Guntur

News January 28, 2026

మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దు: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని DEO సలీం భాష ఉపాధ్యాయులకు సూచించారు. కేఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, హిందూ, యాదవ హైస్కూల్, నల్లపాడు ZPస్కుల్స్‌ని బుధవారం DEO ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ అందించే చిక్కీలు, కోడిగుడ్లపై గడువును పరిశీలన చేస్తూ ఉండాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని చెప్పారు.

News January 28, 2026

రెవెన్యూ సేవలు మెరుగు పర్చాలి: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ సేవల పై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మెరుగుపర్చాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ అధికారుల వర్క్ షాప్‌లో కలెక్టర్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తాజాగా అనేక సర్కూలర్స్ జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News January 28, 2026

గుంటూరు: ఈ నెల 30న GGHకి సీఎం చంద్రబాబు

image

గుంటూరు జీజీహెచ్‌లో జింఖానా సహకారంతో నిర్మించిన కానూరి–జింఖానా మాతా శిశు సంరక్షణ భవనాన్ని ఈ నెల 30న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News January 28, 2026

GNT: వెస్ట్ బైపాస్‌తో ట్రాఫిక్‌కు ఊరట

image

సంక్రాంతి నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డులో ఒక భాగం అందుబాటులోకి రావడంతో గుంటూరు–మంగళగిరి మధ్య ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. కాజ నుంచి గుంటుపల్లి వరకు 3లేన్ల రహదారి తెరుచుకోవడంతో భారీ వాహనాలను బైపాస్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాల్లో జామ్‌లు తగ్గాయి. రెండు జిల్లాల పోలీసులు కాజ జంక్షన్ వద్ద నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్చి నాటికి మిగిలిన మార్గం పూర్తైతే సమస్య తీరనుంది.

News January 28, 2026

GNT: నల్ల తామర దెబ్బకు మిరప రైతుల ఆవేదన

image

గుంటూరు జిల్లాలో మిరప పంటపై నల్ల తామర, తెల్ల దోమ ఉధృతి తీవ్రంగా పెరిగింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా పురుగులు అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. పూత, కాయ దశలో తామర రసం పీల్చడంతో ఆకులు మాడిపోతూ, పువ్వులు రాలిపోతున్నాయి. లేత కాయలు గిడసబారి రంగు మారుతున్నాయి. ఎకరాకు 5 క్వింటాళ్లకు పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉందని అంచనా. పెరిగిన సాగు ఖర్చులు, సరైన మందులు లేకపోవడం రైతులను మరింత కుంగదీస్తోంది.

News January 28, 2026

త్వరలో 40 అంతస్తులతో క్వాంటం వ్యాలీ భవనం: నారాయణ

image

అమరావతి ప్రాంతంలో ఉద్దండ రాయిని పాలెం సమీపంలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే CM చంద్రబాబు సూచనల మేరకు మరో రెండు భవనాలు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ రాయపూడి లో జరిగిన గ్రామసభలో చెప్పారు. రెండు భవనాలలో ఒకటి హైదరాబాదులోని హైటెక్ సిటీ మాదిరిగా 40 అంతస్తులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

News January 28, 2026

గుంటూరు: DLSAలో పోస్టులు.. ఈ నెల 30 వరకు ఛాన్స్

image

జిల్లా న్యాయసేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. తమ దరఖాస్తులను గుంటూరు జిల్లా కోర్టులో అందే విధంగా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లో పంపించాలన్నారు. పోస్టులు, విద్యార్హత, ఇతర వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్‌ను http//Guntur.dcourts.gov.in ద్వారా పొందవచ్చని అన్నారు.

News January 27, 2026

తెనాలిలో దారుణం.. భార్యను చంపి భర్త పరార్

image

తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం చోటు చేసుకుంది. డిపో రోడ్డుకు చెందిన శిరీష (26)ను భర్త సాయి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. భార్యపై అనుమానంతో కొద్ది రోజులుగా ఘర్షణ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గొడవ జరగడంతో ఆమెను గొంతు నులిమి పరారయ్యాడు. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News January 27, 2026

సచివాలయ సీఎస్ఓకు ఇండియన్ పోలీస్ మెడల్

image

ఏపీ సచివాలయ సీఎస్ఓ పి.వి.ఎస్.ఎన్.మల్లికార్జునరావుకు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (MSM) లభించింది. 36 ఏళ్ల క్రమశిక్షణాయుత సేవలకు గుర్తింపుగా, గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన మల్లికార్జునరావు గతంలో ఐటీబీపీ, ఏపీఎస్పీఎఫ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఎఫ్ అధికారులు ఆయన్ను అభినందించారు.

News January 27, 2026

రాజ‌ధాని రైతుల‌కు 29న మ‌లివిడ‌త ప్లాట్ల కేటాయింపు

image

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 29న ప్లాట్ల కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతుల‌కు ఇ- లాట‌రీ ద్వారా ప్లాట్లను నిబంధ‌న‌ల ప్రకారం లాట‌రీ విధానంలో ప్లాట్లు కేటాయించ‌నున్నట్లు చెప్పారు. ఈ నెల 28కి బ‌దులు 29వ తేదీన లాట‌రీ నిర్వహించాల‌ని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.