Guntur

News January 28, 2025

సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య సంఘాల కృతజ్ఞతలు 

image

ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ విదియ తిథి నాడు రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 181 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్యవైశ్య సంఘాలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎంను కలిసిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

News January 27, 2025

GNT: పెద్దకర్మకు వెళ్లి అఘాయిత్యం

image

మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన దారుణ ఘటన వేమూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఆంజనేయులు వేమూరు మండలం జంపని గ్రామంలో ఈనెల 23వ తేదీన బంధువుల పెద్ద కర్మకు వచ్చాడు. అక్కడ అదే రోజు అర్ధరాత్రి కూతురు వరుసయ్యే మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆంజనేయులను అదుపులోకి తీసుకొని తెనాలి కోర్టులో హాజరు పరిచామన్నారు.

News January 27, 2025

తాడేపల్లి: డిపాజిట్ మెషీన్‌లో దొంగ నోట్లు

image

తాడేపల్లిలో ఓ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో ఉన్న డిపాజిట్ మెషీన్‌లో దొంగ నోట్లు ప్రత్యక్షం అయ్యాయి. ఓ యువకుడు రూ. 50 వేలు డిపాజిట్ చేసేందుకు రాగా రూ. 32 వేలము మాత్రమే డిపాజిట్ అయ్యాయి. దీంతో అతను బ్యాంకు అధికారులను సంప్రదించగా మిగతా అమౌంట్ దొంగ నోట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News January 26, 2025

గుంటూరు జిల్లా ఉత్తమ తహశీల్దార్‌గా గోపాలకృష్ణ

image

గుంటూరు జిల్లా ఉత్తమ తహశీల్దార్‌గా తెనాలి తహశీల్దార్ గోపాలకృష్ణ అవార్డు అందుకున్నారు. ఆయన అందించిన ఉత్తమ సేవలకు గాను గుంటూరు జిల్లా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. తెనాలి తహశీల్దార్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారని పేరుంది. 

News January 26, 2025

ఉండవల్లిలో సీఎం నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు

image

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం చంద్రబాబు ఎగురవేశారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

News January 26, 2025

గుంటూరు జిల్లాలో నేడు ఆ రెండు బంద్

image

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. తిరిగి సోమవారం ఉద‌యం తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం మ‌ద్యం, మాంసం విక్ర‌యించే దుకాణదారుల‌కు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావ‌డంతో మందు, ముక్క‌తో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామ‌నుకున్న వారికి ఇది బ్యాడ్‌ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

News January 26, 2025

ANU: వన్ టైం ఆపర్చునిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ విద్యార్థులకు రెగ్యులర్, సప్లమెంటరీలతో పాటు 4వ సెమిస్టర్ లో వన్ టైం ఆపర్చునిటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 20లోగా ఫీజులు చెల్లించాలన్నారు. రూ.100 అపరాదంతో ఫిబ్రవరి 24లోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఫీజుల వివరాలు, పరీక్షల షెడ్యూల్ www.anu.ac.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చుని తెలిపారు.

News January 25, 2025

మంగళగిరి: ఏపీఎస్పీ కానిస్టేబుల్ అదృశ్యం

image

మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వబెటాలియన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం లిఖితపూర్వకంగా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.

News January 24, 2025

నిఘా పెట్టి.. నేరాలు నియంత్రణ చేయాలి: ఎస్పీ

image

గుంటూరు జిల్లా నేర విభాగం పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. నేరాల దర్యాప్తు, చోరీకి గురైన సొమ్ము రికవరీ తీరు తదితర అంశాల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా తగిన నిఘా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జైలు నుంచి వచ్చిన నేరస్తులు, దొంగల కదలికలపై నిఘా పెట్టి నేరాలు జరుగకముందే వాటిని కట్టడి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సుప్రజ ఉన్నారు.

News January 24, 2025

 గుంటూరు: మూడు రోజులు పోలీసు కస్టడీకి తులసి బాబు

image

RRRను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును మూడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశించారు. నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో ఒంగోలు ఎస్పీ విచారణాధికారి. ఐదు రోజుల కస్టడీకి పిటీషన్ దాఖలు చేయగా, తులసి తరఫు న్యాయవాదులు అందుకు నిరాకరించారు. కేసు పూర్వపరాలు, వాదోపవాదాల అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించారు.