Guntur

News August 18, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

సీఎం చంద్రబాబు ఈనెల 19, 20 తేదీల్లో మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మీ, SP సతీశ్ కుమార్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. 19వ తేదీన సీకే కన్వెన్షన్‌లో ‘జీరో పావర్టీ పీ4’ కార్యక్రమం. 20న మంగళగిరి మయూరి టెక్ పార్క్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభిస్తారు. కలెక్టర్, SP సభాస్థలం, సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

News August 18, 2025

GNT: ఫ్రీ బస్సు.. ఐడీ లేకుంటే 2 రోజులే అవకాశం!

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో 403 బస్సులు అందుబాటులో ఉండగా, 302 బస్సులు (70%) బస్సుల్లో మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు గుంటూరు ఇన్‌ఛార్జ్ ఆర్.సామ్రాజ్యం తెలిపారు. రెండు, మూడు రోజులు ఒరిజినల్ ఐడీ కార్డు లేకపోయినా అనుమతిస్తామని, ఆ తర్వాత తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

News August 18, 2025

GNT: ‘పీజీఆర్ఎస్‌కి 33, డీవైసీకి 16 ఫిర్యాదులు’

image

జీఎంసీ డయల్ యువర్ కమిషనర్‌కి 16, పీజీఆర్ఎస్‌కి 33 ఫిర్యాదులు అందాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 14 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం జీఎంసీ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలను కమిషనర్ నిర్వహించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువు తేదీ లోపు పరిష్కరించాలని ఆదేశించారు.

News August 18, 2025

తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్

image

తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని సుల్తానాబాద్‌లో 8 మందిని అరెస్టు చేసి, వారి నుంచి కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఒకరు పరారీలో ఉన్నారన్నారు. మరో కేసులో కొల్లిపరలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

News August 18, 2025

మన గుంటూరు హీలియం పుట్టినిల్లు

image

హీలియం అనే పదం వినగానే మనలో చాలామందికి బెలూన్లు గుర్తుకు వస్తాయి. అయితే, ఈ హీలియంను గుంటూరులో కనుగొన్నారు. 1868, ఆగస్టు 18న సూర్యగ్రహణం సమయంలో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జూల్స్ జాన్సెన్ సూర్యునిలోని ఓ గీతలో ఒక కొత్త మూలకాన్ని కనుగొన్నారు. ఆ మూలకానికి ఆయన హీలియం అని పేరు పెట్టారు. భూమిపై ఇంతకుముందు ఈ మూలకం ఉనికి లేకపోవడంతో ఇది గుంటూరుకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

News August 18, 2025

ANU: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ANU పరిధిలోని కాలేజీల్లో బీ-ఫార్మసీ II/IV 4వ, III/IV 6వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 15, 16 తేదీల నుంచి పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు జరిమానా లేకుండా ఈనెల 28లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in ను సందర్శించవచ్చని పేర్కొంది.

News August 18, 2025

స్కూల్స్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి దరఖాస్తులు ఆహ్వానం: DEO

image

గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సి.వి. రేణుక తెలిపారు. 2025-27 సంవత్సరానికి సంబంధించి కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉన్న పీఈటీ/స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)లు ఈనెల 20లోపు deogunturblogspot.comలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 17, 2025

గుంటూరు జిల్లాలో రేపు వర్షం కురిసే ఛాన్స్

image

గుంటూరు జిల్లాలో సోమవారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే APSDMA చరవాణిలకు మెసేజ్‌లు పంపింది.

News August 17, 2025

గుంటూరు: GGHలో వాహనాల చోరీకి చెక్

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాల చోరీ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని ద్వారా ఆసుపత్రి స్వాగతద్వారంలోనే వాహనంతో పాటూ సంబంధిత వాహన యజమానికి RFID ట్యాగ్ వేసి వాహనాల చోరీని అరికట్టనున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

News August 17, 2025

గుంటూరు: GGHలో వాహనాల చోరీకి చెక్

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాల చోరీ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని ద్వారా ఆసుపత్రి స్వాగతద్వారంలోనే వాహనంతో పాటూ సంబంధిత వాహన యజమానికి RFID ట్యాగ్ వేసి వాహనాల చోరీని అరికట్టనున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.