Guntur

News September 13, 2024

మంగళగిరి: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

image

వైసీపీ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, తదితరులు పార్టీలో చేరారు.

News September 13, 2024

యాత్రికుల రక్షణకు చర్యలు ప్రారంభించాం: మంత్రి లోకేశ్

image

కేదార్ నాథ్‍లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం, మంత్రి మాట్లాడుతూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఈ లోగా యాత్రికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.

News September 13, 2024

గుంటూరు: విద్యార్థులకు శుభవార్త చెప్పిన RBI

image

RBI 90వ వార్షికంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90పేరిట క్విజ్ పోటీలు నిర్వహించనుంది. గుంటూరు జిల్లాలోని అన్ని కాలేజీలలో18వేల మంది ఉన్నారు. పాల్గొనే వారు 2024 sep 1కి 25 ఏళ్లలోపు ఉండి, WWW.rbi90quiz.inలో ఈ నెల 17 లోపు అప్లై చేసుకోవాలి. పోటీలు ఈనెల 19-21తేదీ వరకు ఉ.9- రాత్రి 9వరకు జరగనున్నాయి. జాతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.10లక్షలు,రూ. 8లక్షలు, రూ.6 లక్షలు నగదు ఇవ్వనున్నారు.

News September 13, 2024

గుంటూరు: రాష్ట్ర అధికార ప్రతినిధిగా మస్తాన్ వలీ

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్రానికి చెందిన 9 మంది కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర అధికార ప్రతినిధిలుగా నియమించింది. ఇందులో మస్తాన్ వలీకి కూడా స్థానం దక్కింది. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వలీకి శుభాకాంక్షలు తెలిపారు.

News September 12, 2024

సీఎం చంద్రబాబుకు విరాళం అందించిన బాలకృష్ణ

image

సీఎం చంద్రబాబును గురువారం రాత్రి సచివాలయంలో కలిసిన ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షల విరాళాన్ని అందించారు. ఆయనతోపాటు హీరోలు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ సైతం తమ వంతు సహాయంగా విరాళాల చెక్కులను సీఎంకు అందజేశారు. ఈ మేరకు సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు.

News September 12, 2024

సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ

image

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి అపార నష్టాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం గురువారం సచివాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని గుర్తించి ఉదారంగా సాయం చేయాలని సీఎం కోరారు.

News September 12, 2024

ఏచూరి సీతారాం మృతి పట్ల మంత్రి లోకేశ్ సంతాపం

image

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపిందన్నారు. ‘ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నా.. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి’ అంటూ ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

News September 12, 2024

గుంటూరు: డిగ్రీ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం

image

ANU ఐదో సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గుంటూరు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈనెల 13న ప్రారంభవుతుందని ప్రిన్సిపల్ పి.ఎం.ప్రసాద్ తెలిపారు. వీటితో పాటు 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతుందన్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేసి పంపాలని ఏఎన్యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కోరారు.

News September 12, 2024

గుంటూరు: యానిమేటర్స్ ధర్నా కేసును కొట్టేసిన కోర్టు

image

సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం 2018లో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం యూనియన్ నాయకులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు జడ్జ్) కేసును ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

News September 11, 2024

మంత్రి లోకేశ్‌కు హీరో సాయిధరమ్ తేజ్ విరాళం అందజేత

image

వరదలతో నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన చెక్కును మంత్రి లోకేశ్‌కు సచివాలయంలోని 4వ బ్లాక్‌లో అందజేశారు. ఆయనతో పాటు డిక్షన్ గ్రూప్ ప్రతినిధులు రూ.1 కోటి వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. వారికి మంత్రి ధన్య వాదాలు తెలిపారు.