందెం వేశారు. కొన్ని చోట్ల మెజారిటీలపైన కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.- మీ వద్ద ఉందా..? 

News May 17, 2024

తూ.గో.: భార్యను తిట్టాడని.. హత్య

image

తూ.గో. జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో దారుణ హత్య జరిగింది. SI రామారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులగం సూర్యనారాయణ రెడ్డి(65) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కాగా బుధవారం గ్రామానికి చెందిన శివారెడ్డి, అతని భార్యను దూషించాడు. దీంతో గురువారం రాత్రి గ్రామ శివారు దూడలపాకలో ఒంటరిగా ఉన్న సూర్యనారాయణరెడ్డిని శివారెడ్డి కర్రతో కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.