India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ధాన్యం కొనుగోలు పారదర్శకతతో చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందే గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనెసంచులు అందుబాటులో లేకపోవడం, రవాణాలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం అనే ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.

తెనాలి చెంచుపేటలో ఉదయం జరిగిన తిరుపతిరావు హత్య కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే బాధ్యతలు తీసుకున్న త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఉదయాన్నే హత్య జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీస్ డాగ్ సింబా స్పాట్ నుండి పక్క వీధి మీదగా డొంకరోడ్డు ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది.

రాజస్థాన్లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.

గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన రైస్ మిల్లు యజమాని వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ. కోటి కొల్లగొట్టిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొల్లుకు చెందిన నిందితుడు ఇంటర్ చదివి బెంగుళూరులో వంటమాస్టర్గా పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అలా కొల్లగొట్టిన డబ్బును అతని స్నేహితులు ఖాతాలకు మళ్లించడంతో పాటూ క్రికెట్ బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకోవాలని మున్సిపాలిటీలు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంటింటి పన్నుల పరిశీలన చేపట్టారు. ఇప్పటివరకు పన్నులు వేయని ఆస్తులు, తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్న ఆస్తులను గుర్తించి ఇంటింటి సర్వే చేపట్టారు. దీంతో పన్నుల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. గుంటూరు: 460, మంగళగిరి: 397, తెనాలి: 84, పొన్నూరు: 31, లక్షల్లో ఆదాయం సమకూరింది.

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ (ఐపీఎస్) ఆదివారం హెచ్చరించారు. బాణాసంచా దుకాణం వద్ద నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలన్నారు. విక్రయాలలో మైనర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

@ కలెక్టర్ తమీమ్ అన్సారియా: 9849904002.
@ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ: 9849904003.
@ గుంటూరు IG సర్వ శ్రేష్ట త్రిపాటి: 9440627241.
@ SP వకుల్ జిందాల్: 8688831300.
@ ASP అడ్మిన్: 8688831302.
@ DMHO విజయలక్ష్మీ: 9849902337.
@ DEO రేణుక: 9849909107.
@ DFO: 9949991062.
@ DTC: 9154294107.
@ గుంటూరు RTC RM: 9959225412.
@ Lost Cellphone Whatsapp:8688831574.

అక్టోబర్ 12, 2005న సమాచార హక్కు చట్టం (RTI) దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరుకునే, తెలుసుకునే హక్కును కల్పించింది. గ్రామస్థాయిలో పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖలు వంటి విభాగాల్లో అవినీతి, నిర్లక్ష్యంపై ప్రశ్నలు వేయగలిగారు. గుంటూరు జిల్లాలో అనేక సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని వినియోగించి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను బయటపెట్టారు.

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే PGRS కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు రాయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు ప్రజలకు సులభతరం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఫిర్యాదుదారులు ఉపయోగించుకోవాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.