India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☞ GNT: పెళ్లయిన 3వ రోజే నవవధువు ఆత్మహత్య
☞ GNT: గుండెపోటుతో ట్రాఫిక్ ASI మృతి
☞ నల్లపాడులో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
☞ అర్ధరాత్రి కొండవీటి వాగు పనులు పరిశీలించిన మంత్రి
☞ గుర్తింపు లేని పార్టీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం: కలెక్టర్
☞ మంగళగిరి: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన CM చంద్రబాబు
☞ పొన్నూరు: టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ విమర్శలు
☞ ప్రమాదకరంగా విద్యార్థుల పడవ ప్రయాణం
నేడు ప్రపంచ దోమల దినోత్సవం. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారానే మలేరియా వ్యాపిస్తుందని కనుగొన్నారు. గుంటూరు జిల్లాలో దోమల నివారణకు ఒక్కో గ్రామానికి రూ.15 వేలు ఖర్చు చేస్తున్నా, కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే కృష్ణా డెల్టా పరిధిలో సుమారు 70 వేల ఎకరాల్లో వరితో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయని అంచనా. ఎగువున డ్యాముల నుంచి నీరు విడుదల పెరగడంతో అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర మండలాల్లో పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటన ఖరారైంది. ఉదయం 10:40 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 6:30 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఈ నెల 24న సెయింట్ జోసఫ్ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఆరోజు ఉదయం 11గం. నుంచి సాయంత్రం 4 గం.ల వరకు రెగ్యులర్, ఒకసారి తప్పిన వారికి పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు www.bsc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
తాడేపల్లిలో ఓ వివాహితను అధిక వడ్డీలు చెల్లించమని బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తాడేపల్లి CI వీరేంద్ర తెలిపారు. నిందితుల నుంచి వివాహిత భర్త రూ.50 వేలు తీసుకోగా వడ్డీతో సహా చెల్లించినప్పటికీ బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచామని CI పేర్కొన్నారు.
నేడే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం. ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదలాడుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధురస్మృతులు మనసులో మొదలవుతాయి. ఒకప్పుడు ఫోటోలు అంటే ఫోటోగ్రాఫర్కి పరిమితం, ఇప్పుడు సెల్ ద్వారా ప్రతీ ఒక్కరు మధుర జ్ఞాపకాలని సెల్ఫోన్లో బందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఎంతో మధురంగా ఉంటుంది. మరి ఫోటోతో మీకు ఉన్న అనుభవాన్ని COMMENT చేయండి.
☞ అమరావతి అంతా లోతట్టు ప్రాంతం: అంబటి.
☞ తాడికొండ: సొసైటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో రచ్చ.
☞ తెనాలి: తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్.
☞ ప్రత్తిపాడు: పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నేతలు.
☞ అమరావతి: అసైన్డ్ రైతులకు శుభవార్త.
☞ మంగళగిరి: CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్.
☞ పొన్నూరు: కండక్టర్ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.
☞ GNT: ఫ్రీ బస్సు.. ఐడీ లేకుంటే 2 రోజులే అవకాశం.
కాకుమాను మండలంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ బలసాని కిరణ్ కుమార్ సోమవారం పర్యటించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వారు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని వారు కోరారు.
Sorry, no posts matched your criteria.