Guntur

News May 7, 2024

2 రోజుల్లో 9,364 మంది ఓటు హక్కు వినియోగం

image

పల్నాడు జిల్లాలో మొత్తం 16,282 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, రెండు రోజుల కాలంలో 9364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల కాలంలో 4,722 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 20,755 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 5,751 మంది ఉన్నారు. గుంటూరు తూర్పులో 2,778 మంది ఉన్నారు.

News May 7, 2024

గుంటూరు: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

image

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్(35) దంపతులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారు చేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడులోని జగనన్న కాలనీ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొట్టి చంపేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కేసును ఛేదించారు.

News May 7, 2024

చిలకలూరిపేట: భావోద్వేగానికి గురైన వెంకటకుమారి

image

చిలకలూరిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా తరలివచ్చిన మహిళల సమక్షంలో కొంగుపట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నా అంటూ పుల్లారావు సతీమణి వెంకటకుమారి కన్నీటి పర్యంతమయ్యారు. పాతికేళ్ల ప్రస్థానంలో ప్రతిక్షణం చిలకలూరిపేట ప్రజల కోసమే ఆయన ఆలోచించారన్నారు. మంచి మనిషిపై గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో అభాండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

News May 7, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించాలి: బాపట్ల కలెక్టర్

image

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం బాపట్ల జిల్లాలోని కర్లపాలెం, చందోలు గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. గత ఎన్నికల పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ఉంటుందన్నారు.

News May 6, 2024

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో తొలి MP ఎవరంటే!

image

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో తొలిసారి 1952వ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎల్.వి.ఎల్ లక్ష్మీ నరసింహం, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా ఎన్.జి రంగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నరసింహం 17,517 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుంటూరు లోక్ సభ స్థానానికి ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఈయనకు మద్దతిచ్చింది. 

News May 6, 2024

GNT: భర్తను హత్య చేయించిన భార్య, ప్రియుడి అరెస్ట్

image

భర్తను హత్య చేయించిన భార్యను, <<13183665>>ఆమె ప్రియుడిని<<>> సోమవారం కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. ప్రేమ్ కుమార్ పండ్ల వ్యాపారం చేస్తుండేవాడు. అతని భార్య భారతి సమోసాలు తయారీకి వెళ్లి యజమాని గౌస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రేమ్ కుమార్ ఆమెను మందలించగా.. తమకు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని ప్రియుడు సూచించాడు. గౌస్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రేమ్‌కు మద్యం తాగించి హత్య చేశారు.

News May 6, 2024

ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ

image

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేయడంతో నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News May 6, 2024

నరసరావుపేటలో ఉద్రిక్తత

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పల్నాడు రోడ్డులో ఉన్న SSN కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం బయట టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ కారు ధ్వంసమైంది. దీంతో కేంద్ర బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టగా.. పలువురు రాళ్లు రువ్వారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News May 6, 2024

గుంటూరు: హోం ఓటింగ్‌లో 2,069 ఓట్ల పోలింగ్

image

జిల్లాలో హోం ఓటింగ్ ఎంచుకున్న వారికి సంబంధించి ఆదివారం మంగళగిరిలో 124, పొన్నూరులో 21 కలిపి 145 ఓట్లు పోలయ్యాయి. 3, 4 తేదీల్లో జరిగిన పోలింగ్లో 1,924 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2348 మందికి హోం ఓటింగ్ ను ఎంచుకోగా ఇప్పటివరకూ 2069 మంది ఓటు వేశారు. ఇప్పటి వరకూ తాడికొండ నియోజకవర్గంలో 336, మంగళగిరి 440, పొన్నూరు 284, తెనాలి 344, ప్రత్తిపాడు 360, గుంటూరు వెస్ట్ 210, గుంటూరు ఈస్ట్ 95 మంది ఓట్లు వేశారు.

News May 6, 2024

గుంటూరు జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం

image

గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 97.6 శాతం హాజరు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 4029 మందికిగాను 3933 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే వేసవి తీవ్రత వల్ల అభ్యర్థులతోపాటు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు అసౌకర్యానికి గురయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.