India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం 6.30గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకుంటారు. స్క్యూ బ్రిడ్జి దాటిన తర్వాత వెటర్నరీ జంక్షన్ మీదుగా పీవీపీ మాల్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న బెంజ్ సర్కిల్ దాకా.. రాత్రి 7 నుంచి 8 వరకు రోడ్ షో నిర్వహిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నగరాలు, ప్రత్తిపాడు గోరంట్ల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటర్లు తప్ప ఇంకెవరు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈనెల 8న విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేసినట్లు గుంటూరు ఎస్పీ తుషార్ తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపుకు వెళ్ళు వాహనాలను బుడంపాడు నుంచి నారాకోడూరు- చేబ్రోలు, భట్టిప్రోలు, రేపల్లె, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవే 16 మీదగా వెళ్లాలన్నారు. గుంటూరు నుంచి హైదరాబాదుకు వెళ్లే వాహనాలు చుట్టుగుంట పేరేచర్ల -సత్తెనపల్లి- పిడుగురాళ్ల మీదుగా హైదరాబాదు వెళ్లాలన్నారు.
రాష్ట్రానికి పూర్వ వైభవం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. మంగళవారం చెరుకుపల్లి మండలం బలుసులవారిపాలెం, మెట్టగౌడవారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేపల్లె అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ది చేశాడన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో సత్యప్రసాద్ను గెలిపించాలని కోరారు.
క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామ పరిధిలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై తల్లీ కూతుళ్లు మృతి చెందారు. చనిపోయినవారు బొందల నాగేంద్రం (52) నాగరాణి (25)గా గుర్తించారు. వీరిద్దరూ పొలానికి వెళ్లి వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన ప్రారంభమై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. పొన్నూరులో సచివాలయ ఉద్యోగి తిరుమేళ్ల కిషోర్ బాబు అనుమానాస్పదంగా మృతిచెందాడు. విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం 6గంటలకు వాటర్ లెవెల్స్ తీయడానికి మున్సిపల్ వాటర్ వర్క్స్లోని 100 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు వచ్చి ట్యాంక్లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరకుమార్ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిలకలూరిపేట రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న పోస్టల్ బ్యాలెట్కు బదులుగా ఈవీఎం పేపర్లను అధికారులు జారీ చేశారు. దీంతో ఇరువురిపై చర్యలు తీసుకున్నారు. 5న ఓటింగ్లో పాల్గొన్న 1,219మంది ఉద్యోగులు 8, 9 తేదీల్లో ఓటు వేయాలని సూచించారు.
రాజమండ్రిలో సోమవారం జరిగిన ప్రధాని మోదీ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీని మంగళగిరి చేనేత కండువాతో నారా లోకేశ్ సత్కరించారు. ప్రధానిని చేనేత కండువాతో సత్కరించడంతో మంగళగిరిలోని చేనేత వర్గీయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పర్యటన చేస్తున్నారు. నేటి నుంచి తిరిగి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.
సినీ హీరో నారా రోహిత్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం ఆయన పొన్నూరు, రేపల్లెలో పర్యటించనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అనగాని సత్యప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.
పల్నాడు జిల్లాలో మొత్తం 16,282 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోగా, రెండు రోజుల కాలంలో 9364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల కాలంలో 4,722 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 20,755 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 5,751 మంది ఉన్నారు. గుంటూరు తూర్పులో 2,778 మంది ఉన్నారు.
Sorry, no posts matched your criteria.