Guntur

News March 27, 2025

అధికారులకు గుంటూరు జిల్లా ఎస్పీ సూచనలు

image

శాంతిభద్రతల పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేయాలని ఎస్పీ సతీష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు తదితర నేరాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పోలీసింగ్ లో నూతన వరవడిని సృష్టించాలని సూచించారు. ఏఎస్పీలు సుప్రజ, రమణమూర్తి పాల్గొన్నారు.

News March 26, 2025

ఉగాది పండుగ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు: చంద్రబాబు

image

ఉగాది పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు.

News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ విచారం

image

మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్‌, మత ప్రబోదకుడు ప్రవీణ్‌ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రవీణ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2025

ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలి: చంద్రబాబు

image

స‌చివాల‌యంలో బుధవారం జరిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో పోలీసు శాఖ‌, శాంతిభ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చ జ‌రిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖ‌కు మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలో జీరో క్రైమ్ ల‌క్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్ర‌ణాళిక‌ల‌తో కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులేయాలన్నారు. ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ఆధునిక టెక్నాల‌జీ విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.

News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

image

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

News March 26, 2025

రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించనున్న చంద్రబాబు

image

రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం సీఎమ్ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా సీఎం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు సీఎం చేరుకోనున్నారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. 

News March 26, 2025

GNT: రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటు 

image

గుంటూరు-1, మంగళగిరి ఆర్టీసీ డిపోల్లో రూ.15కోట్లతో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరుకు 150 బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. 100 బస్సులు గుంటూరు డిపోకి, మిగిలిన 50 బస్సులు మంగళగిరి డిపోకు కేటాయించనున్నారు. బస్సులు ఛార్జింగ్ పెట్టేందుకు బుడంపాడు నుంచి 3kv విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ బస్సులు 40కి.మీ. ప్రయాణిస్తాయి. 

News March 26, 2025

మంగళగిరి: అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్‌

image

అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీసు స్టేషన్‌లో శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. అఘోరితో కలిసివచ్చి శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు, కేర్‌టేకర్‌ విష్ణుతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఇష్ట పూర్వకంగానే అఘోరిగా మారినట్లు శ్రీవర్షిణి తెలిపింది.

News March 26, 2025

గుంటూరు: రాష్ట్ర జీఎస్టీ స్పెషల్ కమిషనర్‌గా నూతలపాటి సౌమ్య

image

గుంటూరులోని కస్టమ్స్, జీఎస్టీ అప్పీల్స్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న నూతలపాటి సౌమ్య, రాష్ట్ర జీఎస్టీ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులయ్యారు. మంగళవారం స్టేట్ ట్యాక్సెస్ (జీఎస్టీ) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన సౌమ్య సీనియర్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక హోదాతో ఆమె మూడేళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ శాఖలో పనిచేస్తారు.

News March 26, 2025

మంగళగిరి రైల్వే వంతెనకు కేంద్రం ఆమోదం

image

మంగళగిరి నగరంలోని నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేశ్‌ల వినతుల మేరకు మంగళవారం ఎల్సీ 14వద్ద ఆర్వోబీనీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సుమారు రూ.129.18 కోట్ల అంచనా వ్యయంతో.. కిలోమీటరు మేర 4 వరుసల రైల్వే వంతెన నిర్మాణం కానుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే అటు రాజధానితో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉపయోగకరంగా ఉంటుంది.

error: Content is protected !!